GHMC Fingerprint Scam: వెలుగులోకి సంచలన నిజాలు.. పెద్ద కుట్రే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GHMC Fingerprint Scam: గతంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు, కాంట్రాక్టర్లు కలిసి.. లేని కార్మికుల్ని సైతం ఉన్నారని చూపుతూ కోట్ల రూపాయల్లో దండుకున్నారు. దానికి చెక్ పెట్టేందుకే సింథటిక్ ఫింగర్ ప్రింట్ వ్యవస్థని తీసుకొచ్చారు. అయినా మార్పు రాలేదు. నకిలీ ఫింగర్ ప్రింట్స్ని తయారు చేస్తూ, డబ్బులు దోచేస్తున్నట్టు తేలింది. జీహెచ్ఎంసీలో పని చేసే శానిటరీ ఇన్స్పెక్టర్లే ఈ అవినీతికి పాల్పడటం షాక్కి గురి చేసే విషయం. గతంలో కొందరిని రెడ్హ్యాండెడ్గా పట్టుకొని విధుల నుంచి తొలగించినా.. పరిస్థితి మారలేదు. తాజాగా ఈ సింథటిక్ ఫింగర్ ప్రింట్ స్కామ్ వెలుగుచూసింది.
రంగంలోకి దిగిన పోలీసులు.. ముగ్గురు శానిటరీ ఇన్స్పెక్టర్లను అరెస్ట్ చేశారు. గోషామహల్, మలక్పేట్ వన్ అండ్ టూకి చెందిన ఈ శానిటరీ ఇన్స్పెక్టర్ల నుంచి వేల సంఖ్యలో నకిలీ సింథటిక్ ఫింగర్ ప్రింట్స్ను స్వాధీనపరుచుకున్నారు. గోషామహల్ సర్కిల్ పరిధిలో ఎస్ఎఫ్ఏ వెంకట్ రెడ్డి విధులకు రాని కార్మికులకు సింథటిక్ వేలి ముద్రలతో హాజరు వేస్తున్నప్పుడు.. నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి నకిలీ ఫింగర్ ప్రింట్స్ స్వాధీనం చేసుకున్నారు. అతడ్ని విచారించగా.. ఉన్నతాధికారుల సూచన మేరకే తాను సింథటిక్ వేలిముద్రలు వినియోగించానని పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. అదే మాదిరిగా మలక్పేట్లోని వన్ అండ్ టూకు సంబంధించిన సానిటరీ ఇన్స్పెక్టర్స్ని సైతం అరెస్ట్ చేశారు. ఈ నకిలీ ఫింగర్ ప్రింట్ వ్యవహారంలో వెంకటరెడ్డి కీలకపాత్ర పోషించాడని ట్రాన్స్పోర్ట్ అధికారులు వెల్లడించారు.
Also Read
- Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
- Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
- Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
- KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై లైంగిక వేధింపుల కేసులు పెట్టడం దుర్మార్గం..
కాగా.. గ్రేటర్లో 18 వేల మందికిపైగా ఔట్సోర్సింగ్ పారిశుధ్య కార్మికులున్నారు. చాలామంది కార్మికులు రాకపోయినా, వారి వచ్చినట్టు కాగితాల్లో చూపుతూ వేతనాలు కాజేయడం దశాబ్దాలుగా కొనసాగుతోంది. గతంలో నిర్వహించిన తనిఖీల్లో 25 శాతం నుంచి 30 శాతానికిపైగా బోగస్ కార్మికులున్నట్టు గుర్తించారు. బయోమెట్రిక్ హాజరు విధానానికి శ్రీకారం చుట్టినా, ఇళ్లలో నుంచే హాజరు వేస్తున్నట్టు తేలడంతో మ్యాపింగ్ ప్రారంభించారు. ఆ తర్వాత సింథటిక్ ఫింగర్ ప్రింట్స్ విధానం అమలుపరిచినా.. ఇందులోనూ స్కామ్ జరుగుతోంది. 2019లో మొత్తం ఈ స్కామ్లో భాగంగా 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉన్నతాధికారుల సూచనల మేరకే ఈ స్కామ్ జరుగుతున్నట్టు గుర్తించారు. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అలాంటి స్కామ్ వెలుగుచూడటం కలకలం రేపింది.
తాజావార్తలు
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
-
Irumudi Effect : అయ్యప్ప దీక్షలో గణపయ్య.. తలపై స్వయంగా ‘ఇరుముడి’ పెడుతున్న శివుడు!
-
Allu Arjun Fans : బాక్సాఫీస్ వద్దే కాదు సామాజిక సేవలోనూ ‘తగ్గేదే లే’
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!