Telangana:ఫోన్ నంబర్తోనే పక్కా స్కెచ్.. సరూర్నగర్ పరువు హత్య కేసులో కీలక విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంచలనం రేపిన సరూర్నగర్ పరువు హత్య కేసులో ఇద్దరు నిందితుల ఐదు రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. పోలీసులు భావించినట్లుగానే నిందితులను కస్టడీకి తీసుకోవడంతో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన చెల్లెలు అశ్రిన్ మతాంతర వివాహం చేసుకుందన్న పగతో మరో బంధువుతో కలసి.. చెల్లెలు భర్త నాగరాజును నడి రోడ్డుపై అన్న దారుణంగా చంపేసిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనలో ఇద్దరు నిందితులైన సయ్యద్ మొబిన్, మసూద్ అహ్మద్ పథకం ప్రకారమే నాగరాజును హత్య చేశారని పోలీసులు తేల్చారు. నాగరాజు ఎక్కడున్నాడో జీమెయిల్ అకౌంట్ను హ్యాక్ చేసి గుర్తించినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఇద్దరు నిందితుల కాల్ డేటా రికార్డింగ్స్ సేకరించారు. హత్య ఘటన జరిగిన రోజు కుటుంబ సభ్యులతో తప్ప నిందితులు ఎవ్వరితో మాట్లాడలేదని పోలీసులు.
Also Read
- Pawan Kalyan: రేపు హైదరాబాద్కు పవన్ కల్యాణ్.. ఫిజియోథెరపీ తప్పనిసరి
- Shiv Charan Reddy: 'నన్ను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు'.. మనసులు నొప్పించి ఉంటే క్షమించండి: శివచరణ్ రెడ్డి
- Shabad Six-Murder Case: షాబాద్ ఆరుగురి హత్య కేసు.. రాజ్కుమార్పై భార్య కుటుంబం సంచలన ఆరోపణలు!
- Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
మసూద్ తన ఈమెయిల్ లాగిన్కు ఐడీ, పాస్వర్డ్కు తన మొబైల్ నంబర్నే పెట్టుకున్నాడని.. అదే ట్రిక్ను నాగరాజు మెయిల్ను హ్యాక్ చేసేందుకు మసూద్ ప్రయోగించాడని పోలీసులు తెలిపారు. అది వర్కౌట్ కావడంతో జీమెయిల్ ద్వారా ఫైండ్ మై డివైస్లోకి వెళ్లి నాగరాజు లొకేషన్ను నిందితులిద్దరూ కనుక్కున్నట్లు వెల్లడించారు. కొన్ని ముస్లిం సంస్థలతో నిందితులకు సంబంధం ఉన్నట్లు వస్తున్న ఆరోపణలపై పోలీసులు వివరణ ఇచ్చారు.
ఇద్దరు నిందితులకు ఎటువంటి సంస్థతో సంబంధాలు లేవని స్పష్టం చేశారు. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఇద్దరే హత్యకు కుట్ర పన్నారని వెల్లడించారు. సరూర్నగర్లో సీన్ రీ కన్స్ట్రక్షన్ పూర్తి చేశామన్నారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరు పరిచారు పోలీసులు..
కాగా.. బుధవారం (May 4 2022) నాడు రాత్రి సరూర్ నగర్ మున్సిపల్ కార్యాలయానికి సమీపంలోనే Bike పై వెళ్తున్న నాగరాజును అత్యంత దారుణంగా హత్య చేశారు నిందితులు. నాగరాజు తలకు హెల్మెట్ పెట్టుకొన్నప్పటికీ ఇనుప రాడ్లతో విచక్షణ రహితంగా దాడి చేయడంతో నాగరాజు అక్కడికక్కడే మరణించాడు. ఈ సమయంలో ఆశ్రిన్ నాగరాజుపై దాడి చేయకుండా అడ్డుకొనే ప్రయత్నం చేసింది. నాగరాజున చంపిన వారిలో ఆశ్రిన్ సోదరుడితో పాటు బావను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
మరోవైపు నాగరాజును హత్య చేసిన నిందితులను తమకు చూపించాలని మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు గురువారం నాడు ఉదయం ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని నాగరాజు స్వగ్రామానికి తీసుకెళ్లకుండా పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన నిర్వహించారు. డెడ్ బాడీని స్వగ్రామానికి తరలించేందుకు పోలీసులు ఇచ్చిన డబ్బును కూడా నాగరాజు కుటుంబ సభ్యులు తిరస్కరించారు.
తాజావార్తలు
-
Venkatesh Maha: రంగస్థలం నేను రాసిన కథ: డైరెక్టర్ వెంకటేష్ మహా
-
Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
-
Pawan Kalyan: రేపు హైదరాబాద్కు పవన్ కల్యాణ్.. ఫిజియోథెరపీ తప్పనిసరి
-
Netanyahu-Iran: ఇరాన్కు నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్.. ఈసారి దాడి చేస్తే మాత్రం..!
-
IND vs ENG 1st ODI: అక్షర్ పటేల్ మ్యాజిక్.. 258 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!