Thatikonda Rajaiah: ఎన్ కౌంటర్ లు చేయించిన చరిత్ర కడియం ది.. రాజయ్య కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thatikonda Rajaiah: ఎన్ కౌంటర్ లు చేయించిన చరిత్ర కడియం శ్రీహరి ది అంటూ మాజీ ఎమ్మెల్యే రాజయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా జాఫర్ ఘడ్ మండలం కునూర్ లో రాజయ్య మాట్లాడుతూ.. కడియం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి కుటుంబం శాస్వత రాజకీయ సమాధి కాబోతుందని అన్నారు. ఆ సమాధికి ప్రజలు రాళ్ళు తయారు చేస్తున్నారని తెలిపారు. కడియం శ్రీహరి రాజకీయ ద్రోహి, దళిత ద్రోహి, నకిలీ దళితుడు అంటూ పేర్కొన్నారు. తన బిడ్డకు టికెట్ కోసం ఊసరవెల్లి లా రంగులు మార్చారన్నారు. అభివృద్ది కోసం కాంగ్రెస్ లోకి వెళ్ళిన అని చెప్పడానికి సిగ్గుండాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, బీఆర్ఎస్ లో పది, పది యేండ్ల మంత్రిగా పనిచేసి ఏం అభివృద్ధి చేశావు? అని ప్రశ్నించారు.
Read also: Karumuri Nageswara Rao: ల్యాండ్ టైటిల్ యాక్ట్పై తప్పుడు ప్రచారం.. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..
Also Read
- Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
- NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
- AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
- Telangana Liquor : తెలంగాణలో లిక్కర్ లవర్స్కు జాక్పాట్.. 121 కొత్త బ్రాండ్లు.!
ఎన్టీఆర్ కు, చంద్ర బాబు కి వెన్నుపోటు పొడిచిన మూర్ఖుడివి అంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ లోకి ఎందుకు వచ్చావో చెప్పాలి? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ లోకి రాగానే నా పదవులకు ఎసరు పెట్టావని మండిపడ్డారు. రెండు సార్లు విద్యాశాఖ మంత్రిగా ఉండి డిగ్రీ కళాశాల తేలేదన్నారు. స్టేషన్ ఘనపూర్ అభివృద్ధి పనులకు ఆడ్డుపుల్ల వేసిన ద్రోహివి అన్నారు. స్టేషన్ ఘనపూర్ కి కడియం చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం, మంత్రి పదవి కోసం, బిడ్డ రాజకీయ భవిష్యత్ కోసం కాంగ్రెస్ లోకి పొయినావన్నారు. జీవీఆర్ కాంట్రాక్టర్ వెంకటేశ్వర రెడ్డి వద్ద 6 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకున్నావని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ ఘనపూర్ నియోజవర్గానికి కడియం మార్క్ ఒక్కటి చూపించండి? అని ప్రశ్నించారు. బినామీ అడ్రస్ లతో ఆస్తులు సంపాదించింది కడియం అన్నారు. నువ్వు ఎక్కడ పుట్టవో నీ తల్లినీ అడుగు చెప్పుతుంది..దానికి సాక్ష్యం మంత్రి దయాకర్ రావే అన్నారు. కడియం కు మిండడు అంటే రాజయ్యే అని అందరూ అంటారని తెలిపారు. కడియం కులం పై సిట్టింగ్ జడ్జితో రేవంత్ విచారణ జరిపించాలన్నారు.
Read also: Bandi Sanjay: పొన్నం వ్యవహారంతో కాంగ్రెస్ నేతలే బెంబేలెత్తుతున్నారు
మాదిగల వ్యతిరేకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు. డబ్బులకు అమ్ముడుపోయేవారు మాత్రమే కడియం వెంట ఉంటారు. ఎన్కౌంటర్ లు చేయించిన చరిత్ర కడియంది అన్నారు. నేతి బీరకల్లో ఎంత నేతి ఉంటాదో..కడియం నీతిలో అంతే నితి ఉంటదన్నారు. కడియం కావ్యను అడుగుతున్న.. నీ తండ్రి, పెద్ద తండ్రిల డీఎన్ఏ లు పరీక్ష చేయించు అని అన్నారు. మతం ఒక మోసం, కులం మరో మోసమన్నారు. అబద్దాల పుట్ట మీద కడియం జీవిస్తున్నారని తెలిపారు. నైతిక విలువ ఉంటే , దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మేల్యే పదవికి రాజీనామా చేసి రా చూసుకుందాం అని సవాల్ విసిరారు. ఎన్నికలప్పుడు వచ్చిన సవాల్..రాజీనామా చేసి మాత్రమే ఏ ఊరికి ఐనా రావాలన్నారు. లేకపోతే మాదిగలు తిరగబడతారన్నారు. 94 లో డొక్కు స్కూటర్, తెగిన చెప్పులతో వచ్చిండు.. ఎమ్మెల్యే కాక ముందు నీ అస్తూలెంత, ఇప్పుడు నీ అస్తులెంతో చెప్పాలన్నారు. విదేశాల్లో బిడ్డా,అల్లుడు హవాల ద్వారా ఆస్తులు కొనడం నిజం కాదా? అని ప్రశ్నించారు.
T20 World Cup 2024: జట్టును ప్రకటించిన దక్షిణాఫ్రికా.. సెంట్రల్ కాంట్రాక్ట్ లేని ఆటగాళ్లకు చోటు!
తాజావార్తలు
-
Maharashtra Hill Tragedy: తల్లిదండ్రులను కలపాలని కునాల్ చనిపోయాడా? సంభాజీనగర్ ఎపిసోడ్లో న్యూ ట్విస్ట్!
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
Supreme Court: X, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?