Son Killed Mother: దారుణం.. ఆస్తికోసం కన్నతల్లినే కడతేర్చిన కొడుకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Son Killed Mother:హైదరాబాద్లోని రామంతాపూర్లో దారుణం జరిగింది. మానవత్వం మంటగలిసే ఘటన చోటుచేసుకుంది. అమ్మ కడుపునుంచి పేగు తెంచుకుని పుట్టిన కొడుకే తల్లిని ఆస్తి కోసం కడతేర్చిన ఘటన సంచలనంగా మారింది. తల్లిపేరు మీద ఉన్న ఆస్తి కోసం తన భార్య, స్నేహితుడితో కలిసి ఆమెను హత్య చేశాడు కసాయి కొడుకు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు నటించాడు. అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో బంధువులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
Read also: Viral News : ఈ హ్యాండ్ బ్యాగ్ కొనే బదులు..ఢిల్లీలో వందల ప్లాట్లు కొనుక్కోవచ్చు
Also Read
- Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
- OTR: వరంగల్ కాంగ్రెస్లో అసలేం జరుగుతోంది? కొండా వర్సెస్ కాంగ్రెస్ నేతలు..
- రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు
- సామాన్యులకు ఒక రూల్.. సీఎంకు, రెవెన్యూ మంత్రికి మరో రూలా..?: హరీష్రావు
సుగుణమ్మ తన కుమారుడు అనిల్, కోడలు తిరుమలతో కలిసి రామంతపూర్లో నివసిస్తోంది. సుగుణమ్మ పేరు మీద ఉన్న ఇంటిని కొడుకు, కోడలు అమ్మాలనుకున్నారు. కానీ సుగుణమ్మ అందుకు అంగీకరించలేదు. దీంతో తల్లిపై కక్ష పెంచుకున్నాడు కొడుకు. తల్లి ఆస్తిని ఎలాగైనా తీసుకోవాలి అనుకున్నాడు. కానీ దానికి తల్లి నిరాకరించడంతో ఆమెను చంపేందుకు భార్య, అతని స్నేహితుడితో ప్లాన్ వేశాడు. ఆస్తికోసం ఏకంగా తల్లినే హత్యచేసేందుకు ప్లాన్ వేసుకున్నారు ముగ్గురు. అయితే ఆ టైం రానే వచ్చింది. తల్లి సుగుణమ్మ ఇంట్లో ఉండగా బయట ఎవరూ లేని సమయం చూసి ముగ్గురు ఆమెపై దాడి చేశారు. అతి కిరాతకంగా హత్య చేశారు. ఏమీ తెలియనట్లు ఏడుస్తూ బయటకు వచ్చి సుగుణమ్మ చనిపోయిందంటూ నాటకం ఆడారు.
Read also: MLC Jeevan Reddy: ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియలో గవర్నర్ చొరవ చూపాలి..!
దీంతో స్థానికులు అందరూ పరుగుల సుగుణమ్మను చూసేందుకు వచ్చి కన్నీరుమున్నీరయ్యారు. అయితే బంధువులకు సుగుణమ్మ గురించి చెప్పగా అందరూ హుటా హుటిని ఘటనాస్థలానికి వచ్చారు. అయితే అనిల్ ఏడుస్తూ తల్లి చనిపోయింది అంటూ అంత్యక్రియలను ఏమీ లేకుండా పూర్తి చేయాలని కంగారు పడటంపై బంధువులకు అనుమానం వచ్చింది. దీంతో బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటా హుటిని ఘటనా స్థలికి వచ్చిన పోలీసులు మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. ఆరా తీయగా అసలు గుట్టు బయటపడింది. దీంతో.. మృతురాలి కుమారుడు, కోడలు సహా మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
Mahesh Babu: రీజనల్ సినిమాతో ఆర్ ఆర్ ఆర్ రికార్డ్ లేస్తుందా?
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!