Ponnam Prabhakar : బలహీన వర్గాల నోటి కాడి ముద్ద లాగొద్దు
- 42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేసిన మంత్రి
- కుల సర్వే ఆధారంగా తీసుకున్న కీలక నిర్ణయం
- రాజ్యాంగబద్ధ రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బందులు లేవని హామీ
- బీఆర్ఎస్ పాలనపై విమర్శలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar : బలహీన వర్గాల రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వెనకడుగు వేయదని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. 42 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కుల గణన సర్వే నిర్వహించామని, ఆ సర్వే ఆధారంగా సబ్ కమిటీ ఏర్పాటు చేసి రిజర్వేషన్లు పెంచే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ నిర్ణయానికి చట్టసభలలో అన్ని పార్టీల మద్దతు లభించిందని, మూడ్ ఆఫ్ హౌజ్ తీసుకున్న తర్వాతే బిల్లు ఆమోదించబడి గవర్నర్కు పంపించామని చెప్పారు. అనంతరం గవర్నర్ రాష్ట్రపతికి ఆమోదం కోసం పంపారని తెలిపారు.
Also Read
- Hyderabad: మహిళపైకి దూసుకెళ్లిన ప్రొడ్యూసర్ కారు.. "డ్రైవర్నే చంపుకోండి" అంటూ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు..
- OTR : కొందరు 'దరిద్రుల' వల్లే పార్టీ మారా!: పోచారం
- HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
- Ponguleti Srinivas : తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లు.. కేంద్రానికి మంత్రి పొంగులేటి బిగ్ రిక్వెస్ట్..
తమిళనాడు ఉదాహరణను ప్రస్తావిస్తూ, గవర్నర్, రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న ప్రతిపాదనలు కూడా రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చని కోర్టు ఇటీవల తీర్పు ఇచ్చిందని పొన్నం గుర్తు చేశారు. దాని ప్రకారం తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 9 ద్వారా 42 శాతం రిజర్వేషన్లను ఖరారు చేసిందని అన్నారు. “10 శాతం EWS రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఎవ్వరూ వ్యతిరేకించలేదు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా వచ్చిన రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు” అని మంత్రి హామీ ఇచ్చారు.
“రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు బలహీన వర్గాల భవిష్యత్తు కోసం. మా నోటి కాడి ముద్ద లాగవద్దు. తెలంగాణ సమాజం మొత్తం కలిసి ఈ రిజర్వేషన్లను కాపాడుకోవాలి. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ ఛాంపియన్” అని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గతంలో బీఆర్ఎస్ పాలనపై విమర్శలు చేశారు. “పది ఏళ్లలో ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చారు, ఎంతమందికి మూడు ఎకరాల భూమి ఇచ్చారు? కవిత స్వయంగా చెప్పినట్టుగా వాళ్ల ఇళ్ళలో బంగారం ఉంటే తెలంగాణ అంతా బంగారం కాలేదు” అంటూ ఎద్దేవా చేశారు.
Musi River : పురానాపూల్ వంతెన వద్ద ప్రమాద స్థాయిని దాటిన వరద
తాజావార్తలు
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!
-
Ola, Uber, Rapido: ఓలా, ఉబర్, ర్యాపిడో యూజర్లకు గుడ్ న్యూస్.. ‘అడ్వాన్స్ టిప్’ విధానానికి కేంద్రం చెక్
-
CM Chandrababu: ఇది ప్రారంభం మాత్రమే.. దేశంలోనే నంబర్ వన్ రాజధానిగా అమరావతి..!
-
Raveena Tandon : కూతురిని మించి జెట్ స్పీడ్లో సినిమాలు చేస్తున్న ఒకప్పటి గ్లామరస్ బ్యూటీ
-
Dharman: ‘ధర్మన్’ రెండో షెడ్యూల్ షూటింగ్ మొదలు పెట్టిన రజనీకాంత్.. 2027 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్!
ట్రెండింగ్
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!