Bengaluru: బెంగళూరులో తెలంగాణ సాఫ్ట్వేర్ జంట ఆత్మహత్య.. కారణమిదేనా?
- బెంగళూరులో ఘోర విషాదం
- తెలంగాణ సాఫ్ట్వేర్ జంట ఆత్మహత్య
- దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరులో ఘోర విషాదం చోటుచేసుకుంది. తెలంగాణకు చెందిన సాఫ్ట్వేర్ జంట ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో సిద్దిపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ భాను చందర్ రెడ్డి కుంట (32), బీబీ షాజియా సిరాజ్ (31) భార్యాభర్తలు. బీబీ షాజియా సిరాజ్ ప్రముఖ టెక్ కంపెనీ ఐబీఎంలో పని చేస్తోంది. అయితే సోమవారం అపార్ట్మెంట్లో ఒక గదిలో భాను చందర్ రెడ్డి కుంట ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. షాజియా సిరాజ్ ఇంటికొచ్చి చూడగా గది తలుపు తాళం వేసి ఉంది. ఎంత సేపు పిలిచినా స్పందన కరవైంది. దీంతో ఇరుగుపొరుగు, భద్రతా సిబ్బందిని పిలిచింది. దీంతో వారు తలుపు బద్దలు కొట్టగా భాను చందర్ రెడ్డి ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించాడు. విగతజీవిగా పడి ఉన్నాడు. దీంతో ఆమె ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురైంది. క్షణాల వ్యవధిలోనే ఆమె కూడా 17వ అంతస్తు నుంచి కిందకు దూకింది. తీవ్ర గాయాలతో సంఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయింది. ఒకేసారి సాఫ్ట్వేర్ దంపతులు ప్రాణాలు కోల్పోవడంతో అపార్ట్మెంట్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
Also Read
ఇది కూడా చదవండి: Inter Result: అంతులేని విషాదం.. ఇంటర్ ఫలితాలు విడుదల.. ప్రాణాలతో లేని ‘టాపర్’
ఇక దంపతుల మరణ వార్త తెలుసుకున్న ఇరు కుటుంబ సభ్యులు బెంగళూరుకు వెళ్లారు. ఇరు కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. అసహజ మరణాలుగా వేర్వేరు ఫిర్యాదులు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టానికి తరలించారు. అయితే ఆరోగ్య సమస్యలు, ఇద్దరి మధ్య సంబంధాల సమస్యలు, మానసిక క్షోభ వంటి అనేక కోణాల్లో మరణాలు జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక కారణాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: IPS Couple Wedding: అప్పగింతల సమయంలో వెక్కి వెక్కి ఏడ్చిన ఐపీఎస్ పెళ్లికూతురు అన్షికా వర్మ
తాజావార్తలు
-
Karuppu: ‘కరుపు’ ట్రైలర్ టైమ్ ఫిక్స్.. సూర్య ఫ్యాన్స్కు మాస్ ట్రీట్ రెడీ!
-
Sony Xperia 1 VIII: త్వరలో వస్తోన్న Sony Xperia 1 VIII.. ధర, రిలీజ్ డేట్, ఫీచర్స్
-
P. Bharat Bhushan: ఏపీ ఎఫ్డీసీ చైర్మన్గా పి. భరత్ భూషణ్..
-
Jananayagan : జననాయగన్ రిలీజ్ అయితే రూ.1000 కోట్లు పక్కా
-
Himanta Biswa Sarma: హిమంత ది అన్స్టాపబుల్.. శాసనసభ పక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక.. సీఎం ఓత్ ఫిక్స్ డేట్