Mohammad Shabbir Ali: కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలే.. కానీ తెలంగాణలో..!
Mohammad Shabbir Ali: కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రతి మహిళకు 60 ఏళ్ల లోపు ఉన్న వారందరికీ 2500 ఆర్థిక సహాయం చేస్తామని అర్బన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. నిజామాబాద్ నగరంలోని గాజుల్ పేటలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలే అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 400 సిలిండర్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో 1200 వచ్చిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయంలోనూ 108 ఆదుకుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరోగ్య శ్రీ కి 10లక్షలు అమలు చేస్తామన్నారు. గ్యాస్ సిలిండర్ 5 వందలకు అందిస్తామన్నారు. యూనివర్సిటీలో ఉద్యోగాల కోసం తెలంగాణ కోసం అమరులైతే ఆదుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రతి మహిళకు 60 ఏళ్ల లోపు ఉన్న వారందరికీ 2500 ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఎక్కడ ప్రయాణం చేసిన వారందరికీ ఫ్రీ అని తెలిపారు. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలని కోరారు.
Read also: Pushpa 2: పుష్ప 2 హైలెట్ సీన్ లీక్.. ఎంత పని చేశావ్ దేవి..
Also Read
- Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
- KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
- Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
- Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
బీసీ బంధు, మైనార్టీ బంధు తదితర ప్రభుత్వ పథకాల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ.. ఎమ్మెల్యేల ప్రమేయంపై కేసీఆర్ మందలించారని మహ్మద్ అలీ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక ఆందోళనలను హైలైట్ చేస్తూ, షబ్బీర్ అలీ నగరం యొక్క దిగజారుతున్న పరిస్థితులను ఎత్తి చూపారు. డ్రైనేజీ సమస్యతో పాటు దోమల బెడదతో నగరవాసులకు అనారోగ్య సమస్యలు మరింత పెరిగాయన్నారు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటు వేసి గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం చెబుతున్న అభివృద్దికి విరుద్ధంగా నగరం వాగ్దానం చేసిన ప్రగతికి నోచుకోలేదని షబ్బీర్ అలీ వాదించారు. ఈ క్రమంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీపై పలు విమర్శలు చేశారు. దశాబ్దాల కేంద్ర ప్రభుత్వ పాలనను ప్రశ్నించిన షబ్బీర్ అలీ.. అదానీ, అంబానీలను ఉదాహరణగా చూపుతూ అభివృద్ధిని కోరుకునే కొద్దిమందికే లబ్ధి చేకూర్చారన్నారు. ప్రతి ఒక్కరి అభివృద్ధి, ప్రగతి కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తామని, అన్ని వర్గాల ప్రజలు, ప్రాంతాల అభివృద్ధికి భరోసా కల్పిస్తామని మరోసారి స్పష్టం చేశారు.
Malreddy Ranga Reddy: తెలంగాణ ఇచ్చింది.. తెచ్చింది కాంగ్రెస్సే
తాజావార్తలు
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
-
PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
-
Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
-
Venkatesh: మోహన్లాల్ నటనను నేను రీక్రియేట్ చేయలేను.. వెంకటేష్ గ్రేట్ స్టేట్మెంట్!
-
Salman Khan-RR: సారీ భాయ్, ఈ రోజు కాదు.. సల్మాన్ ఖాన్ పోస్ట్కు రాజస్థాన్ రాయల్స్ రిప్లై!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో