Thatikonda Rajaiah: ఎన్ కౌంటర్ లు చేయించిన చరిత్ర కడియం ది.. రాజయ్య కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thatikonda Rajaiah: ఎన్ కౌంటర్ లు చేయించిన చరిత్ర కడియం శ్రీహరి ది అంటూ మాజీ ఎమ్మెల్యే రాజయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా జాఫర్ ఘడ్ మండలం కునూర్ లో రాజయ్య మాట్లాడుతూ.. కడియం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి కుటుంబం శాస్వత రాజకీయ సమాధి కాబోతుందని అన్నారు. ఆ సమాధికి ప్రజలు రాళ్ళు తయారు చేస్తున్నారని తెలిపారు. కడియం శ్రీహరి రాజకీయ ద్రోహి, దళిత ద్రోహి, నకిలీ దళితుడు అంటూ పేర్కొన్నారు. తన బిడ్డకు టికెట్ కోసం ఊసరవెల్లి లా రంగులు మార్చారన్నారు. అభివృద్ది కోసం కాంగ్రెస్ లోకి వెళ్ళిన అని చెప్పడానికి సిగ్గుండాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, బీఆర్ఎస్ లో పది, పది యేండ్ల మంత్రిగా పనిచేసి ఏం అభివృద్ధి చేశావు? అని ప్రశ్నించారు.
Read also: Karumuri Nageswara Rao: ల్యాండ్ టైటిల్ యాక్ట్పై తప్పుడు ప్రచారం.. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..
Also Read
ఎన్టీఆర్ కు, చంద్ర బాబు కి వెన్నుపోటు పొడిచిన మూర్ఖుడివి అంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ లోకి ఎందుకు వచ్చావో చెప్పాలి? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ లోకి రాగానే నా పదవులకు ఎసరు పెట్టావని మండిపడ్డారు. రెండు సార్లు విద్యాశాఖ మంత్రిగా ఉండి డిగ్రీ కళాశాల తేలేదన్నారు. స్టేషన్ ఘనపూర్ అభివృద్ధి పనులకు ఆడ్డుపుల్ల వేసిన ద్రోహివి అన్నారు. స్టేషన్ ఘనపూర్ కి కడియం చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం, మంత్రి పదవి కోసం, బిడ్డ రాజకీయ భవిష్యత్ కోసం కాంగ్రెస్ లోకి పొయినావన్నారు. జీవీఆర్ కాంట్రాక్టర్ వెంకటేశ్వర రెడ్డి వద్ద 6 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకున్నావని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ ఘనపూర్ నియోజవర్గానికి కడియం మార్క్ ఒక్కటి చూపించండి? అని ప్రశ్నించారు. బినామీ అడ్రస్ లతో ఆస్తులు సంపాదించింది కడియం అన్నారు. నువ్వు ఎక్కడ పుట్టవో నీ తల్లినీ అడుగు చెప్పుతుంది..దానికి సాక్ష్యం మంత్రి దయాకర్ రావే అన్నారు. కడియం కు మిండడు అంటే రాజయ్యే అని అందరూ అంటారని తెలిపారు. కడియం కులం పై సిట్టింగ్ జడ్జితో రేవంత్ విచారణ జరిపించాలన్నారు.
Read also: Bandi Sanjay: పొన్నం వ్యవహారంతో కాంగ్రెస్ నేతలే బెంబేలెత్తుతున్నారు
మాదిగల వ్యతిరేకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు. డబ్బులకు అమ్ముడుపోయేవారు మాత్రమే కడియం వెంట ఉంటారు. ఎన్కౌంటర్ లు చేయించిన చరిత్ర కడియంది అన్నారు. నేతి బీరకల్లో ఎంత నేతి ఉంటాదో..కడియం నీతిలో అంతే నితి ఉంటదన్నారు. కడియం కావ్యను అడుగుతున్న.. నీ తండ్రి, పెద్ద తండ్రిల డీఎన్ఏ లు పరీక్ష చేయించు అని అన్నారు. మతం ఒక మోసం, కులం మరో మోసమన్నారు. అబద్దాల పుట్ట మీద కడియం జీవిస్తున్నారని తెలిపారు. నైతిక విలువ ఉంటే , దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మేల్యే పదవికి రాజీనామా చేసి రా చూసుకుందాం అని సవాల్ విసిరారు. ఎన్నికలప్పుడు వచ్చిన సవాల్..రాజీనామా చేసి మాత్రమే ఏ ఊరికి ఐనా రావాలన్నారు. లేకపోతే మాదిగలు తిరగబడతారన్నారు. 94 లో డొక్కు స్కూటర్, తెగిన చెప్పులతో వచ్చిండు.. ఎమ్మెల్యే కాక ముందు నీ అస్తూలెంత, ఇప్పుడు నీ అస్తులెంతో చెప్పాలన్నారు. విదేశాల్లో బిడ్డా,అల్లుడు హవాల ద్వారా ఆస్తులు కొనడం నిజం కాదా? అని ప్రశ్నించారు.
T20 World Cup 2024: జట్టును ప్రకటించిన దక్షిణాఫ్రికా.. సెంట్రల్ కాంట్రాక్ట్ లేని ఆటగాళ్లకు చోటు!
తాజావార్తలు
-
TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మిశ్రమ ఫలితాలు!
-
Ranabaali : ‘రణబాలి’ వివాదంపై మైత్రి రవిశంకర్ స్పందన.. విజయ్పై కీలక వ్యాఖ్యలు
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
8849 Tank 5: ప్రొజెక్టర్తో 8849 ట్యాంక్ 5 స్మార్ట్ఫోన్ విడుదల.. 17,600mAh భారీ బ్యాటరీ, 3K డిస్ప్లే
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!