Somesh Kumar: సోమేశ్ కుమార్ ఏపీకి వెళ్లాల్సిందే.. హైకోర్టు ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somesh Kumar: తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ ఇబ్బందుల్లో పడ్డారు. ఆయనను ఏపీ క్యాడర్కు పంపాల్సిందేనని హైకోర్టులో ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో సీఎస్ సోమేష్ కుమార్ కొనసాగింపును హైకోర్టు రద్దు చేసింది. సీఎస్ సోమేష్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్ర విభజనప్పుడు సోమేష్ కుమార్ ను కేంద్రం ఏపీకి కేటాయించిన విసయం తెలిసిందే.. కేంద్రం ఉత్తర్వులు నిలిపివేసి తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. క్యాట్ మధ్యంతర ఉత్తర్వులతో సోమేష్ కుమార్ తెలంగాణలో కొనసాగుతున్నారు. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేయాలని 2017లో కేంద్రం హైకోర్టును ఆశ్రయించింది. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేస్తూ సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్ తీర్పు వాదనలు వినిపించారు. సోమేష్ కుమార్ న్యాయవాది అభ్యర్థన మేరకు తీర్పు అమలు 3 వారాలు నిలిపివేశారు. అయితే.. తెలంగాణ హైకోర్టులో సీఎస్ సోమేశ్ కుమార్ కు చుక్కెదురైంది. డీఓపీటీ పిటిషన్ పై హైకోర్టు నేడు ఉత్తర్వులు జారీ చేసింది. సోమేశ్ కుమార్ ఏపీకు వెళ్లిపోవాలని హై కోర్టు ఆదేశించింది. సోమేశ్ కుమార్ కౌన్సిల్ సమయం కోరింది. సోమేశ్ కుమార్ తరపు న్యాయవాది అప్పీల్ కు సమయం కోరింది. సమయం ఇచ్చేది లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే హైకోర్టు నిర్ణయంతో సోమేశ్ కుమారు ఏపీకి వెళతారా? లేక సుప్రీం కోర్టుకు ఆశ్రయిస్తారా? అనేది చర్చ జరుగుతుంది.
Read also: Veera Simha Reddy: యాడజూడు నీదే జోరు.. మొగతాంది నీదే పేరు
Also Read
అయితే.. ఏపీ క్యాడర్కు కేటాయించినప్పటికీ ఆయన తెలంగాణలోనే విధులు నిర్వహిస్తూండటంపై దాఖలైన పిటిషన్ విషయంలో హైకోర్టు విచారణ జరిపింది. ఇక.. కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన ఏపీకి వెళ్లాల్సిందేనన్న వాదన వినిపించింది. దీనిపై హైకోర్టులో కేంద్రం స్పష్టమైన అభిప్రాయం చెప్పింది. కాగా.. ఆయన ఏపీకి పంపాల్సిందేనని తెలిపింది. ఈనేపథ్యంలో.. ఈ కేసులో వాదనలు పూర్తయ్యాయి..హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. అయితే తీర్పు రాక ముందే ఆయనపై బదిలీ వేటు పడే అవకాశం ఉందని అధికారవర్గాల్లో ప్రచారం జరుగింది. ఇక.. కేంద్రం కూడా స్పష్టంగా తన అభిప్రాయం చెప్పినందున సోమేష్ కు షాక్ తగలడం ఖాయమని భావించారు. కాగా..సోమేష్ కుమార్ను విభజన సమయంలో ఏపీ క్యాడర్కు కేటాయించారు. అయితే.. అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్కు వెళ్లి స్టే తెచ్చుకున్న ఆయన తెలంగాణ సర్వీస్లోనే కొనసాగుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయనకు తెలంగాణలో చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు ఇచ్చారు. ఈనేపథ్యంలో.. సోమేశ్ కుమార్ తీరుపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. న్యాయవ్యవస్థకు సంబంధించిన పలు సమస్యల పరిష్కారానికి అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని సీఎం కేసీఆర్ సీఎస్ను ఆదేశించారని పట్టించుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
-
Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు..అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
-
Shocking Statistics: 6 నెలల్లో 554 మంది భర్తల మృతి.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంచలన నివేదిక!
-
Pawan Kumar Chandana: మ్యాథ్స్లో 51 మార్కులు.. నేడు భారత తొలి ప్రైవేట్ రాకెట్ విజయవంతం.. హైదరాబాద్ కుర్రాడి విజయగాథ!
-
Jani Master: నిర్మాతల డబ్బులు దోచేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!