TGIIC : రాయదుర్గం భూములకు జాక్పాట్.. రూ.2,833 కోట్ల రాబడి
- ఎకరాకు రూ.269 కోట్ల రికార్డు ధర
- 5.38 ఎకరాల ప్లాట్కు రూ.1,447 కోట్లు
- వారం రోజుల్లోనే రూ.2,833 కోట్ల ఆదాయం
- ఇన్వెస్టర్లకు హైదరాబాద్పై భారీ నమ్మకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGIIC : హైదరాబాద్లోని ఐటీ కారిడార్ రాయదుర్గంలో నిర్వహించిన భూముల ఈ-వేలానికి పెట్టుబడిదారుల నుంచి అనూహ్య స్పందన లభించింది. తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (టీజీఐఐసీ) అత్యంత పారదర్శకంగా నిర్వహించిన ఈ వేలం ప్రక్రియలో ప్రతిపాదిత రిజర్వ్ ధర కంటే ఏకంగా 52.3 శాతం అధిక ధరకు భూములు విక్రయమయ్యాయి. రాజధాని హైదరాబాద్లో ఉన్న మెరుగైన మౌలిక వసతులు, రవాణా అనుసంధానం , వ్యాపార అనుకూల వాతావరణం కారణంగానే ఈ స్థాయిలో డిమాండ్ పెరిగిందని అధికారులు తెలిపారు.
వారంలోనే వేలంలో సరికొత్త రికార్డులు
తాజాగా నిర్వహించిన 5.38 ఎకరాల ‘ప్లాట్-P2’ వేలంలో ఎకరాకు ఏకంగా రూ.269 కోట్ల ధర పలకడంతో మొత్తం రూ.1,447.22 కోట్ల ఆదాయం సమకూరింది. అంతకుముందు గత వారం జరిగిన ‘ప్లాట్-P1’ వేలంలో ఎకరాకు రూ.264 కోట్ల చొప్పున రూ.1,386 కోట్లు వచ్చాయి. మొదటి ప్లాట్కు సంబంధించిన 25 శాతం తొలి విడత నిధులు కూడా ఇప్పటికే టీజీఐఐసీ ఖాతాకు చేరాయి. ఇలా వారం రోజుల వ్యవధిలోనే ఈ రెండు ప్లాట్లకు (మొత్తం 10.63 ఎకరాలు) సంబంధించి రూ.2,833.22 కోట్ల భారీ రాబడి లభించింది. ఈ వేలంలో సగటున ఎకరా ధర రూ.266.53 కోట్లుగా నమోదవడం విశేషం.
Also Read
- CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
- Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
- Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
ప్రభుత్వ విధానాలకు దక్కిన నమ్మకం
ఎమ్ఎస్టీసీ ఈ-ఆక్షన్ ప్లాట్ఫామ్ ద్వారా జరిగిన ఈ ప్రక్రియకు ప్రముఖ రియల్ ఎస్టేట్ సలహా సంస్థ ‘జేఎల్ఎల్’ వ్యవహరించింది. ఈ సక్సెస్ పై టీజీఐఐసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె. శశాంక ఐఏఎస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకానికి ఈ రికార్డు ధరలే నిదర్శనమన్నారు. పారదర్శక విధానాల ద్వారా ప్రభుత్వ ఆస్తులకు గరిష్ట విలువను సమకూర్చడంలో రాయదుర్గం వేలం ఒక మైలురాయిగా నిలిచిందని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!