ఇంత మంది పీకేలు ఉండగా.. మనకు పీకే అవసరమా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి.. తొలిరోజే.. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరును ప్రస్తావించారు.. గాంధీ భవన్లో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే పీకేను సలహాదారుగా పెట్టుకోవాలి అని కొందరు మిత్రులు సలహా ఇస్తున్నారు.. కానీ, తెలంగాణలో ఉన్న ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త ఓక పీకేయే నని.. ఇంత మంది పీకేలు ఉండగా.. మనకు పీకే అవసరమా..? అని ప్రశ్నించారు.. ఇక, సోనియా, రాహుల్ గాంధీలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన ఆయన.. నా భాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి వచ్చిన పార్టీ నేతలందరికీ పేరు పేరునా ధన్యవాదాలు అన్నారు.. వర్షం పడుతూ ఆ దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాడన్న కొత్త పీసీసీ చీఫ్.. పోచమ్మ, ఎల్లమ్మ, లక్ష్మీనరసింహస్వామి దయతో పాటు సోనియమ్మ ఆశీస్సులతో ఈ పదవి చేపడుతున్నా అన్నారు.
సభా వేదిక నుంచి ఈ రోజు చెబుతున్నా.. జై సోనియమ్మ, రాహుల్ గాంధీల నినాదాలు తప్ప మరో వ్యక్తి నినాదం వినిపించకూడదని స్పష్టం చేవారు రేవంత్రెడ్డి.. సోనియా, రాహుల్ నినాదం మినహా మరో వ్యక్తి నినాదం చేస్తే.. ఎంతటి వారినైనా క్షమించమని హెచ్చరించారు.. నా అభిమానులకు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా.. ఈ రోజు నుంచి వ్యక్తుల నినాదాలు ఇవ్వొద్దని సూచించారు. మన తెలంగాణ తల్లి… తెలంగాణ ఇచ్చిన సోనియమ్మే.. నాలుగు కోట్ల ప్రజలు తమ ఇళ్లలో సోనియమ్మ ఫొటో పెట్టుకోవాలని.. నాయకుల సందేశాన్ని ప్రతీ గడపగడపకు తీసుకెళ్లాలని సూచించారు రేవంత్.. వేలాది మంది సైనికులకు నాయకుడు ముందు ఉంటే.. ఈ ప్రపంచాన్ని గెలువొచ్చు.. అలా ముందుకు నడిపించే సోనియా, రాహుల్ గాంధీ ఉన్నారన్నారు. ఇక, టీఆర్ఎస్ సర్కార్ నిరుద్యోగులు, దళితులు, బడుగు బలహీన వర్గాలను నయవంచనకు గురిచేస్తోందని మండిపడ్డ ఆయన.. కరోనా కంటే డేంజర్.. మోడీ, కేసీఆర్ అని వ్యాఖ్యానించారు.. ప్రతీ కార్యకర్త రెండు సంవంత్సరాలు ఇంటికి సెలవు పెట్టాలి.. రెండేళ్లు కష్టపడితే.. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చినప్పుడు లక్ష ఉద్యోగాలు ఖాళీగా ఉంటే… ఇప్పుడు లక్షా 90వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని గుర్తు చేశారు న్యూ పీసీసీ చీఫ్.. సీఎం కేసీఆర్, ఆయన కుటుంబాన్ని రాష్ట్ర పొలిమేరలు దాటించాలని.. అప్పుడే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. రావణాసురుడు సీతమ్మను ఏం చేసాడో మనకు తెలుసు.. ఇప్పుడు కేసీఆర్ రావణాసురుడు వలె తెలంగాణ తల్లిని ప్రగతి భవన్లో బందీని చేసాడని.. ఆనాడు సీతను రాముడు విముక్తి చేస్తే.. ఇప్పుడు తెలంగాణ తల్లిని విముక్తి చేయమని సోనియమ్మ నన్ను పంపించిందన్నారు. రాముడికి వాణరసైన్యం సహాయం చేసినట్లు.. మీరు నాకు సహాయం చేయాలని కార్యకర్తలను కోరారు రేవంత్ రెడ్డి.
Also Read
- Bahadurguda: బహుద్దుర్ గుడాలో హైటెన్షన్..!
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
తాజావార్తలు
-
Fauji: ఇన్స్టాగ్రామ్ను షేక్ చేసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్తో ఆల్టైమ్ రికార్డు!
-
Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
-
Reverse Gear Bikes: రివర్స్ గేర్ ఉన్న టూ వీలర్స్ ఇవే.. పార్కింగ్, ఇరుకైన రోడ్లలో డ్రైవింగ్ ఇక సులువు!
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?