Thatikonda Rajaiah: ఎన్ కౌంటర్ లు చేయించిన చరిత్ర కడియం ది.. రాజయ్య కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thatikonda Rajaiah: ఎన్ కౌంటర్ లు చేయించిన చరిత్ర కడియం శ్రీహరి ది అంటూ మాజీ ఎమ్మెల్యే రాజయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా జాఫర్ ఘడ్ మండలం కునూర్ లో రాజయ్య మాట్లాడుతూ.. కడియం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి కుటుంబం శాస్వత రాజకీయ సమాధి కాబోతుందని అన్నారు. ఆ సమాధికి ప్రజలు రాళ్ళు తయారు చేస్తున్నారని తెలిపారు. కడియం శ్రీహరి రాజకీయ ద్రోహి, దళిత ద్రోహి, నకిలీ దళితుడు అంటూ పేర్కొన్నారు. తన బిడ్డకు టికెట్ కోసం ఊసరవెల్లి లా రంగులు మార్చారన్నారు. అభివృద్ది కోసం కాంగ్రెస్ లోకి వెళ్ళిన అని చెప్పడానికి సిగ్గుండాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, బీఆర్ఎస్ లో పది, పది యేండ్ల మంత్రిగా పనిచేసి ఏం అభివృద్ధి చేశావు? అని ప్రశ్నించారు.
Read also: Karumuri Nageswara Rao: ల్యాండ్ టైటిల్ యాక్ట్పై తప్పుడు ప్రచారం.. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..
Also Read
- Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
ఎన్టీఆర్ కు, చంద్ర బాబు కి వెన్నుపోటు పొడిచిన మూర్ఖుడివి అంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ లోకి ఎందుకు వచ్చావో చెప్పాలి? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ లోకి రాగానే నా పదవులకు ఎసరు పెట్టావని మండిపడ్డారు. రెండు సార్లు విద్యాశాఖ మంత్రిగా ఉండి డిగ్రీ కళాశాల తేలేదన్నారు. స్టేషన్ ఘనపూర్ అభివృద్ధి పనులకు ఆడ్డుపుల్ల వేసిన ద్రోహివి అన్నారు. స్టేషన్ ఘనపూర్ కి కడియం చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం, మంత్రి పదవి కోసం, బిడ్డ రాజకీయ భవిష్యత్ కోసం కాంగ్రెస్ లోకి పొయినావన్నారు. జీవీఆర్ కాంట్రాక్టర్ వెంకటేశ్వర రెడ్డి వద్ద 6 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకున్నావని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ ఘనపూర్ నియోజవర్గానికి కడియం మార్క్ ఒక్కటి చూపించండి? అని ప్రశ్నించారు. బినామీ అడ్రస్ లతో ఆస్తులు సంపాదించింది కడియం అన్నారు. నువ్వు ఎక్కడ పుట్టవో నీ తల్లినీ అడుగు చెప్పుతుంది..దానికి సాక్ష్యం మంత్రి దయాకర్ రావే అన్నారు. కడియం కు మిండడు అంటే రాజయ్యే అని అందరూ అంటారని తెలిపారు. కడియం కులం పై సిట్టింగ్ జడ్జితో రేవంత్ విచారణ జరిపించాలన్నారు.
Read also: Bandi Sanjay: పొన్నం వ్యవహారంతో కాంగ్రెస్ నేతలే బెంబేలెత్తుతున్నారు
మాదిగల వ్యతిరేకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు. డబ్బులకు అమ్ముడుపోయేవారు మాత్రమే కడియం వెంట ఉంటారు. ఎన్కౌంటర్ లు చేయించిన చరిత్ర కడియంది అన్నారు. నేతి బీరకల్లో ఎంత నేతి ఉంటాదో..కడియం నీతిలో అంతే నితి ఉంటదన్నారు. కడియం కావ్యను అడుగుతున్న.. నీ తండ్రి, పెద్ద తండ్రిల డీఎన్ఏ లు పరీక్ష చేయించు అని అన్నారు. మతం ఒక మోసం, కులం మరో మోసమన్నారు. అబద్దాల పుట్ట మీద కడియం జీవిస్తున్నారని తెలిపారు. నైతిక విలువ ఉంటే , దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మేల్యే పదవికి రాజీనామా చేసి రా చూసుకుందాం అని సవాల్ విసిరారు. ఎన్నికలప్పుడు వచ్చిన సవాల్..రాజీనామా చేసి మాత్రమే ఏ ఊరికి ఐనా రావాలన్నారు. లేకపోతే మాదిగలు తిరగబడతారన్నారు. 94 లో డొక్కు స్కూటర్, తెగిన చెప్పులతో వచ్చిండు.. ఎమ్మెల్యే కాక ముందు నీ అస్తూలెంత, ఇప్పుడు నీ అస్తులెంతో చెప్పాలన్నారు. విదేశాల్లో బిడ్డా,అల్లుడు హవాల ద్వారా ఆస్తులు కొనడం నిజం కాదా? అని ప్రశ్నించారు.
T20 World Cup 2024: జట్టును ప్రకటించిన దక్షిణాఫ్రికా.. సెంట్రల్ కాంట్రాక్ట్ లేని ఆటగాళ్లకు చోటు!
తాజావార్తలు
-
Fauzi Release Date : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
-
Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…
-
Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
-
Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!