TSRTC: టీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్.. అందుబాటులోకి ‘టీ-9 టికెట్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSRTC: గ్రామీణ, పట్టణ ప్రయాణికులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పల్లె వెలుగు బస్సులో ప్రయాణించే మహిళలు, వృద్ధుల కోసం ‘టి-9 టిక్కెట్’ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీ-24, టీ-6, ఎఫ్-24 టిక్కెట్లను అందిస్తున్న సంస్థ.. తొలిసారిగా గ్రామీణ, పట్టణ ప్రయాణికుల సౌకర్యార్థం టీ-9 టికెట్ ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. శుక్రవారం హైదరాబాద్లోని బస్భవన్లో టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ‘టీ-9 టిక్కెట్’ పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ నెల 18(ఆదివారం) నుంచి పల్లె వెలుగు బస్సుల్లోని కండక్టర్ల నుంచి ఈ టికెట్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు మరియు సీనియర్ సిటిజన్లకు ‘T-9 టికెట్’ వర్తిస్తుంది. ఈ టిక్కెట్టు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఈ టిక్కెట్తో రానుపోను ఒకసారి 60 కిలోమీటర్ల లోపు ప్రయాణించవచ్చు. టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ‘టీ-9 టిక్కెట్’ ధరను రూ.100గా నిర్ణయించింది. టోల్ గేట్ ఛార్జీలపై మినహాయింపు. ఈ టికెట్ ద్వారా ఒక్కొక్కరికి రూ.20 నుంచి రూ.40 వరకు ఆదా అవుతుందని కంపెనీ ప్రకటించింది. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు వయస్సు ధృవీకరణ కోసం తమ ఆధార్ కార్డును కండక్టర్లకు చూపించడం ద్వారా T-9 టిక్కెట్ను పొందవచ్చు.
Also Read
- Telangana Sports : గాయత్రి-త్రిసాకు సీఎం రేవంత్ అభినందనలు.. గోపీచంద్తో స్పెషల్ మీట్
- Hyderabad Pan Masala Raid: హైదరాబాద్లో పాన్ మసాలా దందా.. రూ.160 కోట్ల స్కామ్..
- Kishan Reddy: రేవంత్ అమెరికా టూర్ రద్దు.. కిషన్ రెడ్డి కౌంటర్..!
- Telangana Congress : కాంగ్రెస్లో బిగ్ షాక్.. కొండా సురేఖ, చిన్నారెడ్డికి ఎసరు.?
Read also: Kodali Nani: నవనీత్ కౌర్, సుమలత ఎంపీలు అయ్యారు.. పవన్ కల్యాణ్ ఇంకా..!
కండక్టర్లు ఈ టిక్కెట్లను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే జారీ చేస్తారు. ఈ టికెట్ తెలంగాణ రాష్ట్రంలో చెల్లుతుంది. పల్లె వెలుగు బస్సుల్లో రోజుకు సగటున 15 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు, సీనియర్ సిటిజన్లు ఉన్నారు. వారిపై ఆర్థిక భారం తగ్గాలనే ఉద్దేశంతో పల్లెవెలుగు బస్సుల్లో టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ‘టీ-9 టిక్కెట్’ను ప్రారంభించింది. ఈ టిక్కెట్టుతో రూ.100 చెల్లించి 60 కిలోమీటర్ల పరిధిలో రానుపోను ప్రయాణించవచ్చు. గ్రామీణ, పట్టణ ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని సంస్థను ఆదరించాలని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ కోరారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే టీ-24, టీ-6, ఎఫ్-24 టికెట్లను అందుబాటులోకి తెచ్చామని, వాటికి ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని గుర్తు చేశారు. టిక్కెట్లకు మంచి స్పందన లభిస్తున్నందున గ్రామీణ, పట్టణ ప్రయాణికుల కోసం తొలిసారిగా ‘టి-9 టిక్కెట్’ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ టికెట్కు సంబంధించిన పూర్తి వివరాల కోసం TSRTC కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033లను సంప్రదించాలని సూచించారు.
Missing Case: మిస్టరీగా హర్షవర్థన్ మిసింగ్ కేస్.. 17 గంటలు దాటిన దొరకని ఆచూకి
తాజావార్తలు
-
Romanchakam Trailer: సందీప్ రెడ్డి వంగా ప్రెజెంట్స్.. ‘రోమాంచకం’ ట్రైలర్లో ఏదో గట్టిగానే ఉంది!
-
Telangana Sports : గాయత్రి-త్రిసాకు సీఎం రేవంత్ అభినందనలు.. గోపీచంద్తో స్పెషల్ మీట్
-
Tamil Nadu: పొట్టి దుస్తుల వైరల్ వీడియోపై మహిళ ఆవేదన.. బాధ్యతగా ఉండాలని విజ్ఞప్తి
-
Healthy Snacks: నో జంక్.. ఓన్లీ హెల్తీ స్నాక్! ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు..
-
Hyderabad Pan Masala Raid: హైదరాబాద్లో పాన్ మసాలా దందా.. రూ.160 కోట్ల స్కామ్..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!