Seetakka: మా ప్రభుత్వ ఏర్పాటుకు నాంది పలికిందే ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా సభ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Seetakka: కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు నాంది పలికిందే ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా సభ అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా- శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ నివాసంలో విలేఖరుల సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు నాంది పలికింది ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా సభ అన్నారు. సీఎం హోదాలో మొదటి సభ కూడా ఇక్కడే నిర్వహించనున్నారని తెలిపారు. గత ప్రభుత్వం నిరుద్యోగులకు నోటిఫికేషన్ పేర్లతో మోసం చేస్తే,, తాము ఉద్యోగాల కల్పన చేశామన్నారు. ఇంద్రవెల్లి అమర వీరుల స్తూపం వద్ద స్మృతి వనం ఏర్పాటుకు భూమి పూజ చేస్తామన్నారు. ఇంద్రవెల్లి పోరాటంలో అసువులు బాసిన అమరుల కుటుంబాలను అన్ని రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో రక్త హీనత సమస్య ఎక్కువగా ఉందని, అంగన్ వాడి కేంద్రాలు లేవన్నారు.
కడెం ప్రాజెక్టు ను గత ప్రభుత్వం మరిచిపోయిందని అన్నారు. కడెంకు నిధులు కేటాయించి పునరుద్దరణ పనులు చేపడుతామన్నారు. జీతాలు ఇవ్వడానికి కనీసం బడ్జెట్ లేని పరిస్థితి అని తెలిపారు. ఆదివాసి గుడాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పన చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పభుత్వం కేవలం వాళ్ళు ఉండడానికి ఖరీదైన బంగళాలు నిర్మించుకున్నారు కానీ.. పేదలకు ఒక్క ఇండ్లు కట్టియ్యలేదన్నారు. ఉద్యమకారులు నోరు నొక్కిందని అన్నారు. మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెడితే కొందరు నాయకులు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన కోదండ రాంకు ఎమ్మెల్సీ ఇస్తే ఓర్వలేక కేసు వేశారని అన్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోసం ప్రజల సెంటిమెంట్ వాడుకుందన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును వదిలి బీఆర్ఎస్ అవినీతి కోసం కాళేశ్వరం చేపట్టిందని మండిపడ్డారు.
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్ మాట్లాడుతూ.. ఆగస్ట్ 9, 2021 లో ఇంద్రవెల్లి లో నిర్వహించిన దళిత గిరిజన దండోరా సభ విజయమే ప్రభుత్వ ఏర్పాటుకు పునాది పడిందన్నారు. ఇంద్రవెల్లి సభలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇద్దరు కలిసి ఇక్కడి నుంచి దండోరా సభ, పాదయాత్రను కొనసాగించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని బీఆర్ఎస్ నేతలంటున్నారని, మా సక్సెస్ కేవలం మేము ప్రవేశపెట్టిన ఫ్రీ బస్ స్కీమ్ చూస్తే తెలుస్తుందని అన్నారు. బీఆర్ఎస్ మాటలు మోసపూరిత మైనవని అన్నారు.
Ranji Trophy: రంజీ ట్రోఫీలో అదరగొడుతున్న 12th ఫెయిల్ డైరక్టర్ కొడుకు.. తొలి క్రికెటర్గా అరుదైన రికార్డు!
తాజావార్తలు
-
Ben Stokes Returns: ‘క్రికెట్పై మళ్లీ ఆసక్తి వచ్చింది’.. రీఎంట్రీకి సిద్ధమైన స్టార్ ఆల్రౌండర్
-
Story Board : పంజా విసురుతున్న ఎల్నినో.. ముంచుకొస్తున్న ఆహార సంక్షోభం..
-
USA: “నువ్వు ముస్లింవా?” అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
-
India U-19 vs Sri Lanka U-19: చరిత్ర సృష్టించిన భారత యువ ఓపెనర్లు.. రికార్డుల మోత
-
Tragedy: దమ్ముంటే హైదరాబాద్కు రమ్మన్నాడు.. నిజంగానే వచ్చి చంపేశారు.. ఏం జరిగిందంటే..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!