GHMC Fingerprint Scam: వెలుగులోకి సంచలన నిజాలు.. పెద్ద కుట్రే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GHMC Fingerprint Scam: గతంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు, కాంట్రాక్టర్లు కలిసి.. లేని కార్మికుల్ని సైతం ఉన్నారని చూపుతూ కోట్ల రూపాయల్లో దండుకున్నారు. దానికి చెక్ పెట్టేందుకే సింథటిక్ ఫింగర్ ప్రింట్ వ్యవస్థని తీసుకొచ్చారు. అయినా మార్పు రాలేదు. నకిలీ ఫింగర్ ప్రింట్స్ని తయారు చేస్తూ, డబ్బులు దోచేస్తున్నట్టు తేలింది. జీహెచ్ఎంసీలో పని చేసే శానిటరీ ఇన్స్పెక్టర్లే ఈ అవినీతికి పాల్పడటం షాక్కి గురి చేసే విషయం. గతంలో కొందరిని రెడ్హ్యాండెడ్గా పట్టుకొని విధుల నుంచి తొలగించినా.. పరిస్థితి మారలేదు. తాజాగా ఈ సింథటిక్ ఫింగర్ ప్రింట్ స్కామ్ వెలుగుచూసింది.
రంగంలోకి దిగిన పోలీసులు.. ముగ్గురు శానిటరీ ఇన్స్పెక్టర్లను అరెస్ట్ చేశారు. గోషామహల్, మలక్పేట్ వన్ అండ్ టూకి చెందిన ఈ శానిటరీ ఇన్స్పెక్టర్ల నుంచి వేల సంఖ్యలో నకిలీ సింథటిక్ ఫింగర్ ప్రింట్స్ను స్వాధీనపరుచుకున్నారు. గోషామహల్ సర్కిల్ పరిధిలో ఎస్ఎఫ్ఏ వెంకట్ రెడ్డి విధులకు రాని కార్మికులకు సింథటిక్ వేలి ముద్రలతో హాజరు వేస్తున్నప్పుడు.. నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి నకిలీ ఫింగర్ ప్రింట్స్ స్వాధీనం చేసుకున్నారు. అతడ్ని విచారించగా.. ఉన్నతాధికారుల సూచన మేరకే తాను సింథటిక్ వేలిముద్రలు వినియోగించానని పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. అదే మాదిరిగా మలక్పేట్లోని వన్ అండ్ టూకు సంబంధించిన సానిటరీ ఇన్స్పెక్టర్స్ని సైతం అరెస్ట్ చేశారు. ఈ నకిలీ ఫింగర్ ప్రింట్ వ్యవహారంలో వెంకటరెడ్డి కీలకపాత్ర పోషించాడని ట్రాన్స్పోర్ట్ అధికారులు వెల్లడించారు.
Also Read
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
కాగా.. గ్రేటర్లో 18 వేల మందికిపైగా ఔట్సోర్సింగ్ పారిశుధ్య కార్మికులున్నారు. చాలామంది కార్మికులు రాకపోయినా, వారి వచ్చినట్టు కాగితాల్లో చూపుతూ వేతనాలు కాజేయడం దశాబ్దాలుగా కొనసాగుతోంది. గతంలో నిర్వహించిన తనిఖీల్లో 25 శాతం నుంచి 30 శాతానికిపైగా బోగస్ కార్మికులున్నట్టు గుర్తించారు. బయోమెట్రిక్ హాజరు విధానానికి శ్రీకారం చుట్టినా, ఇళ్లలో నుంచే హాజరు వేస్తున్నట్టు తేలడంతో మ్యాపింగ్ ప్రారంభించారు. ఆ తర్వాత సింథటిక్ ఫింగర్ ప్రింట్స్ విధానం అమలుపరిచినా.. ఇందులోనూ స్కామ్ జరుగుతోంది. 2019లో మొత్తం ఈ స్కామ్లో భాగంగా 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉన్నతాధికారుల సూచనల మేరకే ఈ స్కామ్ జరుగుతున్నట్టు గుర్తించారు. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అలాంటి స్కామ్ వెలుగుచూడటం కలకలం రేపింది.
తాజావార్తలు
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
Allu Arjun : అల్లు అర్జున్ తెలుగు డైరెక్టర్స్ను పట్టించుకోడా?
-
King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Tamannaah Bhatia: ‘రాగిణి 3’ షూటింగ్ ప్రారంభం.. సెట్స్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!