Sabitha Indra Reddy: మంత్రి బొత్సవి అవగాహన లేని వ్యాఖ్యలు.. ఆ స్థాయి మీకు లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sabitha Indra Reddy Gives Counter To AP Minister Botsa Satyanarayana: తెలంగాణ విద్యావ్యవస్థపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బొత్సవి అవగాహన లేని వ్యాఖ్యలని ఎద్దేవా చేశారు. బొత్స వ్యాఖ్యలు తెలంగాణను కించపరిచేలా ఉన్నాయని.. వాటిని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యా వ్యవస్థను వేలెత్తి చూపెంత స్థాయి మీకు లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాల విద్యా వ్యవస్థపై చర్చించేందుకు మీరు సిద్దమా? అని సవాల్ విసిరారు. విద్యావ్యవస్థలో తాము చేసిందేమిటో, మీరు ఉద్ధరించిందేమి తేల్చుకునేందుకు చర్చిద్దామా? అని ఛాలెంజ్ చేశారు. తెలంగాణలో గత తొమ్మిదేళ్ల నుంచి ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని దుస్థితిలో ఏపీ నాయకులు ఉన్నారని దుయ్యబట్టారు.
Minister KTR: సాగునీటి ప్రాజెక్టుల విషయంలో.. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కేటీఆర్ బహిరంగ లేఖ
Also Read
- IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. పెద్దల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్ఆర్హెచ్?
- Mohammed Kala Basha: ‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్తో చరిత్ర సృష్టించిన బాషా గురించి ఆసక్తికర విషయాలు..
- Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
2015, 2018లో తెలంగాణలో టీచర్స్ బదిలీలు జరిగాయని.. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని బొత్సకు మంత్రి సబితా సూచించారు. ముందు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని, తప్పుగా మాట్లాడొద్దని హితవు పలికారు. రెండు రాష్ట్రాల్లోని ప్రజలు బాగుండాలని తాము కోరుకుంటున్నామని అన్నారు. సీఎం కేసీఆర్ విజన్తో తెలంగాణ విద్యావ్యవస్థ ఎంతో అభివృద్ది చెందిందన్నారు. ఐఐటీ, మెడికల్, ఇంజరింగ్లో విద్యార్థులు సాధించిన ఫలితాలు మీకు కనబడటం లేదా? అని బొత్సని నిలదీశారు. గురుకులాలతో ఒక్కో విద్యార్థిపై రూ.1 లక్ష 20 వేలు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని వివరించారు. మీ రాష్ట్రంలో ఎంత ఖర్చు చేస్తున్నారో చెప్పాలని అడిగారు. ఆంధ్ర రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో లక్ష మంది విద్యార్థులు ఎందుకు తగ్గారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో మాత్రం రెండున్నర లక్షల మంది విద్యార్థులు పెరిగారని తెలిపారు. టీఎస్పీఎస్సీలో అవకతవకలు జరిగితే.. సిట్తో పారదర్శకంగా విచారణ జరుపుతున్నామని మంత్రి సబితా చెప్పుకొచ్చారు.
Durgam Cheruvu Bridge: కేబుల్ బ్రిడ్జి పై నుంచి దూకి యువతి ఆత్మహత్య.. కారణం ఇదే!
కాగా.. ఏపీ విద్యా విధానాన్ని తెలంగాణతో పోల్చి చూడడం సరికాదని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. టీఎస్పీఎస్సీలో చూచిరాతలు, స్కాంలు వెలుగు చూస్తున్నాయని పేర్కొన్నారు. కొంతమంది మాట్లాడితే తెలంగాణ పేరు ఎత్తుతున్నారని.. ఆ రాష్ట్రంలో పరిస్థితి ఏంటో రోజు పేపర్లో చూస్తూనే ఉన్నామని చెప్పారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలనే సక్రమంగా నిర్వహించలేని దుస్థితి తెలంగాణలో ఉందని.. ఎంతోమంది అరెస్ట్ అవుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కనీసం వారి టీచర్లను బదిలీలు చేసుకోలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే మంత్రి సబితా పై విధంగా చురకలంటించారు.
తాజావార్తలు
-
Petrol Diesel Price Hike: పెట్రోల్-డీజిల్ ధరలపై భారీ హెచ్చరికలు.. మరోసారి పెరుగుతాయా?
-
Mega brothers at Mega158 Launch: ఒకే ఫ్రేమ్లో మెగా బ్రదర్స్ .. చిరు – బాబి మూవీ ఓపెనింగ్లో ‘మెగా’ హ్యాపీనెస్
-
Ajinkya Rahane: “మా విజయ రహస్యం ఇదే”.. కేకేఆర్ డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్ బయటపెట్టిన కెప్టెన్ రహానే
-
Rohit Sharma: ఇదో చెత్త సీజన్, నేను ఇంకా చెత్తగా ఆడాను.. రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Summer Special Cooling Tea Recipe: మీ శరీరాన్ని టీ కూల్ చేస్తుంది.. ఈ మూడు కలిపితే చాలు..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!