Sangareddy: బావి నీరు తాగడంతో గ్రామస్తులకు వాంతులు, విరేచనాలు
- సంగారెడ్డి జిల్లాలో సంజీవన్రావు పేటలో విషాదం..
- కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి..
Sangareddy: సంగారెడ్డి జిల్లాలో సంజీవన్రావు పేటలో విషాదం నెలకొంది. కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ నీటిని తాగిన మరో 30 మందికి పైగా అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. మూడు రోజులుగా మిషన్ భగీరథ నీరు నిలిచిపోవడంతో గ్రామస్తులంతా స్థానిక సంజీవరావుపేటలోని బావి నీటిని తాగుతున్నారు. నీరు కలుషితం కావడంతో ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా, సుమారు 30 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అలాగే బావిలోని నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపినట్లు చెప్పారు. మృతులు మహేష్, సాయమ్మగా గుర్తించారు. అధికారులకు ఈ విషయం తెలియడంతో వెంటనే గ్రామంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మిషన్ భగీరథ నీరు ఎందుకు నిలిపి వేశారనేదానిపై ఆరా తీస్తున్నారు. బావి నీరు కలుషితంగా వున్నా గతిలేక తాగాల్సి వచ్చిందని గ్రామస్తులు వాపోతున్నారు. ఇక నిన్న పండుగ రోజు కావడంతో నీరు లేక బావి నీటినే తాగాల్సి వచ్చిందని అంటున్నారు బాధితులు. అయితే దీనిపై రంగంలోకి దిగిన అధికారులు, పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Also Read
- Sangareddy: హోంవర్క్ చేయలేదని విద్యార్థులపై దాడి.. కేబుల్ వైర్లతో కొట్టిన వైనం..!
- Jaggareddy: సంగారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తత.. సీఐ తీరుపై జగ్గారెడ్డి ఫైర్.. రంగంలోకి ఎన్నికల సంఘం!
- JaggaReddy: 60 సీట్లు ఉన్న బస్సులో 100 మంది మహిళలు ఎక్కితే గొడవలు కావా..?
- Telangana: ప్రాణాలు విడిచిన వారిని వరించిన విజయం..
HMDA Website: హైడ్రా బారిన పడకూడదంటే.. HMDA కొత్త వెబ్సైట్లో ఇలా చెక్ చేస్కోండి
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బాల్ ఎలా వేసిన రిస్క్ బౌలర్లకే.. కొట్టిపడేస్తా.. బుడ్డోడు మరో సెంచరీ
-
Scientists disappear: సైంటిస్టులు మాయం.. అమెరికా, చైనాలో టెన్షన్..
-
SSC Stenographer: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 731 స్టెనోగ్రాఫర్ పోస్టులకు రిజిస్ట్రేషన్ ప్రారంభం
-
PM Modi : మే 9న తెలంగాణకు ప్రధాని మోడీ.. పరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ.!
-
Hyderabad Metro : మెట్రోపై ప్రభుత్వ హక్కు.. L&Tకి గుడ్బై!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!