Hyderabad Parks: హైదరాబాద్ సిటీ పార్కుల్లో షీ టీమ్స్ నిఘా.. పట్టుబడితే ఫైన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Parks: హైదరాబాద్లోని పలు పబ్లిక్ పార్కుల్లో చాలా కాలంగా సామాన్యులను ఇబ్బంది పెడుతున్న సమస్యపై పోలీసులు దృష్టి సారించారు. సాయంత్రం పూట కుటుంబసభ్యులు, పిల్లలతో సరదాగా గడుపడానికి వెళుతున్నవారికి అక్కడికి వచ్చిన జంటల చేస్తున్న చేష్టలు ఇబ్బందిగా మారింది. ఎవరు చూస్తున్నా, ఏం చేస్తున్నా కూడా.. యువ జంటలు పార్కుల్లో వెకిరి చేష్టలతో తెగ ఇబ్బందికి గురవుతున్నారు. పొదల దగ్గర బహిరంగంగా.. బెంచీల మీద కూర్చుని ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం చాలా ఇబ్బంది కరంగా మారుతుంది. ముఖ్యంగా ఇందిరాపార్క్, కృష్ణకాంత్ పార్క్, నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లో ఇలాంటి దృశ్యాలు తరచూ కనిపిస్తున్నాయి. ఆ ప్రేమలో మునిగి తేలుతున్న జంటలకు ఇవి మామూలు విషయాలుగానే అనిపించినా వారిని చూస్తున్న వారికి మాత్రం చాలా కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా చిన్నారులకు కనిపిస్తే వారికి ఊహించని ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. కాలేజ్ పూర్తి చేసి రిలాక్స్ అయ్యేందుకు వచ్చే యువత కూడా దీని వల్ల దారి తప్పే ప్రమాదం ఉంది. ఆఫీసులో పని ముగించుకుని నడుచుకుంటూ వచ్చే పెద్దలకు ఇది కాస్త ఇబ్బంది.
Read also: Chandrababu: రాజకీయ జీవితంలో ఎన్నడూ చేయనంత కసరత్తు చేశాం..
Also Read
- Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
- 22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
- Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
- Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
అయితే గతంలో ఇందిరాపార్క్ యాజమాన్యం దీన్ని చక్కదిద్దేందుకు కొన్ని ప్రయత్నాలు చేసినా వివాదంగా మారింది. పార్క్లోని ప్రశాంత వాతావరణానికి భంగం కలగకుండా, 2021 ఆగస్టులో, పార్క్ వెలుపల ‘పెళ్లి కాని జంటలకు అనుమతి లేదు’ అని యాజమాన్యం బోర్డు పెట్టింది. ఇది వివాదాస్పదంగా మారడంతో వెనక్కి తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయా పార్కుల్లో యువ జంటలు ప్రేమాయణం సాగిస్తున్నారు. దీంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని గ్రహించిన షీ టీమ్స్ శుక్రవారం రంగంలోకి దిగింది. పార్కులు మరియు ఇతర బహిరంగ ప్రదేశాల్లో అనుచితంగా ప్రవర్తించినందుకు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్, నెక్లెస్ రోడ్, కృష్ణకాంత్ పార్క్ మరియు అనేక బహిరంగ ప్రదేశాల్లో జంటలను షీ టీమ్ పట్టుకుంది. ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని కౌన్సెలింగ్ ఇచ్చి జరిమానా విధించి అక్కడి నుంచి పంపించేశారు. బహిరంగ ప్రదేశాల్లో సామాన్యులకు ఇబ్బంది కలిగించే పనులు చేయరాదని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని షీ టీమ్స్ హెచ్చరించింది. ఇక నుంచి బహిరంగ ప్రదేశాల్లో నిఘా ఉంటుందని షీ టీం అధికారులు వెల్లడించారు.
Pawan Kalyan: సీట్ల ప్రకటన తర్వాత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
-
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
-
Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
-
Teacher Suspended: విద్యార్థినులతో లీలలు.. ప్రభుత్వ టీచర్ సస్పెండ్..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..