Srinivas Goud: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కులవృత్తులను అవమానిస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srinivas Goud Comments On BJP: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కులవృత్తులను అవమానిస్తున్నారని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. కానీ.. తెలంగాణలో అందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయని, కేసీఆర్ సర్కార్ కులవృత్తులను కాపాడుకుంటోందని అన్నారు. రాష్ట్రంలో అన్ని కులవృత్తులను అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు. హరితహారంలో భాగంగా ఈత చెట్లను పెంచుకుంటున్నామని, 4 కోట్ల 20 లక్షల ఈత మొక్కల్ని పెంచామని అన్నారు. గౌడ సోదరులను ఆదుకునేందుకు నీర పాలసీ తీసుకొచ్చామని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే ఉద్యోగుల కన్నా, తెలంగాణ ఉద్యోగులకే ఎక్కువ జీతభత్యాలు అందుతున్నాయని.. ఒక్క కేసీఆర్ సర్కార్కే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ప్రభుత్వ దార్శనిక పాలన, కష్టపడి పని చేసే ఉద్యోగులు ఉండడం వల్లే.. జాతీయ స్థాయిలో తెలంగాణకు అనేక అంశాల్లో వరుస అవార్డులు అందుతున్నాయన్నారు. ఉద్యోగులకు మేలు చేకూర్చే రీతిలో సానుకూల నిర్ణయాలు అమలు చేస్తున్నామన్నారు.
Physical Harassment: మైనర్ కుమార్తెపై లైంగిక దాడి.. కీచక తండ్రికి పదేళ్ల జైలు శిక్ష
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
కేవలం ఉద్యోగులకే కాకుండా అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో అమలవుతున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల ఔన్నత్యం స్పష్టమవుతుందని చెప్పారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో.. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 17670 క్రీడా ప్రాంగణాలు అందుబాటులోకి వచ్చాయని.. త్వరలోనే మరో 19 వేల క్రీడా ప్రాంగణాల ఏర్పాటు పూర్తి కానుందని పేర్కొన్నారు. క్రీడాకారులందరూ ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటాలని.. గెలుపోటములను సమంగా స్వీకరించాలని సూచించారు. నిజామాబాద్కు చెందిన అంతర్జాతీయ బాక్సర్ నిఖత్ జరీన్కు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లోని బంజారాహిల్స్లో సుమారు రూ. 20 కోట్లు విలువ చేసే 600 గజాల స్థలాన్ని అందించిందని, మరో క్రీడాకారిణి ఇషాసింగ్కు కూడా ప్రభుత్వ పరంగా స్థలం అందజేశామని అన్నారు.
Viral News: ఏడు అడుగుల పురుషాంగంతో నడిరోడ్డుపై అమ్మాయిల వెంట పడుతూ..
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!