US-Iran War: “మేము మీలా క్రూరులం కాదు”.. అమెరికన్ పైలట్ తల్లి బాధపై స్పందించిన ఇరాన్..
- ఇరాన్లో అమెరికన్ పైలట్ గురించి సెర్చింగ్..
- తన కొడుకు కోసం ప్రార్థించాలని పైలట్ తల్లి భావోద్వేగ పోస్ట్..
- తీవ్రంగా స్పందించిన ఇరాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran War: అమెరికా-ఇరాన్ యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. నెల రోజులు దాటినా, ఇరు పక్షాల మధ్య దాడులు ఆగడం లేదు. మరోవైపు, ఇరాన్ అమెరికాకు చెందిన అత్యాధునిక ఎఫ్-15 యుద్ధ విమానాన్ని కూల్చడం సంచలనంగా మారింది. ఏ-10 అటాక్ విమానాన్ని కూడా ఇరాన్ కుప్పకూల్చింది. అయితే, ఎఫ్-15 కూలిపోతున్న సమయంలో ఇద్దరు పైలట్లు విమానం నుంచి బయటపడ్డారు. వీరిలో ఒకరిని అమెరికన్ బలగాలు రెస్క్యూ చేశాయి. మరొకరి ఆచూకీ ఇప్పటికే తెలియరాలేదు.
Read Also: Tamil Nadu Elections: తమిళనాడులో గెలిచేదెవరు.? తాజా సర్వేలో సంచలన ఫలితాలు..
Also Read
ఇదిలా ఉంటే, గల్లంతైన పైలట్ తల్లి సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ పోస్ట్ పెట్టింది. తప్పిపోయిన పైలట్ తమ కుమారుడే అని, అతడి నుంచి ఎలాంటి సమాచారం రాలేదని, తన కుమారుడి కోసం అలాగే ఇతర పైలట్లందరి కోసం ప్రార్థించమని ఆమె అందరినీ కోరారు.
అయితే, ఆమె పోస్ట్పై పాకిస్తాన్, దక్షిణాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాలయాలు స్పందించాయి. ‘‘ఇరాన్ చెరలో సురక్షితంగా ఉండటం కన్నా డొనాల్డ్ ట్రంప్ తోనే మీ కుమారుడికి ఎక్కువ ప్రమాదం. అమెరికన్ రెస్క్యూ బృందాల అతడిని కనుగొనే వరకు అతను ఇరాన్ చెరలోనే ఉండేలా ప్రార్థించండి’’ అంటూ పాకిస్తాన్ లోని ఇరాన్ ఎంబసీ ట్వీట్ చేసింది. ఇక సౌతాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాలయం.. ఇరాన్ ఖైదీలను గౌరవంగా చూస్తుందని, ఇరాన్కు చాలా ప్రాచీన నాగరికత ఉందని, అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయెల్ లాగా ఖైదీలను క్రూరంగా హింసించదని రాయబార కార్యాలయం సోషల్ మీడియా పోస్ట్ చేసింది.
తాజావార్తలు
-
Rajesh Sharma : ఫౌజీ షూటింగ్లో రాజేష్ శర్మకు విషపురుగు కాటు?.. అసలు నిజం బయటపెట్టిన పీఏ!
-
Viral Video: ‘గ్రౌండ్లో పరుగెత్తలేను.. నేను ముసలివాడిని అయిపోయాను’: ఎంఎస్ ధోనీ
-
Jofra Archer: “ఇది ఐపీఎల్ కాదు”.. టీమిండియా ఘోర పతనంపై జోఫ్రా ఆర్చర్ సంచలన వ్యాఖ్యలు!
-
Fake Condoms: “కండోమ్”లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..
-
Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..