Telangana Congress: బీఆర్ఎస్ కు షాక్ .. కాంగ్రెస్ లో శేరిలింగంపల్లి కార్పొరేటర్ దంపతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Congress: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఓ వైపు పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తూనే మరోవైపు పార్టీ ఫిరాయించే వారి సంఖ్య పెరుగుతోంది. అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసలు పెరుగుతున్నాయి. ఇటీవలే సేరిలింగంపల్లికి చెందిన బీఆర్ఎస్ కార్పొరేటర్ దంపతులు కాంగ్రెస్లో చేరారు. శ్రీలింగంపల్లి బీఆర్ఎస్ కార్పొరేటర్ దంపతులు జగదీశ్వర్ గౌడ్, పూజిత భారీ ర్యాలీతో కాంగ్రెస్లో చేరారు. అంతకు ముందు జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయంలో అనుచరులు, కార్యకర్తలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగదీశ్వర్ గౌడ్ మూడుసార్లు సేరిలింగంపల్లి నుంచి కార్పొరేటర్గా గెలుపొందారు. ఆయన భార్య పూజిత కూడా రెండుసార్లు కార్పొరేటర్గా గెలిచారు. ఇప్పుడు ఈ దంపతులిద్దరూ కాంగ్రెస్లో చేరడంతో హైటెక్ సిటీ కాంగ్రెస్ ఖాతాలో పడుతుందని ఆ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ జంట పార్టీ మారడంతో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
తొలుత జగదీశ్వర్ గౌడ్ ఇక్కడ నుంచి కాంగ్రెస్ కార్పొరేటర్గా గెలుపొందారు. ఆ తర్వాత బీఆర్ఎస్కు మారిన ఆయన మళ్లీ బీఆర్ఎస్ నుంచి రెండుసార్లు గెలిచారు. జగదీశ్వర్ గౌడ్ భార్య పూజిత హఫీజ్ పేట డివిజన్ నుంచి రెండుసార్లు గెలుపొందారు. ఆమె గెలుపులో జగదీశ్వర్ గౌడ్ కూడా కీలక పాత్ర పోషించారు. మెజారిటీ చూసి జగదీశ్వర్ గౌడ్, ఆయన భార్య పూజిత ఆశ్చర్యానికి గురయ్యారు. గత ఎన్నికల్లో 10 డివిజన్లలో 8 డివిజన్లలో మెజారిటీ కార్పొరేటర్ల కంటే వారి మెజారిటీ ఎక్కువ. ఇప్పుడు జగదీశ్వర్ గౌడ్ బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే గాంధీ పార్టీకి నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నారు. హఫీజ్ పేట, మాదాపూర్ డివిజన్లలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గాంధీ తన అనుచరులతో సమావేశాలు నిర్వహించారు.
Rahul Gandhi: బొగ్గు కుంభకోణం చేసిన అదానీ.. అందుకే కరెంట్ రేటు పెరిగింది
Also Read
తాజావార్తలు
-
Rajesh Sharma : ఫౌజీ షూటింగ్లో రాజేష్ శర్మకు విషపురుగు కాటు?.. అసలు నిజం బయటపెట్టిన పీఏ!
-
Viral Video: ‘గ్రౌండ్లో పరుగెత్తలేను.. నేను ముసలివాడిని అయిపోయాను’: ఎంఎస్ ధోనీ
-
Jofra Archer: “ఇది ఐపీఎల్ కాదు”.. టీమిండియా ఘోర పతనంపై జోఫ్రా ఆర్చర్ సంచలన వ్యాఖ్యలు!
-
Fake Condoms: “కండోమ్”లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..
-
Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..