Viral : ప్రభుత్వ పాఠశాలకు తాళం వేసిన విద్యార్థుల తల్లిదండ్రులు
- దొమ్మాట పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతపై ఆందోళన
- ఇద్దరు టీచర్లతోనే బోధన.. తల్లిదండ్రుల ఆగ్రహం
- పాఠశాలకు తాళం వేసిన గ్రామస్తులు
- ముగ్గురు ఉపాధ్యాయులు నియమించే వరకు స్కూల్ తాళం తీయబోమన్న తల్లిదండ్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral : సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం దొమ్మాట గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలో మొత్తం 36 మంది విద్యార్థులు ఉండగా, వారిని బోధించేందుకు కేవలం ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే వారిలో ఒకరు డిప్యూటేషన్ పై మరో పాఠశాలకు వెళ్లడంతో ప్రస్తుతం ఇద్దరు ఉపాధ్యాయులతోనే బోధన కొనసాగుతోంది.
The Raja Saab: బర్త్ డే స్పెషల్..‘రాజా సాబ్‘ నుంచి.. ప్రభాస్ స్పెషల్ పోస్టర్ రిలీజ్
Also Read
ఈ పరిస్థితిపై అసహనం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు పాఠశాలకు తాళం వేసి నిరసన తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పాఠశాలలో తగిన సంఖ్యలో ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. “ముగ్గురు టీచర్లు తిరిగి నియమించే వరకు స్కూల్ తాళం తీయమని” తల్లిదండ్రులు స్పష్టం చేశారు. తల్లిదండ్రులు ప్రభుత్వ విద్యా వ్యవస్థపై నిరాశ వ్యక్తం చేస్తూ, తక్షణ చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను కోరారు. గ్రామస్థులు కూడా తల్లిదండ్రుల ఆందోళనకు మద్దతు తెలుపుతూ, విద్యార్థుల కోసం అవసరమైన ఉపాధ్యాయులను వెంటనే నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
YS Jagan: చరిత్రలో ఇలా ఎప్పుడు జరగలేదు.. ఉద్యోగుల అంశంపై మాజీ సీఎం జగన్ సీరియస్..!
తాజావార్తలు
-
Telangana : ఇకపై ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వేర్వేరుగా ప్రాక్టికల్స్.!
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
-
OTR : బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరమైనట్టేనా..?
-
AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
-
Chairman’s Desk : సీఎం స్పీడుని మంత్రులు అందుకోవడం లేదా..? ప్రతిపక్షాల గళం పదునెక్కుతోందా..?
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!