Tarun Chugh: బీజేపీ ముక్త్ భారత్ నినాదం హాస్యాస్పదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బీజేపీని, ప్రధానమంత్రిని దూషిస్తూ ఉపయోగిస్తున్న భాషపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇటీవల బీహార్ పర్యటనలోనూ ప్రధాన మంత్రిని సంబోధించడంలో కేసీఆర్ కనీస పరిణతిని కూడా ప్రదర్శించలేదు. ‘‘బిజెపి ముక్త్ భారత్’’ అన్న కేసీఆర్ పిలుపు హాస్యాస్పదంగా ఉంది. సూర్యుడిపై ఉమ్మేస్తే, అది తన ముఖంపైనే పడుతుందన్న విషయాన్ని కేసీఆర్ గుర్తిస్తే మంచిదన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్.
వాస్తవానికి కేసీఆర్ ముక్త్ తెలంగాణ కావాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు. కేసీఆర్ కు రోజులు దగ్గర పడ్డాయి. ఆయనలో నిరాశ, నిస్పృహలు పతాక స్థాయికి చేరుకున్నాయి కనుకనే ముక్త్.. ముక్త్ అంటూ పిచ్చికూతలు కూస్తున్నాడు. బీజేపీపై కేసీఆర్ కు ఎందుకంత కోపం? రాజనీతిజ్ఞుడిగా, ప్రపంచ నాయకుడిగా మన్ననలు పొందుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పట్ల ఆయనకున్న శత్రుత్వానికి కారణమేంటి? లాక్ డౌన్ సమయంలో, మహమ్మారి అనంతర కాలంలో ఉచిత రేషన్ ఇచ్చి, 80 కోట్ల మంది ప్రజలను ఆదుకున్నందుకా? ప్రజలకు 211 కోట్లకు పైగా ఉచిత వ్యాక్సిన్లను అందించినందుకా?
Also Read
- Telangana Job Mela : తెలంగాణలో జాబ్ మేళా.. యువతకు గుడ్ న్యూస్.!
- Rythu Bharosa : రైతులకు గుడ్న్యూస్.. 5-6 ఎకరాలకు రైతు భరోసా జమ
- Hyderabad: జిమ్ ప్రియులకు బిగ్ అలర్ట్.. యువతే టార్గెట్గా స్టెరాయిడ్స్, నిషేధిత ఇంజెక్షన్ల దందా..
- Hyderabad: కల్తీ ఆహారంపై H-ఫాస్ట్ ఉక్కుపాదం.. 100 రోజుల్లో 185 కేసులు నమోదు.! 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు సీజ్..
పేద మహిళలకు 12 కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి, వారికి పొగ రహిత జీవనం కల్పించినందుకా? దేశవ్యాప్తంగా 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించినందుకా? ఆయుష్మాన్ భారత్ కింద 50 కోట్ల మందికి ఉచిత వైద్యం అందించినందుకా? ఇళ్లు లేని పేదలకు 2 కోట్లకు పైగా ఇళ్లు కట్టించినందుకా? పేదలకు లభిస్తున్న ఈ ప్రయోజనాలను దూరం చేసేందుకే కేసీఆర్ ‘‘బిజెపి ముక్త్ భారత్’’ అంటున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. లేకపోతే కేసీఆర్ కు ఎందుకు ఈ ఆలోచన వస్తుంది? అని ప్రశ్నించారు తరుణ్ చుగ్.
Read Also: Pawan Kalyan: పోలీసులు ధర్మంగా పనిచేయాలి.. తీరు మారకుంటే నేనే రోడ్డెక్కుతా..!!
సంక్షేమం, అభివృద్ధి మధ్య చక్కటి సమతుల్యతను నెలకొల్పుతూ ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, ఆత్మ నిర్భర్ భారత్గా, విశ్వ గురువుగా మార్చే దిశగా నడిపిస్తున్నారు. దేశం ‘‘ఆత్మ నిర్భర్ భారత్’’గా మారడం కేసీఆర్కు ఇష్టం లేన్నట్టుంది.రాజకీయంలో చివరి దశకు చేరుకున్న కేసీఆర్ బిజెపిపై, గౌరవ ప్రధానిపై జుగుప్సాకరమైన ప్రకటనలు చేయడం మానుకోవాలి. టీఆర్ఎస్ నిరంకుశ, అవినీతి, కుటుంబ పాలన నుంచి తెలంగాణను విముక్తి చేసేందుకు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని కేసీఆర్ గ్రహించాలని హితవు పలికారు తరుణ్ చుగ్.
తాజావార్తలు
-
Male Fertility: సిగరెట్ మాత్రమే కాదు.. ఈ అలవాట్లు కూడా స్పెర్మ్ కౌంట్ను దెబ్బతీస్తున్నాయి..
-
Om Birla: ప్రజాప్రతినిధులు స్వామి వివేకానంద ఆదర్శాలను ఆచరించాలి
-
Vaibhav Sooryavanshi: ముప్పై ఏళ్ల సచిన్ రికార్డు బద్దలు.. ఎట్టకేలకు టీమిండియా జెర్సీ ధరించిన వైభవ్..
-
Nani Directors : ప్యారడైజ్ లేట్.. బిజీగా నాని డైరెక్టర్స్
-
116 Year Old Woman: తిరుపతిలో నమ్మశక్యం కాని దృశ్యం.. 3550 మెట్లు ఎక్కిన 116 ఏళ్ల బామ్మ! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..