HYDRA Law: త్వరలో హైడ్రా చట్టం.. ఏ.వీ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు
- 'హైడ్రా' కమిషనర్ ఏవీ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు..
- త్వరలో హైడ్రా పేరుతో ప్రత్యేక చట్టం...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYDRA Law: హైదరాబాద్ నగరంలో ఇప్పుడు ‘హైడ్రా’ పేరు మారుమోగుతోంది. నగరంలో ఆక్రమణకు గురైన చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములను గుర్తించి అక్కడ నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసి.. ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటూ.. ఈ హైడ్రామా ఇప్పుడు హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా హైదరాబాద్ నగరంతోపాటు శివారు ప్రాంతాల్లోని ఆక్రమణలకు గురైన భూములను కాపాడేందుకు “హైడ్రా” తీవ్రంగా కృషి చేస్తోంది. ఆకాశమంత ఎత్తైన భవనాలను సైతం బుల్ డోజర్లతో నేలమట్టం చేస్తున్నారు. హైడ్రా ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ’. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏజెన్సీగా ఏర్పాటు చేసింది. రంగనాథ్ను కమిషనర్గా నియమిస్తూ రేవంత్ సర్కార్ ఈ హైడ్రామాకు ప్రత్యేక అధికారాలు కూడా ఇచ్చింది.
Read also: Osmania Hospital: 32 ఎకరాల్లో కొత్త ఉస్మానియా దవాఖానా.. ఎక్కడో తెలుసా?
Also Read
- CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!
- CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
- SSC Supplementary Results : టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ సారి కూడా అమ్మాయిలే టాప్.!
- Swapnalok Complex Fire : సికింద్రాబాద్లో కలకలం.. మళ్లీ మంటల్లో స్వప్నలోక్.!
అయితే.. ఈ క్రమంలో ‘హైడ్రా’ కమిషనర్ ఏవీ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో హైడ్రా పేరుతో ప్రత్యేక చట్టం చేస్తామన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి విధివిధానాలు, నిబంధనలను రూపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన వెంటనే హైడ్రామా పేరుతో నిర్వాసితులకు నోటీసులు జారీ చేస్తామన్నారు. హైడ్రా కార్యకలాపాల కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్లను అందుబాటులో ఉంచుతామని, ఇక్కడ ప్రజలు నేరుగా ఫిర్యాదులు చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలకు సహకరించిన ప్రభుత్వ అధికారులపై విచారణ జరిపి వారిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మేల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలకు ఇవాళ హైడ్రా నోటీసులు ఇచ్చింది. దుండిగల్ లోని ఎంఎల్ఆర్ఐటీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలకు నోటీసులు జారీ చేసింది. చిన్న దామెర చెరువు ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మించారని నోటీసుల్లో పేర్కొంది.
New Ration Cards: తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త.. అర్హులకు రేషన్, ఆరోగ్య కార్డులు..
తాజావార్తలు
-
INDA Vs SLA: మరోసారి ఫామ్ కొనసాగించిన సాయి సుదర్శన్.. 132 పరుగులతో వీరవిహారం..
-
CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!
-
Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
-
PoK: పీఓకే ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న పాకిస్తాన్..
-
Bunny Vas : తెలుగుమ్మాయని అవకాశం ఇస్తే.. మాకు 15 రూల్స్ పెట్టింది.
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!