Harish Rao: కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది.. బడ్జెట్లో వాటికి రూపాయి ఇవ్వలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao Responds On Central Budget 2023: ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై తెలంగాణ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఈ బడ్జెట్ తీవ్ర నిరాశను మిగిల్చిందని, తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు. ఏ ఒక్క వర్గానికి కూడా మేలు చేయలేదని పేర్కొన్నారు. రైతులు, రైతు కూలీలు, ఉపాధి హామీ కూలీలు, మహిళలు, విద్యార్థుల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం చేశారన్నారు. గుజరాత్లోని గిఫ్ట్ సిటీకి, ఎన్నికలు జరగబోయే కర్ణాటకు మాత్రమే వరాలిచ్చి.. తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన హామీలో ఉన్న గిరిజన యూనివర్సిటీ, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్, ఇండస్ట్రీయల్ కారిడార్, ఇండస్ట్రీయల్ ఇన్సెటివ్స్, మెగా టెక్స్టైల్, ఫార్మా సిటీ మొదలైన వాటి గురించి తాము అడుగుతూనే ఉన్నామని.. అయితే కేంద్రం వాటికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలిపారు.
Cycling: సైక్లింగ్తో క్యాన్సర్ దూరమవుతుందా? నిజమెంత?
Also Read
- Gandhi Sarovar Project : మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్.. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్
- KTR : హామీల ఊసే లేదు.. రాష్ట్రాన్ని మాఫియా నడుపుతోంది
- Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
- Grain Storage Silos: తెలంగాణలో ధాన్యం నిల్వకు అత్యాధునిక సైలోలు.. రూ.4,450 కోట్లతో భారీ ప్రణాళిక.!
కేంద్రప్రభుత్వం ఉపాధి కూలీల పొట్ట కొట్టిందని.. ఇది చాలా బాధాకరమని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 30 వేల కోట్లు కోత పెట్టారని.. అలాగే ఫెర్టిలైజర్ సబ్సిడీ విషయంలో రూ.50 వేల కోట్లు కోత పెట్టారని ఆరోపించారు. పత్తి కొనుగోలు నుండి కేంద్రం తప్పుకుందా అని అనుమానం కలుగుతుందని సందేహం వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం సీసీఐకి పత్తి కొనుగోలు విషయంలో బడ్జెట్లో పూర్తి స్థాయిలో కోత పెట్టారని వెల్లడించారు. గతంలో 157 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇచ్చిన కేంద్రం.. తెలంగాణకు మాత్రం అన్యాయం చేసిందని, రాష్ట్రానికి ఒక్క ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని అన్నారు. నర్సింగ్ కాలేజీ ఏర్పాటులో కూడా మొండి చేయి చూపారన్నారు. తెలంగాణ పట్ల బీజేపీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందన్నారు. అసలు తెలంగాణకు ఏమిచ్చారు? రాష్ట్రానికి ఎందుకు ఇవ్వడం లేదు? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
Mytri Movie Mekars: మరో ‘వార్’ కన్ఫామ్ రా.. ఫిక్స్ చేసేసుకోండి
తెలంగాణ రాష్ట్రానికి, రైతులకు, రైతు కూలీలకు అన్యాయం చేశారని.. ఇది అందరినీ తీవ్ర నిరాశను మిగిల్చిందని హరీశ్ రావు వాపోయారు. పెట్రోల్, డీజిల్పై సెస్తో పాటు గ్యాస్ సిలిండర్ ధర తగ్గిస్తారేమోనని అనుకున్నామని.. అలాగే పేద మధ్యతరగతి మహిళలకు ఏదైనా శుభవార్త చెప్తారేమోనని భావించామని.. కానీ చివరకు నిరాశే మిగిలిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పూర్తిగా రైతు వ్యతిరేక బడ్జెట్, నిరుద్యోగుల వ్యతిరేక బడ్జెట్, మహిళల వ్యతిరేక బడ్జెట్, రైతు కూలీల వ్యతిరేక బడ్జెట్ అని ఆరోపించారు.
Rajagopal Reddy: ఓటమి భయంతోనే కేసీఆర్ తన పార్టీ పేరు మార్చారు
తాజావార్తలు
-
Ragi Bellam Cake: చిన్న గిన్నెల్లోనే ఎగ్లెస్ రాగి బెల్లం కప్ కేక్స్.. హెల్తీ అండ్ టేస్టీగా ఇలా చేసుకోండి!
-
Meloni-Trump: ఇటలీ ఎప్పుడూ అలా చేయదు.. ట్రంప్పై మెలోని తీవ్ర ఆగ్రహం
-
Sai Krishna Missing Case: సాయి కృష్ణ కుటుంబానికి అండగా ప్రభుత్వం.. సీఎం భరోసాతో సంతృప్తి వ్యక్తం చేసిన తల్లి
-
Sunil Gavaskar: గిల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్పై గవాస్కర్ ప్రశంసలు.. ఆ ‘గట్ ఫీల్’ గురించే అంటూ వ్యాఖ్యలు..
-
Gandhi Sarovar Project : మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్.. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?