Mohammad Shabbir Ali: కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలే.. కానీ తెలంగాణలో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammad Shabbir Ali: కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రతి మహిళకు 60 ఏళ్ల లోపు ఉన్న వారందరికీ 2500 ఆర్థిక సహాయం చేస్తామని అర్బన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. నిజామాబాద్ నగరంలోని గాజుల్ పేటలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలే అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 400 సిలిండర్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో 1200 వచ్చిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయంలోనూ 108 ఆదుకుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరోగ్య శ్రీ కి 10లక్షలు అమలు చేస్తామన్నారు. గ్యాస్ సిలిండర్ 5 వందలకు అందిస్తామన్నారు. యూనివర్సిటీలో ఉద్యోగాల కోసం తెలంగాణ కోసం అమరులైతే ఆదుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రతి మహిళకు 60 ఏళ్ల లోపు ఉన్న వారందరికీ 2500 ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఎక్కడ ప్రయాణం చేసిన వారందరికీ ఫ్రీ అని తెలిపారు. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలని కోరారు.
Read also: Pushpa 2: పుష్ప 2 హైలెట్ సీన్ లీక్.. ఎంత పని చేశావ్ దేవి..
Also Read
బీసీ బంధు, మైనార్టీ బంధు తదితర ప్రభుత్వ పథకాల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ.. ఎమ్మెల్యేల ప్రమేయంపై కేసీఆర్ మందలించారని మహ్మద్ అలీ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక ఆందోళనలను హైలైట్ చేస్తూ, షబ్బీర్ అలీ నగరం యొక్క దిగజారుతున్న పరిస్థితులను ఎత్తి చూపారు. డ్రైనేజీ సమస్యతో పాటు దోమల బెడదతో నగరవాసులకు అనారోగ్య సమస్యలు మరింత పెరిగాయన్నారు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటు వేసి గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం చెబుతున్న అభివృద్దికి విరుద్ధంగా నగరం వాగ్దానం చేసిన ప్రగతికి నోచుకోలేదని షబ్బీర్ అలీ వాదించారు. ఈ క్రమంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీపై పలు విమర్శలు చేశారు. దశాబ్దాల కేంద్ర ప్రభుత్వ పాలనను ప్రశ్నించిన షబ్బీర్ అలీ.. అదానీ, అంబానీలను ఉదాహరణగా చూపుతూ అభివృద్ధిని కోరుకునే కొద్దిమందికే లబ్ధి చేకూర్చారన్నారు. ప్రతి ఒక్కరి అభివృద్ధి, ప్రగతి కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తామని, అన్ని వర్గాల ప్రజలు, ప్రాంతాల అభివృద్ధికి భరోసా కల్పిస్తామని మరోసారి స్పష్టం చేశారు.
Malreddy Ranga Reddy: తెలంగాణ ఇచ్చింది.. తెచ్చింది కాంగ్రెస్సే
తాజావార్తలు
-
Shraddha Kapoor: శ్రద్ధా కపూర్ ‘ఈత’ సినిమాకు ఊహించని చిక్కు.. కోర్టు మెట్లు ఎక్కనున్న కుటుంబం
-
Pawan Kalyan : ఓవర్ స్పీడ్లో దూసుకెళ్తున్న OG 2
-
Team India: పసికూన ఎంత పనిచేసే.. 1050 రోజుల తర్వాత టీమిండియాకు షాక్.. అజేయ పరంపరకు బ్రేక్!
-
NBK 111 : బాలయ్య సినిమా డిసెంబర్ లేదా సంక్రాంతి రిలీజ్ ఫిక్స్
-
WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు గుడ్న్యూస్.. మరో స్మార్ట్ ఫీచర్.. మరింత భద్రత..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!