Monsoon for Telangana: ఈ నెల తెలంగాణకు నైరుతి రుతుపవనాలు.. ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monsoon for Telangana: నైరుతి రుతుపవనాలు ఇప్పటికే ఏపీని తాకాయి. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో విస్తరిస్తుండగా మరో మూడు నాలుగు రోజుల్లో ఏపీ అంతటా విస్తరిస్తుంది. ఏపీ రాకతో త్వరలో నైరుతి రుతుపవనాలు తెలంగాణను కూడా తాకనున్నాయి. ఈ నెల 18లోపు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. 18వ తేదీని తాకిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు మరికొంత సమయం పడుతుంది. నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించడంతో తెలంగాణలోనూ వర్షాలు కురుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండగా.. రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
Read also: Rythubandhu Funds: తెలంగాణ అన్నదాతలకు గుడ్న్యూస్.. ఖాతాల్లోకి రైతు బంధు నగదు
Also Read
నేడు ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈరోజు పెద్దపల్లి, ములుగు, ఖమ్మం, మంచిర్యాల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పలు చోట్ల వడగండ్ల వాన తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంచనా. రేపు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వాతావరణ బులెటిన్లో పేర్కొంది. అలాగే 15 నుంచి 17వ తేదీ వరకు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తే రుతుపవనాలు తగ్గి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయి. అలాగే భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు జూన్ 4న ఏపీలో ప్రవేశించే అవకాశం ఉందని, జూన్ మొదటి వారంలో తెలంగాణను తాకుతుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కానీ ఏపీలో ప్రవేశం ఆలస్యమవడంతో తెలంగాణలో అడుగుపెట్టేందుకు సమయం పట్టే అవకాశం ఉంది. గతేడాది జూన్ 13న నైరుతి ఏపీని తాకగా.. జూన్ 20 నాటికి అన్ని ప్రాంతాలకు విస్తరించింది. 2021లో జూన్ 5న ఏపీని తాకగా.. ఏడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. మరో రెండు రోజుల్లో కోస్తాంధ్రలో ఎండలు తగ్గే అవకాశం ఉందని, మరికొద్ది రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. నైరుతి ప్రభావంతో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. నైరుతి ప్రభావంతో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయి.
Janasena Party Office: జనసేన కార్యాలయంలో సినీ ప్రముఖుల సందడి
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!