Steel Flyover: హైదరాబాద్లో మరో కొత్త ఫ్లైఓవర్.. ఇందిరాపార్క్-వీఎస్టీ స్టీల్ నిర్మాణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Steel Flyover: హైదరాబాద్లో పలు కొత్త ఫ్లైఓవర్లు ఇటీవల ప్రారంభం కాగా, త్వరలో మరో కొత్త ఫ్లైఓవర్ కూడా అందుబాటులోకి రానుంది. ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు నిర్మిస్తున్న స్టీల్ ఫ్లై ఓవర్ను ఆగస్టు 15న ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ 2.25 కి.మీ ఫ్లై ఓవర్ను నాలుగు లైన్లతో నిర్మించారు. దీని నిర్మాణానికి 13 వేల టన్నుల ఉక్కును ఉపయోగించారు. ఈ స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణానికి దాదాపు రూ.350 కోట్లు ఖర్చయినట్లు జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. నగరం నడిబొడ్డున ఈ ఫ్లైఓవర్ నిర్మాణంతో వీఎస్టీ జంక్షన్, ఆర్టీసీ క్రాస్ రోడ్లు, ఇందిరాపార్క్ క్రాస్ రోడ్లలో ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. నివాస ప్రాంతాలతో పాటు వాణిజ్య సంస్థలు, కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లు, కళాశాలలు, పాఠశాలలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. దీంతో ట్రాఫిక్ జామ్ విపరీతంగా ఉండడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఈ ప్రాంతాల్లో ఫ్లై ఓవర్ నిర్మించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇందుకోసం భూ యజమానులు కూడా తమ భూములను అప్పగించేందుకు ముందుకు వచ్చారు. ఫ్లైఓవర్ నిర్మాణం నగరం మధ్యలో ఉన్నందున భూసేకరణ వ్యయం రెండింతలు పెరిగిందని అధికారులు తెలిపారు.
Read also: TS Congress: కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కో ఛైర్మన్గా బాధ్యతలు
Also Read
రద్దీ ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాల్లో స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. దీంతో లింగంపల్లి జంక్షన్, అశోక్ నగర్ క్రాస్ రోడ్డులో కూడా ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని చెబుతున్నారు. మెట్రో రైలు మార్గానికి సంబంధించిన పనులు మినహా ఫ్లైఓవర్ పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. పెండింగ్లో ఉన్న పనులను కూడా త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఈ ఫ్లై ఓవర్ పనులు గతేడాది డిసెంబర్ నాటికి పూర్తి కావాల్సి ఉంది. కానీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా వర్షాల కారణంగా పనులు నిలిచిపోవడం, స్టీల్ సరఫరా నిలిచిపోవడంతో నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయి. స్టీల్ ఫ్లై ఓవర్పై ఎల్ఈడీ లైట్లు, క్రాస్ బారియర్లు ఏర్పాటు చేయనున్నారు. అయితే వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా నగరంలో ఫ్లై ఓవర్ల నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ చేపట్టనుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు నిర్మించారు. అలాగే ఉప్పల్లో ఇటీవల నిర్మించిన స్కైవాక్ను పాదచారులకు అందుబాటులోకి తెచ్చారు. మెహిదీపట్నంలో మరో స్కైవాక్ను నిర్మిస్తున్నారు. దీన్ని కూడా త్వరలో ప్రారంభించే అవకాశం ఉంది.
Telangana: నేటి నుంచే బీసీ వృత్తిదారులకు లక్ష సాయం..!
తాజావార్తలు
-
TVS 160cc Maxi Scooter: టీవీఎస్ 160cc మ్యాక్సీ స్కూటర్.. యమహా ఏరాక్స్, హీరో జూమ్లకు గట్టి పోటీ
-
Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
-
Sai Durgha Tej : సాయి దుర్గ తేజ్ నెక్ట్స్ సినిమా టైటిల్ ‘పార్వేట’
-
India U18 Hockey Asia Cup Champion: జపాన్పై ఘన విజయం.. అండర్-18 హాకీ ఆసియా కప్ ఛాంపియన్గా భారత్
-
Horoscope Today: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!