Monsoon for Telangana: ఈ నెల తెలంగాణకు నైరుతి రుతుపవనాలు.. ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monsoon for Telangana: నైరుతి రుతుపవనాలు ఇప్పటికే ఏపీని తాకాయి. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో విస్తరిస్తుండగా మరో మూడు నాలుగు రోజుల్లో ఏపీ అంతటా విస్తరిస్తుంది. ఏపీ రాకతో త్వరలో నైరుతి రుతుపవనాలు తెలంగాణను కూడా తాకనున్నాయి. ఈ నెల 18లోపు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. 18వ తేదీని తాకిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు మరికొంత సమయం పడుతుంది. నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించడంతో తెలంగాణలోనూ వర్షాలు కురుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండగా.. రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
Read also: Rythubandhu Funds: తెలంగాణ అన్నదాతలకు గుడ్న్యూస్.. ఖాతాల్లోకి రైతు బంధు నగదు
Also Read
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
- MEIL Enters Industrial AI: ఇన్ఫ్రా రంగం నుంచి ఐటీ విప్లవం వైపు.. ఏఐలోకి మేఘా సంస్థ ఎంట్రీ
- KTR-Prabhas: రచ్చ రచ్చే.. లైవ్లో రెబల్ స్టార్ ప్రభాస్కు ఫోన్ చేసిన కేటీఆర్ (వీడియో)
నేడు ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈరోజు పెద్దపల్లి, ములుగు, ఖమ్మం, మంచిర్యాల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పలు చోట్ల వడగండ్ల వాన తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంచనా. రేపు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వాతావరణ బులెటిన్లో పేర్కొంది. అలాగే 15 నుంచి 17వ తేదీ వరకు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తే రుతుపవనాలు తగ్గి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయి. అలాగే భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు జూన్ 4న ఏపీలో ప్రవేశించే అవకాశం ఉందని, జూన్ మొదటి వారంలో తెలంగాణను తాకుతుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కానీ ఏపీలో ప్రవేశం ఆలస్యమవడంతో తెలంగాణలో అడుగుపెట్టేందుకు సమయం పట్టే అవకాశం ఉంది. గతేడాది జూన్ 13న నైరుతి ఏపీని తాకగా.. జూన్ 20 నాటికి అన్ని ప్రాంతాలకు విస్తరించింది. 2021లో జూన్ 5న ఏపీని తాకగా.. ఏడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. మరో రెండు రోజుల్లో కోస్తాంధ్రలో ఎండలు తగ్గే అవకాశం ఉందని, మరికొద్ది రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. నైరుతి ప్రభావంతో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. నైరుతి ప్రభావంతో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయి.
Janasena Party Office: జనసేన కార్యాలయంలో సినీ ప్రముఖుల సందడి
తాజావార్తలు
-
Ilayaraja : ఇళయరాజాకు భారీ షాక్.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు!
-
Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
-
Nabha Natesh: పాములు మా ఇంట్లో కాపురం ఉంటాయి.. వాటిని చూస్తూ టిఫిన్ చేస్తా: నభా నటేష్ షాకింగ్ కామెంట్స్!
-
CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
-
Netanyahu: నెతన్యాహు పీఠం కదులుతోంది.. ఇజ్రాయెల్ ప్రధానిని గద్దె దించేందుకు రంగంలోకి దిగిన మాజీ సైన్యాధిపతి!
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!