Summer Heat: దంచికొడుతున్న ఎండలు.. జనం బెంబేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేసవికాలం మండుతోంది. సూరీడు ఉదయం నుంచి ప్రచండంగా మారుతున్నాడు. తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండల తీవ్రత పెరుగుతూనే వుంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి..మండుతున్న ఎండలతో జనం అల్లాడిపోతున్నారు..ఒకవైపు 45 డిగ్రీలు దాటిన ఎండలు మరో వైపు ఉక్కపోత,వడగాలులతో ఉక్కిబిక్కిరౌతున్నారు..రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ లో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు.
రెండు మూడు రోజులుగా జైనాథ్ ,బేలామండలాల్లో 45 డిగ్రీలుదాటి నమోదు అవుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలతో జనం బెంబేలు ఎత్తుతున్నారు. బయటకు రావాలంటేనే చాలా ఇబ్బందిగా వుందని చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మూడు రోజులుగా డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి ఎండలు. గడిచిన 24 గంటల్లో కొమురం భీం జిల్లా కెరమెరి లో 45.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయింది. కౌటాల 45.4 డిగ్రీలు, నిర్మల్.. జిల్లాలోని కడెం పెద్దూర్ లో 45.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Also Read
ఆదిలాబాద్ జిల్లా బేల మండలము చప్రాల 45.3 గా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయింది. ఉమ్మడి జిల్లాలో వడదెబ్బతో ముగ్గురు మృతిచెందారు. ఆదిలాబాద్ లో ఒక్కరు , నిర్మల్ జిల్లా భైంసాలో ఇద్దరు మృతి చెందారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని, వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండల తీవ్రతతో కూల్ డ్రింక్స్, కొబ్బరి బొండాలు, పుచ్చకాయలు, శీతల పానీయాలకు గిరాకీ పెరిగింది.
Swetha Varma : బిగ్ బాస్ బ్యూటీకి చేదు అనుభవం… ఎమోషనల్ పోస్ట్
తాజావార్తలు
-
Anaya Bangar: ‘వ్యతిరేకించే ముందు తెలుసుకోండి’.. సౌతాఫ్రికా ఆల్రౌండర్కు ఘాటుగా బదులిచ్చిన అనయా బంగర్.!
-
Saif Ali Khan Attack: సైఫ్ అలీ ఖాన్పై దాడి కేసులో కీలక మలుపు.. క్షమాభిక్ష కోరిన నిందితుడు
-
Gold and Silver Today: పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
-
HMD 105 4G School Edition: పిల్లల కోసం కొత్త ఫోన్.. HMD 105 4G School Edition లాంచ్.. ఇవే స్పెషల్ ఫీచర్లు
-
CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!