సిరివెన్నెల మరణం కలచి వేసింది: బండారు దత్తాత్రేయ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ సినీ గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి మృతిపై హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను ఎంతగానో కలిసి వేసిందన్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు జాతీయవాదం, దేశ భక్తి మరియు మానవతా విలువలకు మారుపేరుగా నిలిచిన గొప్ప గేయ రచయిత అని బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. వారి మరణ వార్త తనను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందన్నారు. శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు సినీ పాటలు రాయడమే గాక ఆధ్యాత్మిక విలువలను, ధార్మిక విలువలను పాటించేవారని, వారితో తనకు మూడు దశాబ్దాల సన్నిహిత స్నేహ సంబంధాలున్నాయని తెలిపారు.
వారు తనతో ఎంతో ఆత్మీయత ప్రేమాభిమానాలతో మెలిగేవారని, పద్మశ్రీ అందుకున్నప్పుడు వారి స్వగృహంలో కలిసి సన్మానించినప్పుడు వారు చాలా సంతోషించారని బండారు దత్తాత్రేయ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిలాంటి సన్నిహితుణ్ణి కోల్పోవడం బాధాకరమని, వారి మృతి తెలుగు సినీ రంగానికే గాక సాహితీ లోకానికి తీరని లోటు అని, వారి మృతికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతిచేకూర్చాలని ప్రార్థిస్తున్నట్టు దత్తాత్రేయ పేర్కొన్నారు. వారి కుటుంబానికి ఈ కష్టకాలంలో బాధను తట్టుకోవడానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి వేడుకుంటున్నట్లు బండారు దత్తాత్రేయ సంతాపం వ్యక్తం చేశారు.
Also Read
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!