Telangana Congress: నేడు నగరానికి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Congress: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏఐసీసీ నేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఒకె ఫ్లైట్ లో ఉదయం 9:30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం చేరుకోనున్న సోనియా, రాహుల్, ప్రియాంక హైదరాబాద్ చేరుకుంటారని గాందీభవన్ వర్గాలు తెలిపాయి. ఉదయం 07:20 గంటలకు UK-829 విమానంలో ఢిల్లి విమానాశ్రయం నుండి బయలుదేరి 9:30 గంటలకు శంషాబాద్ కు రానున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా తాజ్కృష్ణా హోటల్కు చేరుకుంటారని, కొంత విశ్రాంతి అనంతరం ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారని వెల్లడించారు. మరోవేపు రేవంత్ ప్రమాణ స్వీకారం కార్యక్రమముకు హాజరు అవుతున్న కర్ణాటక సిఎం సిద్ధి రామయ్య రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట విమానాశ్రయంకు సిద్ధైరమయ్య చేరుకుని, అక్కడి నుంచి నేరుగా LB స్టేడియంకి కర్ణాటక సిఎం చేరుకుంటారు.
Read also: Gold Price Today : గుడ్ న్యూస్..వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం.. తులం ఎంతంటే?
Also Read
- Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
- CM Revanth Reddy: తెలంగాణకు 'మెగా గ్రోత్ కారిడార్'.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
సీఎల్పీ నేతగా ఎన్నికైన తర్వాత మంగళవారం రాత్రి ఢిల్లీ వెళ్లిన రేవంత్.. బుధవారమంతా బిజీబిజీగా గడిపారు. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, హర్యానా ఎంపీ దీపేందర్ సింగ్ తదితరులతో పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఖర్గే వేర్వేరుగా సమావేశమయ్యారు. గురువారం జరిగే ప్రమాణస్వీకారోత్సవానికి హాజరు కావాలని వారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. తెల్లవారుజామున ఏపీలోని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు యమునా బ్లాక్లోని రేవంత్ నివాసానికి వచ్చి కలిశారు. ఇరవై నిమిషాల పాటు ఏకాంతంగా చర్చలు జరిపారు. చర్చలు బహిర్గతం కాలేదు.
Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
ప్రజా ప్రభుత్వం రాబోతోందంటూ ఖర్గే, రాహుల్ల ట్వీట్లు
బుధవారం ఢిల్లీలో రేవంత్ రెడ్డిని కలిసిన ఫోటోలను ఖర్గే, రాహుల్ ట్వీట్ చేశారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం రాబోతోందని పేర్కొన్నారు. ప్రజా తెలంగాణ కోసం కాంగ్రెస్ నేతలంతా కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. తాము ఇచ్చిన ఆరు హామీలను కచ్చితంగా అమలు చేస్తామని ఖర్గే ప్రకటించగా, రేవంత్ నాయకత్వంలో హామీలన్నీ నెరవేరుస్తామని రాహుల్ అన్నారు. ప్రముఖులతో సమావేశమైన అనంతరం రేవంత్ బుధవారం రాత్రి 10:20 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు సీఎస్, డీజీపీ, ఇతర అధికారులు, కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి రేవంత్ నేరుగా హోటల్ ఎల్లా చేరుకున్నారు.
Revanth Reddy: ఇవాళ సీఎంగా రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం.. 11 మంది మంత్రులు సైతం..
తాజావార్తలు
-
Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
-
Adani Group: అదానీ వేల కోట్ల సామ్రాజ్యంలోకి మరొక కంపెనీ.. ఇకపై జీవీకే ఎనర్జీ అదానీ సొంతం!
-
US-India-Russia: చమురు విషయంలో రష్యా హామీ.. అమెరికా ముందు భారత్ కీలక డిమాండ్..
-
Monsoon Alert: భారతీయులకు శుభవార్త.. 5 రోజుల ముందే అండమాన్ను తాకనున్న తొలకరి జల్లు
-
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?