GHMC Fingerprint Scam: వెలుగులోకి సంచలన నిజాలు.. పెద్ద కుట్రే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GHMC Fingerprint Scam: గతంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు, కాంట్రాక్టర్లు కలిసి.. లేని కార్మికుల్ని సైతం ఉన్నారని చూపుతూ కోట్ల రూపాయల్లో దండుకున్నారు. దానికి చెక్ పెట్టేందుకే సింథటిక్ ఫింగర్ ప్రింట్ వ్యవస్థని తీసుకొచ్చారు. అయినా మార్పు రాలేదు. నకిలీ ఫింగర్ ప్రింట్స్ని తయారు చేస్తూ, డబ్బులు దోచేస్తున్నట్టు తేలింది. జీహెచ్ఎంసీలో పని చేసే శానిటరీ ఇన్స్పెక్టర్లే ఈ అవినీతికి పాల్పడటం షాక్కి గురి చేసే విషయం. గతంలో కొందరిని రెడ్హ్యాండెడ్గా పట్టుకొని విధుల నుంచి తొలగించినా.. పరిస్థితి మారలేదు. తాజాగా ఈ సింథటిక్ ఫింగర్ ప్రింట్ స్కామ్ వెలుగుచూసింది.
రంగంలోకి దిగిన పోలీసులు.. ముగ్గురు శానిటరీ ఇన్స్పెక్టర్లను అరెస్ట్ చేశారు. గోషామహల్, మలక్పేట్ వన్ అండ్ టూకి చెందిన ఈ శానిటరీ ఇన్స్పెక్టర్ల నుంచి వేల సంఖ్యలో నకిలీ సింథటిక్ ఫింగర్ ప్రింట్స్ను స్వాధీనపరుచుకున్నారు. గోషామహల్ సర్కిల్ పరిధిలో ఎస్ఎఫ్ఏ వెంకట్ రెడ్డి విధులకు రాని కార్మికులకు సింథటిక్ వేలి ముద్రలతో హాజరు వేస్తున్నప్పుడు.. నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి నకిలీ ఫింగర్ ప్రింట్స్ స్వాధీనం చేసుకున్నారు. అతడ్ని విచారించగా.. ఉన్నతాధికారుల సూచన మేరకే తాను సింథటిక్ వేలిముద్రలు వినియోగించానని పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. అదే మాదిరిగా మలక్పేట్లోని వన్ అండ్ టూకు సంబంధించిన సానిటరీ ఇన్స్పెక్టర్స్ని సైతం అరెస్ట్ చేశారు. ఈ నకిలీ ఫింగర్ ప్రింట్ వ్యవహారంలో వెంకటరెడ్డి కీలకపాత్ర పోషించాడని ట్రాన్స్పోర్ట్ అధికారులు వెల్లడించారు.
Also Read
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
- Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
కాగా.. గ్రేటర్లో 18 వేల మందికిపైగా ఔట్సోర్సింగ్ పారిశుధ్య కార్మికులున్నారు. చాలామంది కార్మికులు రాకపోయినా, వారి వచ్చినట్టు కాగితాల్లో చూపుతూ వేతనాలు కాజేయడం దశాబ్దాలుగా కొనసాగుతోంది. గతంలో నిర్వహించిన తనిఖీల్లో 25 శాతం నుంచి 30 శాతానికిపైగా బోగస్ కార్మికులున్నట్టు గుర్తించారు. బయోమెట్రిక్ హాజరు విధానానికి శ్రీకారం చుట్టినా, ఇళ్లలో నుంచే హాజరు వేస్తున్నట్టు తేలడంతో మ్యాపింగ్ ప్రారంభించారు. ఆ తర్వాత సింథటిక్ ఫింగర్ ప్రింట్స్ విధానం అమలుపరిచినా.. ఇందులోనూ స్కామ్ జరుగుతోంది. 2019లో మొత్తం ఈ స్కామ్లో భాగంగా 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉన్నతాధికారుల సూచనల మేరకే ఈ స్కామ్ జరుగుతున్నట్టు గుర్తించారు. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అలాంటి స్కామ్ వెలుగుచూడటం కలకలం రేపింది.
తాజావార్తలు
-
Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
-
Gold and Silver Rates: కమింగ్ డౌన్.. నేడు మళ్లీ పతనమైన గోల్డ్, సిల్వర్ ధరలు..
-
TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
-
Vrushakarma: ‘వృషకర్మ’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
India Unemployment: ఆరు నెలల గరిష్ఠానికి చేరిన భారత నిరుద్యోగ రేటు.. ఏప్రిల్లో 5.2% శాతానికి
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..