HYDRA Law: త్వరలో హైడ్రా చట్టం.. ఏ.వీ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు
- 'హైడ్రా' కమిషనర్ ఏవీ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు..
- త్వరలో హైడ్రా పేరుతో ప్రత్యేక చట్టం...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYDRA Law: హైదరాబాద్ నగరంలో ఇప్పుడు ‘హైడ్రా’ పేరు మారుమోగుతోంది. నగరంలో ఆక్రమణకు గురైన చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములను గుర్తించి అక్కడ నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసి.. ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటూ.. ఈ హైడ్రామా ఇప్పుడు హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా హైదరాబాద్ నగరంతోపాటు శివారు ప్రాంతాల్లోని ఆక్రమణలకు గురైన భూములను కాపాడేందుకు “హైడ్రా” తీవ్రంగా కృషి చేస్తోంది. ఆకాశమంత ఎత్తైన భవనాలను సైతం బుల్ డోజర్లతో నేలమట్టం చేస్తున్నారు. హైడ్రా ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ’. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏజెన్సీగా ఏర్పాటు చేసింది. రంగనాథ్ను కమిషనర్గా నియమిస్తూ రేవంత్ సర్కార్ ఈ హైడ్రామాకు ప్రత్యేక అధికారాలు కూడా ఇచ్చింది.
Read also: Osmania Hospital: 32 ఎకరాల్లో కొత్త ఉస్మానియా దవాఖానా.. ఎక్కడో తెలుసా?
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
అయితే.. ఈ క్రమంలో ‘హైడ్రా’ కమిషనర్ ఏవీ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో హైడ్రా పేరుతో ప్రత్యేక చట్టం చేస్తామన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి విధివిధానాలు, నిబంధనలను రూపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన వెంటనే హైడ్రామా పేరుతో నిర్వాసితులకు నోటీసులు జారీ చేస్తామన్నారు. హైడ్రా కార్యకలాపాల కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్లను అందుబాటులో ఉంచుతామని, ఇక్కడ ప్రజలు నేరుగా ఫిర్యాదులు చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలకు సహకరించిన ప్రభుత్వ అధికారులపై విచారణ జరిపి వారిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మేల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలకు ఇవాళ హైడ్రా నోటీసులు ఇచ్చింది. దుండిగల్ లోని ఎంఎల్ఆర్ఐటీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలకు నోటీసులు జారీ చేసింది. చిన్న దామెర చెరువు ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మించారని నోటీసుల్లో పేర్కొంది.
New Ration Cards: తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త.. అర్హులకు రేషన్, ఆరోగ్య కార్డులు..
తాజావార్తలు
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!