Inter Result: అంతులేని విషాదం.. ఇంటర్ ఫలితాలు విడుదల.. ప్రాణాలతో లేని ‘టాపర్’
- రాజస్థాన్లో ఇంటర్ ఫలితాలు విడుదల
- 93.88 శాతం మార్కులతో టాపర్గా నిలిచిన నికిత
- 10 రోజుల క్రితమే తుది శ్వాస విడిచిన నికిత
- తీవ్ర విషాదంలో తల్లిదండ్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లో ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల్లో నికిత అనే బాలిక 93.88 శాతం మార్కులతో టాపర్గా నిలిచింది. కానీ ఈ విజయాన్ని చూడడానికి ఆమె భూమ్మీద లేకపోవడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నికిత మరణం వెనుక ఉన్న అంతులేని గాథ కన్నీళ్లు రప్పిస్తున్నాయి.
నికిత శ్రీగంగానగర్ ప్రాంతానికి చెందిన వాసి. తల్లిదండ్రులు దినసరి కూలీలు. అయితేనేమీ చదువులో మంచి ప్రతిభ కలిగిన అమ్మాయి. శ్రీగంగానగర్లోని 7 కేఎన్ రావల్ ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలలో ఇంటర్ చదువుతోంది. తల్లిదండ్రులు రోజువారీ కూలీలు అయినప్పటికీ చదువులో ఏ మాత్రం వెనుకంజ వేయలేదు. అయితే నికిత గత కొద్దిరోజులుగా హెపటైటిస్, మధుమేహంతో బాధపడుతోంది. ఇటీవల వ్యాధులు తీవ్రం కావడంతో 10 రోజుల క్రితం (మార్చి 20, 2026) ప్రాణాలు కోల్పోయింది. చిన్న వయసులోనే మృతి చెందడంతో కుటుంబంలో.. గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
Also Read
- Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
- PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?
- CM Vijay Simplicity: దటీజ్ దళపతి.. సీఎం హోదాలో ఉన్నా.. టేబుల్ మోసి సింప్లిసిటీ చాటుకున్న విజయ్!
- PM Modi: కాంగ్రెస్కు కొత్త పేరు పెట్టిన మోడీ.. ‘MMC’ అంటే ముస్లిం లీగ్, మావోవాది కాంగ్రెస్!
తాజాగా మంగళవారం 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో నికిత 93.88 శాతం మార్కులతో విజయం సాధించింది. ఫలితాలు చూసిన తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కుమార్తెను తలుచుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. రాష్ట్రమంతటా తల్లిదండ్రులు సంతోషంలో మునిగిపోతే.. నికిత తల్లిదండ్రులు మాత్రం దు:ఖంలో మునిగిపోయారు. ఈ పరిణామం పలువురిని కంటతడి పెట్టించాయి. వ్యాధులు బాధించినా చదువులో ఏ మాత్రం వెనుకంజ వేయలేదని గుర్తుచేసుకుని బాధపడుతున్నారు.
ఇది కూడా చదవండి: IPS Couple Wedding: అప్పగింతల సమయంలో వెక్కి వెక్కి ఏడ్చిన ఐపీఎస్ పెళ్లికూతురు అన్షికా వర్మ
ఈ సంవత్సరం 12వ తరగతి బోర్డు పరీక్షలకు సుమారు 8.5 లక్షల మంది విద్యార్థులు నమోదు చేసుకోగా..8 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల్లో అమ్మాయిలు టాప్గా నిలిచారు. 96.42 శాతంతో బాలికలు పరీక్షలో ఉత్తీర్ణులు కాగా.. 92.64 శాతం బాలురు ఉత్తీర్ణులయ్యారు.
ఇది కూడా చదవండి: Opinion Polls Survey: బెంగాల్పై తాజా సర్వే వచ్చేసింది.. ఈసారి గెలవబోయేది ఎవరంటే..!
తాజావార్తలు
-
Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్గా ఇలా ట్రై చేయండి!
-
Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?