Tammareddy Bharadhwaj : తెలంగాణలో లొకేషన్ ఛార్జీలు తీసేయాలి : తమ్మారెడ్డి భరద్వాజ్
సినీ పరిశ్రమకు చాలా సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ మంత్రి తలసానికి వినతిపత్రం సమర్పించామని సినీ నిర్మాత తమ్మారెడ్డ భరద్వాజ అన్నారు. ఇప్పటికే చిరంజీవి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసి సమస్యల గురించి చర్చించారని ఆయన అన్నారు. ఆన్లైన్ బుకింగ్ తెస్తామని రెండు ప్రభుత్వాలు చెప్పాయని, బుక్ మై షో వాళ్ళు టికెట్పై 15 నుంచి 25 రూపాయల వరకు ప్రజల నుంచి వసూలు చేస్తున్నారని అన్నారు. ఆన్లైన్ వస్తే దోపిడీ పోతుంది. ప్రొడ్యూసర్ కు డబ్బులు కూడా వస్తాయని, ఆన్లైన్ బుకింగ్ ఛాంబర్ తో కలిసి ఉండాలి. ప్రభుత్వం తీసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకుంటే కుదరదని ఆయన అన్నారు.
ఇంగ్లీషు, హిందీ సినిమాలకు క్యూబ్ వంటి సంస్థలు ఛార్జ్ చేయరు. తెలుగు, చిన్న సినిమాల వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుంటారు. దాంతో నష్టం వస్తుందని ఆయన వెల్లడించారు. ట్రాన్స్ ఫర్ ఛార్జీ కూడా తీసుకుంటున్నారని, టిక్కెట్ రేట్లు అనేది చాలా చిన్న ఇష్యూ అని ఆయన అన్నారు. తెలంగాణలో టిక్కెట్ రేట్లు పెంచారు. కానీ తగ్గించక పోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, రేట్లు పెంచితే డబ్బులు వస్తాయనేది భ్రమ అని ఆయన తెలిపారు. ఆంధ్రలో పుష్పా సినిమా ఎక్కువ డబ్బులు రాబట్టిందని, అఖండా కంటే పుష్పా ఎక్కువ పోయిందని ఆయన పేర్కొన్నారు. ఎక్కువ స్క్రీన్ లలో సినిమా వేస్తే డబ్బులు వస్తాయని, 200 కోట్లు సినిమా ఉంటే 80 కోట్లు ట్యాక్స్ కట్టాలని, వెయ్యి కోట్లకు 20 కోట్లు ట్యాక్స్ కట్టాలని ఆయన అన్నారు.
Also Read
- TIMS Sanathnagar: సనత్నగర్ వాసులకు శుభవార్త.. శుక్రవారం నుంచి టిమ్స్లో వైద్య సేవలు ప్రారంభం..!
- Telangana Fuel Supply : తెలంగాణలో ఇంధన సంక్షోభానికి సర్కార్ చెక్
- Bhatti Vikramarka : ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యం
- Tragedy : పాఠశాల ముందు మృత్యువు..! ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం
ప్రభుత్వంతో అన్ని సరి చేసుకోవాలి. ఐదు షోలు కొన్నింటికి పెట్టుకోవాలని, 2013 నుంచి అవార్డులు ఇవ్వడం లేదన్నారు. చిన్న సినిమాలకు ఏపీలో సబ్సిడీలు ఇవ్వాలని, తెలంగాణలో సింహా అవార్డులు ఇస్తామన్నారు. ఇవ్వడం లేదని ఆయన వెల్లడించారు. తెలంగాణలో లొకేషన్ ఛార్జీలు తీసేయాలని, మినీ థియేటర్లు ఎక్కువగా రావాల్సి ఉంది. వాటి వల్ల రెవెన్యూ బాగా వస్తుంది. థియేటర్లకు ఇండస్ట్రీయల్ పవర్ టారిఫ్ తీసుకోవాలని, కరోనా సమయంలో థియేటర్లకు కరెంటు బిల్లు రెండు రాష్ట్రాలు మినహాయింపు ఇవ్వలేదని, ఇండస్ట్రీ నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేవు. సినీ పరిశ్రమ కూడా తప్పులు చేసిందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
OnePlus Realme Merger: విలీనం కానున్న వన్ప్లస్, రియల్మీ..!?
-
Muttiah Muralitharan: “ఐపీఎల్ అంటేనే వ్యాపారం.. క్రికెట్ ఎక్కడుంది?”.. SRH కోచ్ షాకింగ్ కామెంట్స్!
-
Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..
-
West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
-
Chips and Soft Drinks Side Effects : చిప్స్ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు.!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!