సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా మరోసారి తమ్మినేని వీరభద్రం ఎన్నిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీర భద్రం మరోసారి ఎక గ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఈ పదవిని చేపట్టడం తమ్మినేని వీరభద్రానికి ఇది మూడో సారి. కాగా.. 60 మంది కార్యవర్గ సభ్యుల ఎన్నికను కూడా పూర్తి చేశారు. రంగారెడ్డి జిల్లా తుర్కాయంజాల్ ఆదివారం నుంచి సీపీఎం తెలంగాణ రాష్ట్ర పార్టీ 3 వ మహాసభలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలోనే సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీర భద్రం మరోసారి ఏక గ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వచ్చే మూడేళ్లు జనంలోనే ఉంటామన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు కలిసి పనిచేసే శక్తుల్లో ఎవరితో వెళ్లాలనేది నిర్ణయిస్తామన్నారు. టీఆర్ఎస్ తప్పులను ఎత్తి చూపుతాం అదే సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా పని చేస్తే మద్దతు ఇస్తామని తమ్మినేని అన్నారు.
Read Also: రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
Also Read
అన్ని రకాల ఉద్యమాలకు సిద్ధమని ప్రకటించారు. వచ్చే రెండేళ్లలో లెఫ్ట్ పార్టీలకే కాదు ..అన్ని రాజకీయ పార్టీలకు సవాళ్లు ఎదురవుతాయన్నారు. రాజకీయ కార్యచరణ పై మాకు క్లారిటీ ఉందని తమ్మినేని అన్నారు. మొదటగా… రాష్ట్ర కార్యదర్శి రేసులో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీఐటీయూ నేత ఎస్ వీరయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నేత వెంకట్ల పేర్లు కూడా వినిపించాయి. కానీ చివరి క్షణంలో.. తమ్మినేని వీర భద్రానికే సీపీఎం పార్టీ పగ్గాలు లభించాయి. దీంతో మిగతా వారికి నిరాశ మిగిలింది. ఇక ఈ పదవీ రావడంపై తమ్మినేని వీర భద్రం హర్షం వ్యక్తం చేశారు. మళ్లీ పదవి దక్కుతుందని అనుకోలేదని చెప్పారు. పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని తమ్మినేని వెల్లడించారు. వెల్లడించారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!