Guru Nanak College: లక్షలు వసూలు చేసి అనుమతి లేదంటున్నారు.. విద్యార్థుల ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guru Nanak College: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం గురునానక్ కాలేజీ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కళాశాలలో కోర్సులకు యూనివర్షటీ రూ.లక్షలు వసూలు చేసి ఇప్పుడు ప్రభుత్వం అనుమతి లేదని యాజమాన్యం చేతులెత్తేసింది. దీంతో విద్యార్థులు ఆందోళన దిగారు. దీంతో గురునానక్ కాలేజీ ముందు భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. అయితే.. తమకు న్యాయం చేయాలని, తమడబ్బులు తిరిగి చెల్లించేలా చూడాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముందు బాధితులు నిరసన చేపట్టారు. అయితే తమను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 యూనివర్సిటీలకు చెందిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసముందు బైఠాయించారు. స్పందిచిన సబితా ఇంద్రారెడ్డి గురునానక్ కాలేజీ విద్యార్థుల బాధితులతో మాట్లాడుతున్నారు. అయితే కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లతో కూడా మంత్రి మాట్లాడునున్నట్లు సమాచారం. కాగా.. ఇటు విద్యార్థులు, అటు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు మంత్రి ఇంటి ముందు ధర్నా చేయడంలో భారీగా పోలీసులు మోహరించారు.
Read also: KTR Delhi Tour: మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటన.. అమిత్ షాతో భేటి?
Also Read
- Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
- Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
- OTR: కేంద్రమంత్రి పెమ్మసాని పై తెలంగాణ బీజేపీ ఎంపీలు అసహనం .. అసలు కారణమేంటి ?
- TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
నిన్న వందలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్రహీంపట్నం గురునానక్ కాలేజీ ముందు నిరసన తెలిపారు. న్యాయం జరిగే వరకు ఆందోళన ఆగదన్నారు. యూనివర్సిటీ పేరుతో గురునానక్ కాలేజీ మోసం చేసిందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని కళాశాల సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. ఆందోళన విరమించాలని.. యాజమాన్యంతో చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. దీనికి ఆందోళనకారులు ససేమిరా అనడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. వారిని అక్కడి నుంచి బలవంతంగా బయటకు పంపించారు. లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. పోలీసుల తీరుపై కూడా విమర్శలు వస్తున్నాయి. విద్యార్థులకు న్యాయం చేయాల్సిన పోలీసులు.. బాధితులపై లాఠీచార్జి చేస్తారా అంటూ మండిపడుతున్నారు. లక్షలకు లక్షలు ఫీజుల రూపంలో చెల్లించామని… ఇప్పుడు ప్రభుత్వం అనుమతి లేదని యాజమాన్యం కోర్సులకు అనుమతి లేదని చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. న్యాయం చేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు.
Encounter: కాశ్మీర్లో ఎన్కౌంటర్.. నలుగురు ఉగ్రవాదుల హతం..
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..