Case Against Teacher: తోటి మహిళా టీచర్పై అత్యాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వారిద్దరు ఉపాధ్యాయులే. తోటి ఉపాధ్యాయురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆమెని బెదిరించి అత్యాచారం చేసిన ఘటన ఇది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు వెలుగు చూసింది. నిందితుడు పరారీలో ఉన్నాడు. ఖమ్మం జిల్లాకు చెందిన ఉపాధ్యాయుదు నమ్మించి, బెదిరించి మరో ఉపాధ్యాయురాలిని మోసం చేసి అత్యాచారం చేశాడు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెం ప్రభుత్వ పాఠశాలలో ఎస్జీటీ టీచర్ గా పనిచేస్తున్న బానోతు కిషోర్ అదే మండలంలో మరో పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని నమ్మించి, తనతో పాటు తీసుకెళ్లి ,బెదిరింపులకు పాల్పడి అత్యాచారం చేశాడు.
కీచక ఉపాధ్యాయుడు కిషోర్ తాను మండల పిఆర్టీయు నాయకుడు అని కూడా చెబుతూ భయబ్రాంతులకు పాల్పడ్డాడు. ఉపాధ్యాయ సంఘానికి చెందిన నాయకుడు కావడంతో అతనితో మంచిగా మసలుకుంది బాధిత మహిళ. ఆమె ప్రతిరోజు గార్ల మండలానికి ఖమ్మం నుండి రైలు ద్వారా తన విధులకు వెళ్లి వస్తుండేది. కీచక ఉపాధ్యాయుడు కిషోర్ అతడి భార్య కూడా ఇదే మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఈ భార్యాభర్తలు ప్రతిరోజు ఖమ్మం నుండి తమ కారు ద్వారా గార్ల మండలానికి వెళ్తూ వస్తుండేవారు. ఈ క్రమంలో వారి మధ్య పరిచయం కూడా ఉంది. ఒకరోజు భార్యాభర్తలు బాధిత మహిళను తమ కారులో ఆహ్వానించారు.
Also Read
- Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- IPS Transfers: తెలంగాణలో 26 మంది IPSల బదిలీ.. ఎవరికి ఏ పోస్టింగ్.?
ఇష్టం లేకపోయినా వారి బలవంతం మీద కారులో ఒకటి రెండుసార్లు ఆమె ఖమ్మంకు వచ్చింది. బాధిత మహిళ మీద కన్నేసిన కిషోర్ అవకాశం కోసం ఎదురుచూశాడు. ఈనెల 17వ తేదీన సాయంత్రం ఆమె ఒంటరిగా గార్ల రైల్వే స్టేషన్ లో రైలు కోసం నిలబడి ఉంది. ఇదే అదునుగా భావించి, తాను తన భార్య కారులో పోతున్నామని ఖమ్మంలో దింపుతామని, చెప్పటంతో బాధిత మహిళా టీచర్ కిషోర్ కారు ఎక్కింది.
ఆ వెంటనే అతడి భార్య గురించి అడగ్గా వచ్చే స్టేజీలో ఎక్కుతుందని నమ్మించాడు. ఆ విధంగా పై స్టేజ్లో ఆపై స్టేజ్లో తన భార్య కారు ఎక్కు తుందని నమ్మించాడు. ఖమ్మం నగరంలోని పాండురంగాపురం ప్రాంతంలో గల ఒక ఇంట్లోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవ్వరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో మహిళ ధైర్యం చేసి రెండు రోజుల తరువాత భర్తకు సమాచారం ఇచ్చింది. ఖమ్మం అర్బన్ పోలీసు స్టేషన్లో భార్యాభర్తలు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!