SCR: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఇకపై కృష్ణా ఎక్స్ ప్రెస్ తో పాటు నాలుగు రైళ్లు చర్లపల్లి నుంచి..
- ప్రయాణికులకు బిగ్ అలర్ట్
- కృష్ణా ఎక్స్ ప్రెస్ తో పాటు నాలుగు రైళ్లు చర్లపల్లి నుంచి రాకపోకలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉంటుంది. రైలు ప్రయాణికుల రద్దీ పెరగడంతో రైల్వే అధికారులు చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి రైళ్లు రాకపోకలు సాగించేలా చర్లపల్లి టెర్మినల్ ను డెవలప్ చేశారు. పలు రైళ్లను దక్షిణమద్య రైల్వే చర్లపల్లి నుంచే నడుపుతుంది. తాజాగా ఎస్ సీఆర్ రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఇకపై కృష్ణా ఎక్స్ ప్రెస్ తో పాటు 4 రైళ్ల రాకపోకలను చర్లపల్లికి మారుస్తున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్ స్టేషన్ లో అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే బోర్డు తెలిపింది.
Also Read:Ranya Rao: గోల్డ్ స్మగ్లింగ్లో రన్యారావు భర్త పాత్ర.. డీఆర్ఐ నెక్ట్స్ ప్లాన్ ఇదే!
Also Read
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
- Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
తిరుపతి-ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్ ప్రెస్(17405) చర్లపల్లి టెర్మినల్ నుంచి రాత్రి 8.10కి బయలుదేరుతుంది. బొల్లారం స్టేషన్ లో రాత్రి 9.14కి చేరుకుంటుంది. ఆదిలాబాద్ నుంచి తిరుగు ప్రయాణంలో ఈ రైలు(17406) బొల్లారం స్టేషన్ కు ఉదయం 4.29కి, చర్లపల్లికి 5.45కి చేరుకుంటుంది. మార్చి 26 నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. అలాగే కాకినాడ- లింగంపల్లి ప్రత్యేక ట్రైన్ ఉదయం చర్లపల్లి నుంచి 7.20కి బయలుదేరుతుంది.
Also Read:Pradeep : ఆ యంగ్ హీరో నెక్ట్స్ టార్గెట్ రూ. 200 కోట్లు
ఈ మార్పులు ఏప్రిల్ 2నుంచి జులై 1వరకు అమల్లో ఉంటుంది. మరో ట్రైన్ కాజీపేట-హదప్పర్ ఎక్స్ ప్రెస్ చర్లపల్లికి రాత్రి 8.30కి వస్తుంది. ఈ నిర్ణయం ఏప్రిల్ 22 నుంచి అమల్లోకి వస్తుంది. లింగంపల్లి-విశాఖపట్నం జన్మభూమి ఎక్స్ ప్రెస్ ఉదయం 7.15కి చర్లపల్లికి వస్తుంది. ఈ మార్పు ఏప్రిల్ 25 నుంచి అమల్లోకి రానుంది. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తమ జర్నీని ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!