Tammineni Veerabhadram: కేంద్ర బడ్జెట్.. తెలంగాణకు అన్యాయం చేసే విధంగా ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tammineni Veerabhadram: 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్పై సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అసహనం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ పేదరికాన్ని రూపుమాపేదిగా లేదని, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసే విధంగా ఉందని ఆరోపించారు. దేశంలో దారిద్య్రం లేకుండా చేస్తామని, పేదలు లేని భారత్ను ఏర్పాటు చేయడానికి ఈ బడ్జెట్ దోహదపడుతుందని ఘనంగా ప్రకటించిన నిర్మలమ్మ.. ఈ బడ్జెట్లో దారిద్య్ర నిర్మూలనకు ఉపయోగపడే పథకాలతో పాటు ఉత్పత్తి రంగానికి దోహదపడే కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. ఇది తిరోగమన ప్రజావ్యతిరేక కేంద్ర బడ్జెట్ అని ధ్వజమెత్తారు.
Harish Rao: కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది.. బడ్జెట్లో వాటికి రూపాయి ఇవ్వలేదు
Also Read
- Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
- Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
- KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
- Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటాను గణనీయంగా తగ్గించారని తమ్మినేని మండిపడ్డారు. గత సంవత్సరం రాష్ట్రాల నుండి వచ్చే పన్నుల్లో కేంద్రం 42శాతం తిరిగి రాష్ట్రాలకు ఇవ్వగా.. ఇప్పుడు దాన్ని 41 శాతానికి తగ్గించిందన్నారు. తెలంగాణకు కేవలం 2.133 శాతం మాత్రమే తిరిగి వస్తోందని.. అది కూడా సకాలంలో కేంద్రం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15వ ఫైనాన్స్ కమిషన్ కేటాయించిన ప్రకృతి వైపరీత్యాల పరిహారం, స్థానిక సంస్థల నిధులు, మున్సిపాలిటీలకు ఇచ్చే నిధులు, ఉన్నత విద్య, ఆరోగ్యం తదితర రంగాలకు కేంద్రం నుండి రావాల్సిన నిధుల్లో రాష్ట్రానికి కోత పెట్టారన్నారు. రాష్ట్రంలో సాగునీటి వనరులకు నిధులు ఇవ్వాలని కోరినా.. కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తోందన్నారు. పైగా.. రాష్ట్ర నదులపై కేంద్రం బోర్డులు వేసి, తన అధీనంలోకి తీసుకుందని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మాణాలు ఆగిపోయాయని, మంజూరు చేసిన రైల్వేలైన్లకు నిధుల కేటాయింపు తగ్గిందని, దశాబ్దాల తరబడి మంజూరైన కొన్ని పనులు పెండింగ్లోనే ఉన్నాయని అన్నారు. రాష్ట్రంపై కేంద్రం కక్ష్యపూరిత వైఖరితో వ్యవహరిస్తున్నట్లు ఈ బడ్జెట్లో స్పష్టమైందన్నారు.
Cycling: సైక్లింగ్తో క్యాన్సర్ దూరమవుతుందా? నిజమెంత?
ఈ బడ్జెట్లో రూ.10,79,971 కోట్లు వడ్డీలకిందనే చెల్లిస్తున్నారని.. స్వదేశీ, విదేశీ అప్పులు కలిసి రు.137లక్షల కోట్లకు చేరుకున్నట్లు ఎకనమిక్ సర్వే తెలుపుతోందని తమ్మనేని పేర్కొన్నారు. 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల దేశ స్థూల ఉత్పత్తిని సాధిస్తామని ప్రధాని మోడీ ఎన్నోసార్లు ప్రకటించారని.. మరి, రానున్న రెండేళ్ళలో రెట్టింపు స్థూల ఉత్పత్తి పెరుగుతుందా? అని ప్రశ్నించారు. ఈ యేడాది దేశ వృద్ధిరేటు 7 శాతం ఉన్నట్టు చెపుతూనే.. 2023-24లో 6.5 శాతానికి తగ్గుతుందని ఆర్థికమంత్రి చెప్పారని.. ఇలాంటి స్థితిలో దేశాభివృద్ధి ఎలా సాధ్యం అవుతుంది? నిలదీశారు. 2022-23లో ఉపాధిహామి పథకానికి 89,400 కోట్లు కేటాయించగా.. ఈ బడ్జెట్లో 60,000 కోట్లకే పరిమితం చేశారన్నారు. ఆహార సబ్సిడీని గత సంవత్సరంపై 50శాతం తగ్గించారని, గ్యాస్పై సబ్సిడీని కూడా తగ్గించారన్నారు. ఆకలి సూచికలో 140వ స్థానం, విద్యలో 33వ స్థానం, ఆరోగ్యంలో 66వ స్థానం ఉన్న దేశం.. అభివృద్ధి కావడానికి ప్రస్తుత బడ్జెట్ సహకరిస్తుందా? అని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..