Steel Flyover: హైదరాబాద్లో మరో కొత్త ఫ్లైఓవర్.. ఇందిరాపార్క్-వీఎస్టీ స్టీల్ నిర్మాణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Steel Flyover: హైదరాబాద్లో పలు కొత్త ఫ్లైఓవర్లు ఇటీవల ప్రారంభం కాగా, త్వరలో మరో కొత్త ఫ్లైఓవర్ కూడా అందుబాటులోకి రానుంది. ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు నిర్మిస్తున్న స్టీల్ ఫ్లై ఓవర్ను ఆగస్టు 15న ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ 2.25 కి.మీ ఫ్లై ఓవర్ను నాలుగు లైన్లతో నిర్మించారు. దీని నిర్మాణానికి 13 వేల టన్నుల ఉక్కును ఉపయోగించారు. ఈ స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణానికి దాదాపు రూ.350 కోట్లు ఖర్చయినట్లు జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. నగరం నడిబొడ్డున ఈ ఫ్లైఓవర్ నిర్మాణంతో వీఎస్టీ జంక్షన్, ఆర్టీసీ క్రాస్ రోడ్లు, ఇందిరాపార్క్ క్రాస్ రోడ్లలో ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. నివాస ప్రాంతాలతో పాటు వాణిజ్య సంస్థలు, కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లు, కళాశాలలు, పాఠశాలలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. దీంతో ట్రాఫిక్ జామ్ విపరీతంగా ఉండడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఈ ప్రాంతాల్లో ఫ్లై ఓవర్ నిర్మించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇందుకోసం భూ యజమానులు కూడా తమ భూములను అప్పగించేందుకు ముందుకు వచ్చారు. ఫ్లైఓవర్ నిర్మాణం నగరం మధ్యలో ఉన్నందున భూసేకరణ వ్యయం రెండింతలు పెరిగిందని అధికారులు తెలిపారు.
Read also: TS Congress: కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కో ఛైర్మన్గా బాధ్యతలు
Also Read
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
రద్దీ ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాల్లో స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. దీంతో లింగంపల్లి జంక్షన్, అశోక్ నగర్ క్రాస్ రోడ్డులో కూడా ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని చెబుతున్నారు. మెట్రో రైలు మార్గానికి సంబంధించిన పనులు మినహా ఫ్లైఓవర్ పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. పెండింగ్లో ఉన్న పనులను కూడా త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఈ ఫ్లై ఓవర్ పనులు గతేడాది డిసెంబర్ నాటికి పూర్తి కావాల్సి ఉంది. కానీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా వర్షాల కారణంగా పనులు నిలిచిపోవడం, స్టీల్ సరఫరా నిలిచిపోవడంతో నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయి. స్టీల్ ఫ్లై ఓవర్పై ఎల్ఈడీ లైట్లు, క్రాస్ బారియర్లు ఏర్పాటు చేయనున్నారు. అయితే వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా నగరంలో ఫ్లై ఓవర్ల నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ చేపట్టనుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు నిర్మించారు. అలాగే ఉప్పల్లో ఇటీవల నిర్మించిన స్కైవాక్ను పాదచారులకు అందుబాటులోకి తెచ్చారు. మెహిదీపట్నంలో మరో స్కైవాక్ను నిర్మిస్తున్నారు. దీన్ని కూడా త్వరలో ప్రారంభించే అవకాశం ఉంది.
Telangana: నేటి నుంచే బీసీ వృత్తిదారులకు లక్ష సాయం..!
తాజావార్తలు
-
Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
-
Box Office Clash: హారర్ vs రొమాన్స్ vs మాస్ vs యాక్షన్.. ఈ శుక్రవారం బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..!
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!