TGSRTC : ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కీలక అంశాలకు గ్రీన్ సిగ్నల్..!
- ఆర్టీసీ విలీనం దిశగా కీలక ముందడుగు
- ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం హామీ
- ఎలక్ట్రిక్ బస్సులు, బదిలీలపై క్లారిటీ
- కారుణ్య నియామకాల్లో పర్మినెంట్ అవకాశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడినట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. మంత్రుల బృందం , ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య జరిగిన తాజా చర్చల్లో పురోగతి సాధించినట్లు సమాచారం. ఈ భేటీలో ఉద్యోగులకు సంబంధించి పలు ముఖ్యమైన అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే 29 డిమాండ్లకు సమ్మతించింది సర్కార్.. అయితే.. ఈ చర్చల్లో ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై కీలక చర్చ జరిగింది. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఒకవేళ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం జరిగితే, గుర్తింపు ఎన్నికలు (Recognition Elections), పీఆర్సీ (PRC) వంటి అంశాలు స్వయంగా పరిష్కారమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో ఉద్యోగులలో కొంత ఆశావాదం వ్యక్తమవుతోంది.
Also Read
- Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
- KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
- KTR: "తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా".. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
Thalaivar 173 : సూపర్ స్టార్ రజనీ వర్సెస్ డైరెక్టర్ శంకర్.. సిల్వర్ స్క్రీన్ షేక్ అయ్యే అప్డేట్!
ఇక ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియను ప్రభుత్వం స్వయంగా చేపడుతుందని, ప్రైవేట్ డ్రైవర్ల నియామకం నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇది నగరంలో పనిచేస్తున్న సిబ్బందికి కొంత ఉపశమనం కలిగించే అంశంగా మారింది.
అదేవిధంగా, కారుణ్య నియామకాలపై కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగుతున్న ఈ నియామకాలను పర్మినెంట్ పద్ధతిలోకి మార్చి, వారికి స్థిరమైన వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సమాచారం. దీంతో బాధిత కుటుంబాలకు దీర్ఘకాలిక భద్రత లభించే అవకాశం ఉంది.
మొత్తం మీద, ఈ చర్చలు ఆర్టీసీ ఉద్యోగుల భవిష్యత్తుపై సానుకూల సంకేతాలను ఇస్తున్నాయి. ఉద్యోగ భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రుల బృందం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఈ నిర్ణయాలు అధికారికంగా అమలులోకి వచ్చే వరకు ఉద్యోగ సంఘాలు అప్రమత్తంగా ఉండాలని భావిస్తున్నాయి. త్వరలోనే ఈ అంశాలపై స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. మూడు రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొన్న విషయం తెలిసిందే. గత మూడు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఈ చర్చలు సఫలమైతే సమ్మె విరమణ దిశగా అడుగులు పడుతాయెమో చూడాలి.
Vadiyalu Recipe : ఎండతో పనేలేదు.. ఒక్కరోజులో ఫ్యాన్ కింద ఆరిపోయే ‘మ్యాజిక్’ వడియాలు.!
తాజావార్తలు
-
Trinamool Congress: మమతా బెనర్జీ సంచలన నిర్ణయం.. ఇలా చేసిందేంటి..
-
Ntv Exclusive: ‘పెద్ది’తో రామ్ చరణ్ విశ్వరూపం.. కంటతడి పెట్టించేశాడట!
-
Stock Market Crash: కుప్పకూలిన షేర్ మార్కెట్.. సెన్సెక్స్ 1100 పాయింట్లు పతనం.. లక్షల కోట్లు గాల్లోనే!
-
LPG dealerships: గ్యాస్ ఏజెన్సీ ఆఫర్.. ఈ తరహా మెసేజీలు వస్తున్నాయా? ప్రభుత్వం ఏం చెబుతుందంటే..?
-
Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!