Srinivas Goud: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కులవృత్తులను అవమానిస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srinivas Goud Comments On BJP: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కులవృత్తులను అవమానిస్తున్నారని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. కానీ.. తెలంగాణలో అందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయని, కేసీఆర్ సర్కార్ కులవృత్తులను కాపాడుకుంటోందని అన్నారు. రాష్ట్రంలో అన్ని కులవృత్తులను అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు. హరితహారంలో భాగంగా ఈత చెట్లను పెంచుకుంటున్నామని, 4 కోట్ల 20 లక్షల ఈత మొక్కల్ని పెంచామని అన్నారు. గౌడ సోదరులను ఆదుకునేందుకు నీర పాలసీ తీసుకొచ్చామని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే ఉద్యోగుల కన్నా, తెలంగాణ ఉద్యోగులకే ఎక్కువ జీతభత్యాలు అందుతున్నాయని.. ఒక్క కేసీఆర్ సర్కార్కే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ప్రభుత్వ దార్శనిక పాలన, కష్టపడి పని చేసే ఉద్యోగులు ఉండడం వల్లే.. జాతీయ స్థాయిలో తెలంగాణకు అనేక అంశాల్లో వరుస అవార్డులు అందుతున్నాయన్నారు. ఉద్యోగులకు మేలు చేకూర్చే రీతిలో సానుకూల నిర్ణయాలు అమలు చేస్తున్నామన్నారు.
Physical Harassment: మైనర్ కుమార్తెపై లైంగిక దాడి.. కీచక తండ్రికి పదేళ్ల జైలు శిక్ష
Also Read
- Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
- Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
- NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
- Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
కేవలం ఉద్యోగులకే కాకుండా అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో అమలవుతున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల ఔన్నత్యం స్పష్టమవుతుందని చెప్పారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో.. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 17670 క్రీడా ప్రాంగణాలు అందుబాటులోకి వచ్చాయని.. త్వరలోనే మరో 19 వేల క్రీడా ప్రాంగణాల ఏర్పాటు పూర్తి కానుందని పేర్కొన్నారు. క్రీడాకారులందరూ ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటాలని.. గెలుపోటములను సమంగా స్వీకరించాలని సూచించారు. నిజామాబాద్కు చెందిన అంతర్జాతీయ బాక్సర్ నిఖత్ జరీన్కు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లోని బంజారాహిల్స్లో సుమారు రూ. 20 కోట్లు విలువ చేసే 600 గజాల స్థలాన్ని అందించిందని, మరో క్రీడాకారిణి ఇషాసింగ్కు కూడా ప్రభుత్వ పరంగా స్థలం అందజేశామని అన్నారు.
Viral News: ఏడు అడుగుల పురుషాంగంతో నడిరోడ్డుపై అమ్మాయిల వెంట పడుతూ..
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!