Hyderabad: ‘గాంధీ’ సినిమాకు వచ్చి గాంధీగిరి.. థియేటర్ ధ్వంసం చేసిన విద్యార్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Students Damaged movie theater in hyderabad
ఇండియాకు ఇండిపెండెన్స్ డే వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశ వ్యాప్తంగా వజ్రోత్సవాలు నడుస్తున్నాయి. ఇందులో భాగంగా ‘గాంధీ’ సినిమాను ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. తెలంగాణలో విద్యార్థుల కోసం అన్ని థియేటర్లలో మార్నింగ్ షోలలో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు. అయితే శుక్రవారం నాడు హైదరాబాద్ మల్లేపల్లిలోని ప్రియా థియేటర్లో గాంధీ సినిమాను చూసేందుకు మెహిదీపట్నంలోని ఎంఎస్ కాలేజీకి చెందిన 500 మంది విద్యార్థులు తరలివచ్చారు. ఈ విద్యార్థులు గాంధీగిరి చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అహింసా మార్గంలోనే నడవాలని గాంధీ చెప్పిన మాటలను విద్యార్థులు పెడచెవిన పెట్టి విధ్వంసం సృష్టించారు.
Also Read
గాంధీ సినిమాను వీక్షిస్తున్న సమయంలో కొందరు విద్యార్థులు థియేటర్లోనే సీట్లు చింపి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. థియేటర్ నిర్వాహకులు వెంటనే స్పందించి విద్యార్థులను వారించినా ఫలితం దక్కలేదు. దీంతో ప్రియా థియేటర్ మేనేజర్ మాజీద్ రజ్వీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు థియేటర్ వద్దకు చేరుకుని విచారణ చేపట్టారు. అసలు విద్యార్థులు థియేటర్ను ధ్వంసం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో అన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!