Hyderabad Parks: హైదరాబాద్ సిటీ పార్కుల్లో షీ టీమ్స్ నిఘా.. పట్టుబడితే ఫైన్..!
Hyderabad Parks: హైదరాబాద్లోని పలు పబ్లిక్ పార్కుల్లో చాలా కాలంగా సామాన్యులను ఇబ్బంది పెడుతున్న సమస్యపై పోలీసులు దృష్టి సారించారు. సాయంత్రం పూట కుటుంబసభ్యులు, పిల్లలతో సరదాగా గడుపడానికి వెళుతున్నవారికి అక్కడికి వచ్చిన జంటల చేస్తున్న చేష్టలు ఇబ్బందిగా మారింది. ఎవరు చూస్తున్నా, ఏం చేస్తున్నా కూడా.. యువ జంటలు పార్కుల్లో వెకిరి చేష్టలతో తెగ ఇబ్బందికి గురవుతున్నారు. పొదల దగ్గర బహిరంగంగా.. బెంచీల మీద కూర్చుని ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం చాలా ఇబ్బంది కరంగా మారుతుంది. ముఖ్యంగా ఇందిరాపార్క్, కృష్ణకాంత్ పార్క్, నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లో ఇలాంటి దృశ్యాలు తరచూ కనిపిస్తున్నాయి. ఆ ప్రేమలో మునిగి తేలుతున్న జంటలకు ఇవి మామూలు విషయాలుగానే అనిపించినా వారిని చూస్తున్న వారికి మాత్రం చాలా కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా చిన్నారులకు కనిపిస్తే వారికి ఊహించని ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. కాలేజ్ పూర్తి చేసి రిలాక్స్ అయ్యేందుకు వచ్చే యువత కూడా దీని వల్ల దారి తప్పే ప్రమాదం ఉంది. ఆఫీసులో పని ముగించుకుని నడుచుకుంటూ వచ్చే పెద్దలకు ఇది కాస్త ఇబ్బంది.
Read also: Chandrababu: రాజకీయ జీవితంలో ఎన్నడూ చేయనంత కసరత్తు చేశాం..
Also Read
- Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
- Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
- Off The Record : ఖమ్మం పాలిటిక్స్.. కలెక్టర్లు తట్టుకోలేకపోతున్నారా? ముగ్గురి మార్పు వెనుక అసలు కథ!
- TIMS Sanathnagar: సనత్నగర్ వాసులకు శుభవార్త.. శుక్రవారం నుంచి టిమ్స్లో వైద్య సేవలు ప్రారంభం..!
అయితే గతంలో ఇందిరాపార్క్ యాజమాన్యం దీన్ని చక్కదిద్దేందుకు కొన్ని ప్రయత్నాలు చేసినా వివాదంగా మారింది. పార్క్లోని ప్రశాంత వాతావరణానికి భంగం కలగకుండా, 2021 ఆగస్టులో, పార్క్ వెలుపల ‘పెళ్లి కాని జంటలకు అనుమతి లేదు’ అని యాజమాన్యం బోర్డు పెట్టింది. ఇది వివాదాస్పదంగా మారడంతో వెనక్కి తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయా పార్కుల్లో యువ జంటలు ప్రేమాయణం సాగిస్తున్నారు. దీంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని గ్రహించిన షీ టీమ్స్ శుక్రవారం రంగంలోకి దిగింది. పార్కులు మరియు ఇతర బహిరంగ ప్రదేశాల్లో అనుచితంగా ప్రవర్తించినందుకు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్, నెక్లెస్ రోడ్, కృష్ణకాంత్ పార్క్ మరియు అనేక బహిరంగ ప్రదేశాల్లో జంటలను షీ టీమ్ పట్టుకుంది. ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని కౌన్సెలింగ్ ఇచ్చి జరిమానా విధించి అక్కడి నుంచి పంపించేశారు. బహిరంగ ప్రదేశాల్లో సామాన్యులకు ఇబ్బంది కలిగించే పనులు చేయరాదని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని షీ టీమ్స్ హెచ్చరించింది. ఇక నుంచి బహిరంగ ప్రదేశాల్లో నిఘా ఉంటుందని షీ టీం అధికారులు వెల్లడించారు.
Pawan Kalyan: సీట్ల ప్రకటన తర్వాత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!