Subhash patriji: పిరమిడ్ ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ పిరమిడ్ ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ కన్నుమూశారు.ఆయన వయసు 74ఏళ్ళు.గత కొంత కాలంగా ఆయన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. బెంగళూరులో చికిత్స తీసుకుంటున్న ఆయనను రెండు రోజుల క్రితం కడ్తాల్ మహేశ్వర పిరమిడ్కు తరలించారు. ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు సుభాష్ పత్రీజీ. సోమవారం సాయంత్రం 5గంటలకు ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని పిరమిడ్ ధ్యాన్ ట్రస్టు సభ్యులు తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పిరమిడ్ ధ్యాన మండలి సభ్యులు అంత్యక్రియలకు తరలి రావాలని పిరమిడ్ ధ్యాన్ ట్రస్టు సభ్యులు కోరారు. సుభాష్ పత్రిజీ నిజామాబాద్లోని బోధన్లో జన్మించారు. గతంలో కర్నూలు జిల్లాలో కోరమండల్ ఫెర్టిలైజర్స్ సంస్థలో ఉద్యోగిగా పనిచేశారు. 2012లో కడ్తాల్ మండలం అన్మాసుపల్లి శివారులో ప్రపంచంలోనే అతిపెద్దదైన కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ నిర్మించారు.
Also Read
- CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
అదే ఏడాది డిసెంబర్ 18 నుంచి జనవరి 31 వరకు ప్రపంచ ధ్యాన మహాసభలు నిర్వహించారు. ఆ తర్వాత ఏటా ధ్యాన మహాచక్రం సంబరాలు డిసెంబర్ 18 నుంచి జనవరి 31 వరకు నిర్వహించి ధ్యానం విశిష్టతను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మూమెంట్ ఆఫ్ ఇండియాను ఆయన గతంలో స్థాపించారు. సుభాష్ పత్రీజీ ఆకస్మిక మృతికి పలువురు సంతాపం తెలిపారు.
సుభాష్ పత్రీజీ మన రోజువారీ జీవితంలో మరియు ధ్యానం సమయంలో పిరమిడ్లను ఎలా ఉపయోగించవచ్చో వివరించారు.శ్వాసపై ధ్యాస పెడితే ఆరోగ్యం సిద్ధిస్తుందని పత్రీజీ సెలవిచ్చేవారు. ధ్యానమే సర్వరోగ నివారిణి అనేవారు. ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలు, తోటివారితో కలిసి ధ్యానం చేయడం వల్ల వారిలో కూడా శక్తులు వస్తాయని పత్రీజీ బోధించేవారు.జ్ఞాపక శక్తితో పాటు, మనశ్శాంతి, ఆయుష్షు పెరుగుతుందని బ్రహ్మర్షి పత్రీజీ తన ప్రసంగాల్లో వివరించేవారు.
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: రోహిత్-కోహ్లీ భవిష్యత్తుపై ప్రశ్న.. హ్యారీ బ్రూక్ సమాధానం ఇదే!
-
OPPO K14x 5G: ఒప్పో K14x 5G.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్!
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
-
Rohit Sharma: ఇంగ్లండ్తో మూడో వన్డే మ్యాచ్.. అదే రోహిత్కు ప్రధాన సమస్య!
-
Bollywood: బాలీవుడ్లో కోట్లు కురిపిస్తున్న కామెడీ చిత్రాలు
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!