Minister Atchannaidu: గతంలో మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు..! ఇప్పుడు ‘మావిగన్’ పేరుతో జగన్ మరో నాటకం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Atchannaidu: అమరావతి రాజధాని అంశంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారని, ఇప్పుడు ‘మావిగన్’ పేరుతో మరో రాజకీయ నాటకానికి శ్రీకారం చుట్టారని ఆయన ఆరోపించారు. గతంలో అసెంబ్లీలో అమరావతిని రాజధానిగా అంగీకరించి మద్దతు తెలిపినవారే ఇప్పుడు మాట మార్చారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు అమరావతి అభివృద్ధిపై దృష్టి పెట్టిందని, కానీ, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అభివృద్ధి ఆగిపోయిందని అన్నారు.
2019లో టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే రాష్ట్రానికి ఈ పరిస్థితి రాకపోయేదని ఆయన పేర్కొన్నారు అచ్చెన్నాయుడు… తమ పాలనలో దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, గ్రామీణ మౌలిక సదుపాయాలను మెరుగుపరిచామని చెప్పారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ.54 వేల కోట్లు ఖర్చు చేసి మూడు ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిపై కక్ష సాధింపుగా వ్యవహరించిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇప్పటికే ప్రారంభమైన పనులు పూర్తిచేసినా రాజధాని నిర్మాణం పూర్తయ్యేదని, కానీ వాటిని కూడా నిలిపివేశారని అన్నారు. అమరావతిని శ్మశానం, ఎడారి అంటూ అవమానించారని, కులాల పేరుతో విభేదాలు రేపారని విమర్శించారు.
Also Read
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
- Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
అమరావతిలో అవినీతి జరిగిందని ఆరోపణలు చేసినప్పటికీ వాటిని నిరూపించలేకపోయారని అన్నారు అచ్చెన్నాయుడు. మూడు రాజధానుల పేరుతో ప్రాంతీయ వైషమ్యాలు పెంచారని, ప్రజలను మోసం చేశారని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర ప్రజల మధ్య విభేదాలు సృష్టించడం ద్వారా రాజకీయ లాభం పొందాలని ప్రయత్నించారని ఆరోపించారు. అమరావతి ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని, దాని కోసం ప్రభుత్వ నిధులు అవసరం లేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా 34 వేల ఎకరాలు భూమి ఇచ్చారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలల్లోనే అమరావతి పనులు మళ్లీ ప్రారంభమయ్యాయని తెలిపారు.
మూడు రాజధానుల వల్ల రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ఏ ప్రయోజనం కలిగిందో చెప్పాలని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. గత ఐదేళ్లలో ప్రాజెక్టులు నిలిచిపోయాయని, ప్రజలను మోసం చేశారని అన్నారు. చివరగా, అమరావతి రాష్ట్ర భవిష్యత్తుకు కేంద్రబిందువుగా కొనసాగుతుందని, దాని ద్వారానే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ప్రజలు మళ్లీ తప్పు నిర్ణయం తీసుకోరని, అభివృద్ధికి అనుకూలంగా నిలుస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు మంత్రి అచ్చెన్నాయుడు..
తాజావార్తలు
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మాక్స్ రిలీజ్.. 10000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vaddi Kasula Vaadu: మంచు మనోజ్ ‘వడ్డీ కాసుల వాడ’లో అదిరే సర్ప్రైజ్… వెంకటేశ్వర స్వామిగా జయం రవి
-
India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!