Site icon NTV Telugu

Duddilla Sridharbabu : సిద్దిపేట రైతులకు ‘గడ్డి’తోనే గల్లా నిండా డబ్బు..

Duddilla Sridhar Babu

Duddilla Sridhar Babu

తెలంగాణ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. నర్మెట్టలో బయో గ్యాస్ ప్లాంట్ శంకుస్థాపన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2047 ఆర్థిక లక్ష్యాలను అందుకునే దిశగా అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. గత ప్రభుత్వం చేపట్టిన కొన్ని మంచి పథకాలను కూడా ముందుకు తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారని ఆయన తెలిపారు.

Harudu: హీరో వెంకట్ కమ్ బ్యాక్.. పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ‘హరుడు’!

ప్రస్తుతం మన దేశానికి అవసరమైన ఇంధనంలో 65 శాతం ఇతర దేశాల నుండి దిగుమతి అవుతోందని, అంతర్జాతీయ యుద్ధాల వల్ల క్రూడాయిల్ సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి తరుణంలో కాలుష్య రహితమైన బయో గ్యాస్ ఫ్యాక్టరీలు ఎంతో అవసరమని, డిసెంబర్ నాటికే ఈ ప్లాంట్ అందుబాటులోకి రావాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడ పరిశ్రమల అవసరం ఉంటే అక్కడ ఎలాంటి భేషజాలు లేకుండా ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు.

సిద్దిపేట ప్రాంతానికి బయో గ్యాస్ ప్లాంట్ రావడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు సంతోషం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు సమృద్ధిగా అందుబాటులోకి రావడం వల్లే ఈ ప్రాంతానికి కంపెనీలు తరలివస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. ఈ ప్లాంట్ వల్ల రైతులకు రెట్టింపు లాభం చేకూరుతుందని, వరి ధాన్యంతో పాటు వరి గడ్డిని అమ్మడం ద్వారా కూడా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని తెలిపారు. బయో ఫ్యూయల్స్ అందుబాటులోకి వస్తే యుద్ధాలు సంభవించినా దేశంలో గ్యాస్ కొరత ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.

Mega 158 : జన నాయగన్ ఎఫెక్ట్.. మెగా 158పై గట్టిగానే ప్రభావం చూపిస్తోంది

మాజీ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ.. గడ్డితో గ్యాస్ తయారు చేయడం అద్భుతమైన ప్రక్రియ అని, ఇది ఇంధన కొరతను తీరుస్తుందని అన్నారు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణ వారు సోదరభావంతో మెలగాలని, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ పారిశ్రామికవేత్తలకు అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. అదే విధంగా తెలంగాణ వారు పెట్టుబడులు పెట్టేందుకు అమరావతిలో కూడా అవకాశాలు ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్మిస్తున్న ‘ఫ్యూచర్ సిటీ’లో పారిశ్రామికవేత్తలకు అపారమైన అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.

Exit mobile version