Case Against Teacher: తోటి మహిళా టీచర్పై అత్యాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వారిద్దరు ఉపాధ్యాయులే. తోటి ఉపాధ్యాయురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆమెని బెదిరించి అత్యాచారం చేసిన ఘటన ఇది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు వెలుగు చూసింది. నిందితుడు పరారీలో ఉన్నాడు. ఖమ్మం జిల్లాకు చెందిన ఉపాధ్యాయుదు నమ్మించి, బెదిరించి మరో ఉపాధ్యాయురాలిని మోసం చేసి అత్యాచారం చేశాడు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెం ప్రభుత్వ పాఠశాలలో ఎస్జీటీ టీచర్ గా పనిచేస్తున్న బానోతు కిషోర్ అదే మండలంలో మరో పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని నమ్మించి, తనతో పాటు తీసుకెళ్లి ,బెదిరింపులకు పాల్పడి అత్యాచారం చేశాడు.
కీచక ఉపాధ్యాయుడు కిషోర్ తాను మండల పిఆర్టీయు నాయకుడు అని కూడా చెబుతూ భయబ్రాంతులకు పాల్పడ్డాడు. ఉపాధ్యాయ సంఘానికి చెందిన నాయకుడు కావడంతో అతనితో మంచిగా మసలుకుంది బాధిత మహిళ. ఆమె ప్రతిరోజు గార్ల మండలానికి ఖమ్మం నుండి రైలు ద్వారా తన విధులకు వెళ్లి వస్తుండేది. కీచక ఉపాధ్యాయుడు కిషోర్ అతడి భార్య కూడా ఇదే మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఈ భార్యాభర్తలు ప్రతిరోజు ఖమ్మం నుండి తమ కారు ద్వారా గార్ల మండలానికి వెళ్తూ వస్తుండేవారు. ఈ క్రమంలో వారి మధ్య పరిచయం కూడా ఉంది. ఒకరోజు భార్యాభర్తలు బాధిత మహిళను తమ కారులో ఆహ్వానించారు.
Also Read
- Hyderabad Horror: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Bandi Bhageerath: బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం.. మరో సిట్ ఏర్పాటు!
- Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
ఇష్టం లేకపోయినా వారి బలవంతం మీద కారులో ఒకటి రెండుసార్లు ఆమె ఖమ్మంకు వచ్చింది. బాధిత మహిళ మీద కన్నేసిన కిషోర్ అవకాశం కోసం ఎదురుచూశాడు. ఈనెల 17వ తేదీన సాయంత్రం ఆమె ఒంటరిగా గార్ల రైల్వే స్టేషన్ లో రైలు కోసం నిలబడి ఉంది. ఇదే అదునుగా భావించి, తాను తన భార్య కారులో పోతున్నామని ఖమ్మంలో దింపుతామని, చెప్పటంతో బాధిత మహిళా టీచర్ కిషోర్ కారు ఎక్కింది.
ఆ వెంటనే అతడి భార్య గురించి అడగ్గా వచ్చే స్టేజీలో ఎక్కుతుందని నమ్మించాడు. ఆ విధంగా పై స్టేజ్లో ఆపై స్టేజ్లో తన భార్య కారు ఎక్కు తుందని నమ్మించాడు. ఖమ్మం నగరంలోని పాండురంగాపురం ప్రాంతంలో గల ఒక ఇంట్లోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవ్వరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో మహిళ ధైర్యం చేసి రెండు రోజుల తరువాత భర్తకు సమాచారం ఇచ్చింది. ఖమ్మం అర్బన్ పోలీసు స్టేషన్లో భార్యాభర్తలు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
-
Salman Khan: ఒంటరితనం పోస్ట్ వెనుక అసలు నిజం చెప్పిన సల్మాన్ ఖాన్..
-
US Cuba Drone Tension: ఇరాన్కు తీసిపోని క్యూబా.. అమెరికా దాడి చేస్తే భారీ రక్తపాతమే!
-
Hyderabad Horror: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
-
Peddi : ‘పెద్ది’ ట్రైలర్పై రిషబ్ శెట్టి ప్రశంసలు..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!