రాజీనామా సవాలుకు తోక ముడిచిన బీజీపీ : మంత్రి నిరంజన్ రెడ్డి
ఈ రోజు ఉదయం విసిరిన రాజీనామా సవాల్ స్వీకరించకుండా 2 గంటలకే బీజేపీ నేతలు దీక్షశిబిరం వదిలిపోయిన నేపథ్యంలో ఈ సాయంత్రం వనపర్తి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. 2022కు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాననిమోడీ అన్నారని దానికి తీసుకున్న చర్యలేవో బీజేపీ నేతలు చెప్పాలన్నారు.
11 గంటల నుంచి 2 గంటల వరకు చేసేదాన్ని దీక్ష అంటారా ? అని మంత్రి ప్రశ్నించారు. రైతులపై బీజేపీకి ఉన్న చిత్తశుద్ధి ఏంటో మరోసారి రుజువైందని అన్నారు. 2 గంటలకే దీక్ష వదిలేసి పారిపోయిన మీరు రేపటి నుంచి తెలంగాణ మొత్తం దీక్షలు ఎలా చేస్తారు. అసలు దీక్షలు ఎందుకు చేస్తారని మంత్రి బీజేపీ నేతలను ప్రశ్నించారు.
Also Read
- Explore to Expand: తెలంగాణ టూ గ్లోబల్.. 'ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్' వేదికను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు
- Revanth Reddy: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి 'బంపర్ గిఫ్ట్'.. 100 రోజుల్లో రూ. 6 వేల కోట్లు క్లియర్!
- Abhishek Sharma: హనుమాన్ ఆలయంలో కాటేరమ్మ కొడుకు.. రేపు దబిడిదిబిడే..
- Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
రైతుబంధు ఇస్తున్నందుకు దీక్ష చేస్తారా ? రైతుభీమా ఇస్తున్నందుకు దీక్ష చేస్తరా? గుజరాత్ లో కూడా ఇవ్వని విధంగా వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంటు ఇస్తున్నందుకు దీక్షలు చేస్తారో చెప్పాలన్నారు. దొడ్డు వడ్లు కొనమని కేంద్రం తెలంగాణకు రాసిన లేఖ చూయించినా బండి సంజయ్ మళ్లీ అడగడం విడ్డూరంగా ఉందన్నారు. ఇంగ్లీషు తెలియకుంటే తెలిసిన వారిని అడిగి తెలుసుకోవాలని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
పంజాబ్లో వరి ధాన్యం సేకరించిన విధంగా కేంద్రం తెలంగాణలో వరి ధాన్యం ఎందుకు సేకరించలేదు. అక్కడ ఎంత పెట్టుబడి, కష్టం ఉంటుందో ఇక్కడా అంతే కష్టం ఉంటుంది .. కానీ అత్యధిక ఉత్పత్తి సాధిస్తున్న తెలంగాణ రైతాంగాన్ని ఎందుకు ప్రోత్సహించరు ? అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. యూపీలో రైతుల పంటలు కొనడం లేదని తగులబెట్టుకుంటున్నారని ఆ పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ స్వయంగా ట్వీట్ చేశారు. నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై బీజేపీ మంత్రి కొడుకు వాహనం ఎక్కించి చంపేశాడు. మీకు చేతనైతే నల్లచట్టాలకు వ్యతిరేకంగా, కరెంటు చట్టాలకు వ్యతిరేకంగా దీక్షలు చేసి రద్దు చేయించాలని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!