Guru Nanak College: లక్షలు వసూలు చేసి అనుమతి లేదంటున్నారు.. విద్యార్థుల ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guru Nanak College: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం గురునానక్ కాలేజీ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కళాశాలలో కోర్సులకు యూనివర్షటీ రూ.లక్షలు వసూలు చేసి ఇప్పుడు ప్రభుత్వం అనుమతి లేదని యాజమాన్యం చేతులెత్తేసింది. దీంతో విద్యార్థులు ఆందోళన దిగారు. దీంతో గురునానక్ కాలేజీ ముందు భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. అయితే.. తమకు న్యాయం చేయాలని, తమడబ్బులు తిరిగి చెల్లించేలా చూడాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముందు బాధితులు నిరసన చేపట్టారు. అయితే తమను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 యూనివర్సిటీలకు చెందిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసముందు బైఠాయించారు. స్పందిచిన సబితా ఇంద్రారెడ్డి గురునానక్ కాలేజీ విద్యార్థుల బాధితులతో మాట్లాడుతున్నారు. అయితే కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లతో కూడా మంత్రి మాట్లాడునున్నట్లు సమాచారం. కాగా.. ఇటు విద్యార్థులు, అటు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు మంత్రి ఇంటి ముందు ధర్నా చేయడంలో భారీగా పోలీసులు మోహరించారు.
Read also: KTR Delhi Tour: మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటన.. అమిత్ షాతో భేటి?
Also Read
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
నిన్న వందలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్రహీంపట్నం గురునానక్ కాలేజీ ముందు నిరసన తెలిపారు. న్యాయం జరిగే వరకు ఆందోళన ఆగదన్నారు. యూనివర్సిటీ పేరుతో గురునానక్ కాలేజీ మోసం చేసిందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని కళాశాల సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. ఆందోళన విరమించాలని.. యాజమాన్యంతో చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. దీనికి ఆందోళనకారులు ససేమిరా అనడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. వారిని అక్కడి నుంచి బలవంతంగా బయటకు పంపించారు. లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. పోలీసుల తీరుపై కూడా విమర్శలు వస్తున్నాయి. విద్యార్థులకు న్యాయం చేయాల్సిన పోలీసులు.. బాధితులపై లాఠీచార్జి చేస్తారా అంటూ మండిపడుతున్నారు. లక్షలకు లక్షలు ఫీజుల రూపంలో చెల్లించామని… ఇప్పుడు ప్రభుత్వం అనుమతి లేదని యాజమాన్యం కోర్సులకు అనుమతి లేదని చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. న్యాయం చేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు.
Encounter: కాశ్మీర్లో ఎన్కౌంటర్.. నలుగురు ఉగ్రవాదుల హతం..
తాజావార్తలు
-
Smart TV: ఆఫర్.. ఆఫర్.. ఆఫర్.. 43-ఇంచెస్ బ్రాండెడ్ LED స్మార్ట్ టీవీలు సగం ధరకే.. త్వరపడండి
-
Makutam Release Date: దర్శకుడిగా విశాల్కు తొలి పరీక్ష.. ‘మకుటం’ రిలీజ్ డేట్ ఫిక్స్, ట్రైలర్కు కౌంట్డౌన్!
-
Allu Arjun : సినిమా సినిమాకి కొత్త మేకోవర్తో వస్తోన్న అల్లు అర్జున్
-
Harish Rao-KTR: “బతుకంతా తెలంగాణది”.. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
-
Trump Marine One: ట్రంప్కు గగనతలంలో ప్రమాదం?.. ప్రయాణిస్తున్న ‘మెరైన్ వన్’కు దగ్గరగా వచ్చిన ప్యాసింజర్ విమానం
ట్రెండింగ్
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!