Warangal: కుళ్లిన మాంసాన్ని మసాలాతో కవర్ చేస్తున్నారు.. తినే ముందు జర జాగ్రత్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warangal: వరంగల్ నగరం లోని స్టార్ హోటల్ లో లొట్టలు వేసుకుంటూ తింటున్నారా.. మీరు తినే తిండి కుళ్లిపోయిందేమో ఒక్క సారి చూసుకోండి. అవును మీరు విన్నది నిజమే. హనుమకొండ నగరంలో పేరు ఉన్న స్టార్ హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన తనిఖీల్లో బయటపడ్డ నిజం ఇది. హనుమకొండ పట్టణంలోని అశోక.. శ్రేయ.. అరణ్య.. హోటల్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. కాగా.. పలు హోటళ్లు, రెస్టారెంట్లను తనిఖీ చేయగా, చూస్తేనే వాంతులొచ్చే పరిస్థితులు కనిపించాయి. కుళ్లిపోయిన మాంసం, ప్రమాదకరమైన రంగులు కలిప, నాన్ వెజ్ పరిశుభ్రత లేని కిచెన్ వారి తనిఖీల్లో బయటపడింది. దీంతో స్టార్ హోటల్ పై చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు.
Read also: Gold Price Today: శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే!
Also Read
హనుమకొండలోని అరణ్య, జంగిల్ థీమ్ రెస్టారెంట్లో తనిఖీలు చేయగా, ఆహార భద్రత ప్రమాణాల ప్రకారం రిఫ్రిజిరేటర్ను సరైన ఉష్ణోగ్రతలో ఉంచలేదని, చికెన్, మటన్లను ఫుడ్ గ్రేడ్ కాని ప్లాస్టిక్ కవర్లలో భద్రపరిచినట్లు గుర్తించారు. ఇది కాకుండా, హానికరమైన రసాయనాలు కలిపిన చీజ్, తుప్పు పట్టిన వంట పాత్రలు మరియు బూజుపట్టిన కూరగాయలు కనిపించాయి. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు అరణ్య జంగిల్ రెస్టారెంట్ యజమానుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాటు రెస్టారెంట్లో నిల్వ ఉంచిన 26 కిలోల చికెన్ వెరైటీలను విసిరేసి, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చట్టం కింద సంబంధిత యజమానికి నోటీసులు కూడా జారీ చేశారు. బస్టాండ్ సమీపంలోని శ్రేయ హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందం తనిఖీలు నిర్వహించింది.
Read also: Hair Cutting: ఇష్టం లేని కటింగ్ చేయించారని తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య
దీంతో చికెన్ కబాబ్ లు, ఇతర రకాలు బూజు పట్టి అపరిశుభ్ర వాతావరణంలో నిల్వ ఉంచినట్లు గుర్తించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న హోటల్ యాజమాన్యానికి ఎఫ్ఎస్ఎస్ఏ చట్టం కింద నోటీసులు జారీ చేశారు. సుమారు 11 కిలోల బూజు పట్టిన చికెన్, ఫిష్ టిక్కా, ఇడ్లీ పిండి, బొద్దింకలు వేసిన బెల్లం పారేశాయి. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం, ఆహారంలో నాణ్యత లోపించడంతో సంబంధిత యాజమాన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ప్లాస్టిక్ కవర్లలో ఉంచిన చికెన్ను స్వాధీనం చేసుకున్నారు. నమూనా నివేదికల ఆధారంగా సంబంధిత యజమానులపై కేసులు నమోదు చేస్తామని ఆహార భద్రత అధికారులు హెచ్చరించారు. హోటల్ యజమానులకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు, ఎఫ్ఎస్ఎస్ఏఐ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
US: నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలో విజేతగా నిలిచిన 12 ఏళ్ల ఎన్నారై బాలుడు
తాజావార్తలు
-
Shreyas Iyer: కేక్పై ఐసింగ్ లాంటిది.. టీమిండియా కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్!
-
Sriram Krishnan: ట్రంప్ ప్రభుత్వానికి షాక్.. AI విధాన సలహాదారు పదవికి శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా
-
Drishyam 3 Hindi Version : ‘దృశ్యం 3’ హిందీ వెర్షన్ లో భారీ మార్పులు… రీజన్ ఇదేనా ?
-
Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
-
Rajat Patidar: రెండు ఐపీఎల్ టైటిల్స్, 500 రన్స్.. పాటిదార్ ఎంపిక కాకపోవడంపై అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!