Telangana Congress: నేడు నగరానికి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Congress: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏఐసీసీ నేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఒకె ఫ్లైట్ లో ఉదయం 9:30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం చేరుకోనున్న సోనియా, రాహుల్, ప్రియాంక హైదరాబాద్ చేరుకుంటారని గాందీభవన్ వర్గాలు తెలిపాయి. ఉదయం 07:20 గంటలకు UK-829 విమానంలో ఢిల్లి విమానాశ్రయం నుండి బయలుదేరి 9:30 గంటలకు శంషాబాద్ కు రానున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా తాజ్కృష్ణా హోటల్కు చేరుకుంటారని, కొంత విశ్రాంతి అనంతరం ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారని వెల్లడించారు. మరోవేపు రేవంత్ ప్రమాణ స్వీకారం కార్యక్రమముకు హాజరు అవుతున్న కర్ణాటక సిఎం సిద్ధి రామయ్య రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట విమానాశ్రయంకు సిద్ధైరమయ్య చేరుకుని, అక్కడి నుంచి నేరుగా LB స్టేడియంకి కర్ణాటక సిఎం చేరుకుంటారు.
Read also: Gold Price Today : గుడ్ న్యూస్..వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం.. తులం ఎంతంటే?
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
- Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
- ACB Raids : ట్రాన్స్కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
సీఎల్పీ నేతగా ఎన్నికైన తర్వాత మంగళవారం రాత్రి ఢిల్లీ వెళ్లిన రేవంత్.. బుధవారమంతా బిజీబిజీగా గడిపారు. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, హర్యానా ఎంపీ దీపేందర్ సింగ్ తదితరులతో పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఖర్గే వేర్వేరుగా సమావేశమయ్యారు. గురువారం జరిగే ప్రమాణస్వీకారోత్సవానికి హాజరు కావాలని వారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. తెల్లవారుజామున ఏపీలోని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు యమునా బ్లాక్లోని రేవంత్ నివాసానికి వచ్చి కలిశారు. ఇరవై నిమిషాల పాటు ఏకాంతంగా చర్చలు జరిపారు. చర్చలు బహిర్గతం కాలేదు.
Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
ప్రజా ప్రభుత్వం రాబోతోందంటూ ఖర్గే, రాహుల్ల ట్వీట్లు
బుధవారం ఢిల్లీలో రేవంత్ రెడ్డిని కలిసిన ఫోటోలను ఖర్గే, రాహుల్ ట్వీట్ చేశారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం రాబోతోందని పేర్కొన్నారు. ప్రజా తెలంగాణ కోసం కాంగ్రెస్ నేతలంతా కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. తాము ఇచ్చిన ఆరు హామీలను కచ్చితంగా అమలు చేస్తామని ఖర్గే ప్రకటించగా, రేవంత్ నాయకత్వంలో హామీలన్నీ నెరవేరుస్తామని రాహుల్ అన్నారు. ప్రముఖులతో సమావేశమైన అనంతరం రేవంత్ బుధవారం రాత్రి 10:20 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు సీఎస్, డీజీపీ, ఇతర అధికారులు, కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి రేవంత్ నేరుగా హోటల్ ఎల్లా చేరుకున్నారు.
Revanth Reddy: ఇవాళ సీఎంగా రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం.. 11 మంది మంత్రులు సైతం..
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!