Rythu Bima: రైతు బీమా ఇవ్వనందుకు ఎల్ఐసీకి రూ.50 వేల జరిమానా, వడ్డీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rythu Bima: పుట్టిన తేదీ ఆధార్ కార్డులో కరెక్టుగానే ఉన్నప్పటికీ అధికారి తప్పుగా ఎంటర్ చేసినందన రైతు(కు)బీమా ఇవ్వకపోవటం కరెక్ట్ కాదని సంగారెడ్డి జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తప్పుపట్టింది. బీమా సొమ్ము రూ.5 లక్షలను 2 శాతం వడ్డీతో చెల్లించాలని, దీనికితోడు నష్టపరిహారం కింద అదనంగా రూ.50 వేలు ఇవ్వాలని జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ)ను ఆదేశించింది. అధికారులు రైతుల వివరాలను సరిగ్గా నమోదుచేయాలని సూచించింది. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్కి చెందిన మహ్మద్ నజీర్ 1960లో జన్మించాడు.
ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్లో కూడా ఈ సంవత్సరమే (1960) నమోదైంది. అయితే ఆధార్ కార్డులో మాత్రం 1959 జూలై 1 అని రికార్డు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతుబీమా పథకానికి ఆధార్ కార్డులో నమోదైన పుట్టిన తేదీనే పరిగణనలోకి తీసుకుంటున్నారు. అయితే.. దౌలతాబాద్ క్లస్టర్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (ఏఈఓ) వినోద్ కుమార్ మాత్రం మహ్మద్ నజీర్ డేట్ ఆఫ్ బర్త్ని పొరపాటున 1959 ఆగస్టు 14 అని ఎన్రోల్ చేశాడు. ఆ వివరాలనే ఎల్ఐసీకి పంపారు. ఎల్ఐసీ కూడా ఇవేవీ చెక్ చేయకుండా ప్రీమియం తీసుకుంది.
Also Read
- Telangana Record : భారతదేశపు అన్నపూర్ణ - మన తెలంగాణ.. ధాన్య సేకరణలో సరికొత్త రికార్డుల విజేత
- OTR : కవిత కొత్త పార్టీకి టిఆర్ఎస్ టైటిల్ ఉంటుందా ఉండదా.. పార్టీ పేరు మారుతుందా?
- Bhatti Vikramarka : సింగరేణి జోలికొస్తే ఊరుకోం.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను అణచివేస్తాం
- OTR : గ్రేటర్ ఎన్నికలపై BJP టెన్షన్..? కాంగ్రెస్ వ్యూహాలపై కమలం అప్రమత్తం!
read also: Taj Mahal: వహ్.. తాజ్. 144 కట్టడాల్లో టాప్లో నిలిచిన తాజ్మహల్.
పుట్టిన తేదీని 1959 ఆగస్టు 14గా పరిగణనలోకి తీసుకుంటే అతను రైతుబీమా పరిహారానికి అనర్హుడు అవుతున్నాడు. దీంతో మహ్మద్ నజీర్ భార్య మహ్మద్ షాహీన్ బేగం సంగారెడ్డి జిల్లా వినియోగదారుల వివాదాల కమిషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై విచారణ జరిపిన కమిషన్ బాధితురాలికి అనుకూలంగా తీర్పు చెప్పింది. అధికారులు చేసిన తప్పిదానికి లబ్ధిదారులను ఎందుకు బాధ్యులను చేస్తారని ప్రశ్నించింది. ఇలాంటి తప్పిదాలను సాకుగా చూపి ఇన్సూరెన్స్ను తిరస్కరించొద్దని హితవు పలికింది. ఇలా చేస్తే అర్హులకు ప్రయోజనాలు అందవని, ఫలితంగా ప్రభుత్వం నష్టపోతుందని కమిషన్ పేర్కొంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని 2018లో ప్రవేశపెట్టింది. 18 నుంచి 59 సంవత్సరాలు నిండిన రైతులను (భూమి ఉన్నవాళ్లను) దీనికి అర్హులుగా ప్రకటించింది. ప్రతి సంవత్సరం రైతుల తరఫున ప్రభుత్వమే ఎల్ఐసీకీ ప్రీమియం చెల్లిస్తోంది. రైతు ఏ కారణంగా చనిపోయినా 5 లక్షల రూపాయల పరిహారం అందిస్తోంది. రైతు చనిపోయిన వారం పది రోజుల్లోనే బీమా సొమ్మును నామినీ బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తోంది. ఆధార్ కార్డులో నమోదైన పుట్టిన తేదీనే లెక్కలోకి తీసుకుంటోంది. 59 ఏళ్లు నిండినవారికి బీమా చెల్లించట్లేదు.
తాజావార్తలు
-
Telangana Record : భారతదేశపు అన్నపూర్ణ – మన తెలంగాణ.. ధాన్య సేకరణలో సరికొత్త రికార్డుల విజేత
-
OTR : పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఆ ఎమ్మెల్యే పరిస్థితి?
-
IND Vs AFG: రోహిత్ ‘చారిత్రాత్మక’ రికార్డు.. గిల్ ‘మెరుపు’ ఇన్నింగ్స్.. అఫ్గాన్పై భారత్ ఘనవిజయం..
-
Chiranjeevi : కొడుకు నటనపై చిరంజీవి ఎమోషనల్! “‘పుత్రోత్సాహం’ అంటే ఇప్పుడే తెలిసింది..
-
Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్మన్ గిల్ అరుదైన మైలురాయి..
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!