TS Schools: నేడు రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ బంద్..! ABVP పిలుపు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Schools: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు పాఠశాలల బంద్కు అఖిల భారత విద్యార్థి సంఘం పిలుపునిచ్చింది. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తూ ప్రయివేటు, కార్పొరేట్ శక్తులను ప్రోత్సహిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఏబీవీపీ పాఠశాలల బంద్కు పిలుపునిచ్చింది. ఏబీవీపీ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ ‘మన ఊరు మన బడి’ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని, ఆచరణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇప్పటికీ పాఠశాలలకు పుస్తకాలు, యూనిఫారాలు అందలేదని, నిర్వహణ నిధులు కూడా ఇవ్వలేదన్నారు.
ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు, డొనేషన్లు, పుస్తకాలు, యూనిఫాంల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ బంద్కు పిలుపునిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేసి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. శనివారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఏబీవీపీ నాయకులు నిరసన తెలిసిందే.. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు లొంగిపోయి ఎన్నికల నిధులకు అమ్ముడుపోయిందన్నారు.
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
Read also: Blast in Kuppam: కుప్పంలో భారీ పేలుడు
ప్రభుత్వ విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం సోమవారం పాఠశాలల బంద్కు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 15 వేల ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఫీజుల పేరుతో కార్పొరేట్ విద్యాసంస్థలు నిలువు దోపిడీ చేస్తున్నాయని.. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక ఫీజులు వసూలు చేయడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు పుస్తకాలు విక్రయిస్తున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం వెంటనే అందించాలి. విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించి ఖాళీగా ఉన్న డీఎస్సీ, ఎంఈవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు గుర్తింపు లేకుండా నడుస్తున్నాయి. పాఠశాలలు తెరిచి 20 రోజులు కావస్తున్నా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయలేదని, చాలా పాఠశాలల్లో కనీస వసతులు లేవన్నారు. ప్రయివేటు పాఠశాలల్లో సరైన ఫీజు విధానం అమలు చేసేందుకు ఫీజు నియంత్రణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. సోమవారం జరిగే రాష్ట్ర వ్యాప్త పాఠశాలల సమ్మెకు విద్యార్థులు, తల్లిదండ్రులు మద్దతు ఇవ్వాలని కోరారు.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!