సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) కార్మికుల సంక్షేమం దిశగా మరో కీలక అడుగు పడింది. సింగరేణి యాజమాన్యం తీసుకున్న ప్రత్యేక చొరవతో, కార్మికులకు లభించే బీమా సౌకర్యం ఇప్పుడు మరింత విస్తృతమైంది. ఇకపై ప్రమాదవశాత్తు జరిగే మరణాలకే కాకుండా, సహజ మరణానికి (Natural Death) కూడా రూ. 10 లక్షల ఉచిత బీమా పథకాన్ని అమలు చేయాలని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది.
యాజమాన్యం చొరవతో సాకారం
సాధారణంగా బ్యాంకులు ప్రమాద బీమాను మాత్రమే అందిస్తుంటాయి. అయితే, సింగరేణి కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని యాజమాన్యం యూనియన్ బ్యాంక్ అధికారులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కార్మికులందరికీ జీతాల ఖాతాలు (Salary Accounts) అదే బ్యాంకులో ఉండటంతో, సామాజిక బాధ్యతలో భాగంగా ఈ అదనపు ప్రయోజనాన్ని కల్పించేందుకు బ్యాంక్ అంగీకరించింది.
పథకం ముఖ్యాంశాలు:
US-Iran War: “మేము మీలా క్రూరులం కాదు”.. అమెరికన్ పైలట్ తల్లి బాధపై స్పందించిన ఇరాన్..
కుటుంబాలకు ఆర్థిక భరోసా
సింగరేణి వంటి కష్టతరమైన వృత్తిలో ఉన్న కార్మికులకు ఈ పథకం పెద్ద అండగా నిలవనుంది. విధి నిర్వహణలో కాకుండా, ఇంటి వద్ద సహజంగా మరణించినా వారి కుటుంబాలకు ఈ 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందుతుంది. ఇది కార్మిక కుటుంబాల్లో భరోసాను నింపుతోంది.
సింగరేణి చరిత్రలో ఇలా సహజ మరణానికి కూడా భారీ మొత్తంలో బీమా వర్తించడం ఇదే తొలిసారి అని కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. యాజమాన్యం , యూనియన్ బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయంపై కార్మికుల నుండి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.