MLC Jeevan Reddy: ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియలో గవర్నర్ చొరవ చూపాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Jeevan Reddy: గవర్నర్ చొరవ చూపీ, ఉద్యోగ నియామకాల భర్తీ ప్రకియకు మార్గం సుగమం చేయాలని గవర్నర్ తమిళిసై కి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేసారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో పీఆర్టీ టీఎస్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఉపాధ్యాయ సంఘ నాయకులుతో కలిసి జీవన్ రెడ్డి ఆవిష్కరించారు. గత ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వ నిర్లక్ష్యమే విద్యార్థుల సంఖ్య తగ్గుదలకి కారణమన్నారు. కేజీ టు పీ జీ ఉచిత విద్య ప్రకటనలకే పరిమితం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయాల్సి ఉండగా.. క్రమబద్ధీకరణ నెపంతో పాఠశాలలు మూసివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదలకు విద్యను దూరం చేశారని, ఓపీఎస్ విధానం అమలుకి విధాన పరమైన నిర్ణయం చేపడుతామన్నారు. 317 జోనల్ విధానం అమలుతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జోనల్ విధానాన్ని సమీక్షించి, ఉమ్మడి జిల్లాలప్రాతిపదికన జోన్ గా ఏర్పాటు చేసేలా కృషి చేస్తామన్నారు.
Read also: KTR: సిట్టింగ్ లను మార్చి ఉంటె బాగుండేది..! కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Also Read
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
- OTR: భూపాలపల్లి నుంచి హనుమకొండకు గండ్ర జ్యోతి ఓటు షిఫ్ట్.. అసలు వ్యూహమేంటి?
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
శాసన మండలిలో జోనల్ విధానం పై సమీక్షించాలన్నారు. పాఠశాలలో స్కావెంజర్ ను తొలగించడంతో ఉపాద్యాయులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేరళ రాష్ట్రంలో మాదిరిగా ముందస్తుగా నియామక ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్తానని తెలిపారు. నియామకాలలోలేని టెట్ ను పదోన్నతుల్లో ప్రవేశపెట్టడం సరికాదన్నారు. ఉపాధ్యాయుల ప్రతినిధిగా సమస్యల పరిష్కారం కోసం సీఎం దృష్టికి తీసుకెళ్తాని హామీ ఇచ్చారు. గవర్నర్ టీఎస్పీఎస్ సభ్యుల రాజీనామా ఆమోదించడం జాప్యం తో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. గవర్నర్ చొరవ చూపీ, ఉద్యోగ నియామకాల భర్తీ ప్రకియకు మార్గం సుగమం చేయాలని జీవన్ రెడ్డి గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. సమస్యలను లేవనేత్తడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేందుకు కృషి చేసే బాధ్యత తీసుకుంటా అని తెలిపారు.
Lok Sabha Elections : ఇండియా కూటమితో వెళ్లలా.. వద్దా.. తేల్చి చెప్పనున్న బీఎస్పీ అధినేత్రి మాయావతి
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!