Minister KTR: సాగునీటి ప్రాజెక్టుల విషయంలో.. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కేటీఆర్ బహిరంగ లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR Open Letter To Central Govt Over Irrigation Projects: తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్షపూరిత వైఖరి ప్రదర్శిస్తోందంటూ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల రెండవ దశ పర్యావరణ అనుమతులను పక్కన పెట్టిన నేపథ్యంలో.. కేటీఆర్ కేంద్రానికి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ అభివృద్ధికి అడుగడుగున ఆటంకాలు కల్పిస్తోందని మండిపడ్డారు. 9 ఏళ్లుగా తెలంగాణ ప్రగతి ప్రస్థానం పై అంతులేని వివక్ష కనబరుస్తోందని విమర్శించారు. నదీ జలాల వినియోగం నుంచి మొదలుకొని ప్రాజెక్టుల నిర్మాణం దాకా.. అన్నింట్లోనూ అడ్డంకులు సృష్టిస్తోందని కేంద్రంపై విరుచుకుపడ్డారు.
Pawan Kalyan: సీఐ అంజుయాదవ్పై పవన్ సీరియస్.. అక్కడికే వచ్చి తేల్చుకుంటా..!
Also Read
- Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
- Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
- Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
9 సంవత్సరాలు అయినా.. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా డిమాండ్ను తేల్చకుండా, కేంద్రం తాత్సారం చేస్తోందంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ పచ్చబడడం కేంద్రానికి ఇష్టం లేదని దుయ్యబట్టారు. కేంద్ర సహాయ నిరాకరణ, వివక్ష ఉన్నప్పటికీ.. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో దేశానికి ఆదర్శంగా నిలబెట్టామని ఉద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ఎన్ని విధాలుగా అణచివేతకు ప్రయత్నించినా.. తెలంగాణ అభివృద్ధి పట్ల తమ నిబద్ధతను, సంకల్పాన్ని అడ్డుకోలేరని తేల్చి చెప్పారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకొనే శక్తులపై తాము రాజీ లేకుండా పోరాడుతామని ఛాలెంజ్ చేశారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజలు ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు.
Durgam Cheruvu Bridge: కేబుల్ బ్రిడ్జి పై నుంచి దూకి యువతి ఆత్మహత్య.. కారణం ఇదే!
అంతకుముందు.. ఉచిత విద్యుత్పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద కూడా కేటీఆర్ మండిపడ్డారు. రైతును రాజును చేసే మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలా? లేక మూడు గంటల కరెంటు చాలంటున్న మోసకారి రాబందు కావాలా అని ప్రశ్నించారు. నాడు చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నాడని, నేడు మూడు పూటలు కరెంటు దండగ అని చోటా చంద్రబాబు అంటున్నాడని ట్విటర్ మాధ్యమంగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ చిన్నకారు రైతు అంటే చిన్నచూపేనని.. నోట్లు తప్ప రైతుల పాట్లు తెలియని రేవంత్ని నమ్మితే రైతు నోట్లో మట్టికొట్టుడు ఖాయమని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
-
Kangana Ranaut : నర్స్లను గ్లామర్ వృత్తిగా మార్చేశారు… డ్రెస్ కోడ్పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్
-
Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!