Mohammad Shabbir Ali: కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలే.. కానీ తెలంగాణలో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammad Shabbir Ali: కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రతి మహిళకు 60 ఏళ్ల లోపు ఉన్న వారందరికీ 2500 ఆర్థిక సహాయం చేస్తామని అర్బన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. నిజామాబాద్ నగరంలోని గాజుల్ పేటలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలే అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 400 సిలిండర్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో 1200 వచ్చిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయంలోనూ 108 ఆదుకుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరోగ్య శ్రీ కి 10లక్షలు అమలు చేస్తామన్నారు. గ్యాస్ సిలిండర్ 5 వందలకు అందిస్తామన్నారు. యూనివర్సిటీలో ఉద్యోగాల కోసం తెలంగాణ కోసం అమరులైతే ఆదుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రతి మహిళకు 60 ఏళ్ల లోపు ఉన్న వారందరికీ 2500 ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఎక్కడ ప్రయాణం చేసిన వారందరికీ ఫ్రీ అని తెలిపారు. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలని కోరారు.
Read also: Pushpa 2: పుష్ప 2 హైలెట్ సీన్ లీక్.. ఎంత పని చేశావ్ దేవి..
Also Read
బీసీ బంధు, మైనార్టీ బంధు తదితర ప్రభుత్వ పథకాల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ.. ఎమ్మెల్యేల ప్రమేయంపై కేసీఆర్ మందలించారని మహ్మద్ అలీ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక ఆందోళనలను హైలైట్ చేస్తూ, షబ్బీర్ అలీ నగరం యొక్క దిగజారుతున్న పరిస్థితులను ఎత్తి చూపారు. డ్రైనేజీ సమస్యతో పాటు దోమల బెడదతో నగరవాసులకు అనారోగ్య సమస్యలు మరింత పెరిగాయన్నారు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటు వేసి గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం చెబుతున్న అభివృద్దికి విరుద్ధంగా నగరం వాగ్దానం చేసిన ప్రగతికి నోచుకోలేదని షబ్బీర్ అలీ వాదించారు. ఈ క్రమంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీపై పలు విమర్శలు చేశారు. దశాబ్దాల కేంద్ర ప్రభుత్వ పాలనను ప్రశ్నించిన షబ్బీర్ అలీ.. అదానీ, అంబానీలను ఉదాహరణగా చూపుతూ అభివృద్ధిని కోరుకునే కొద్దిమందికే లబ్ధి చేకూర్చారన్నారు. ప్రతి ఒక్కరి అభివృద్ధి, ప్రగతి కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తామని, అన్ని వర్గాల ప్రజలు, ప్రాంతాల అభివృద్ధికి భరోసా కల్పిస్తామని మరోసారి స్పష్టం చేశారు.
Malreddy Ranga Reddy: తెలంగాణ ఇచ్చింది.. తెచ్చింది కాంగ్రెస్సే
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!