Hyderabad Parks: హైదరాబాద్ సిటీ పార్కుల్లో షీ టీమ్స్ నిఘా.. పట్టుబడితే ఫైన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Parks: హైదరాబాద్లోని పలు పబ్లిక్ పార్కుల్లో చాలా కాలంగా సామాన్యులను ఇబ్బంది పెడుతున్న సమస్యపై పోలీసులు దృష్టి సారించారు. సాయంత్రం పూట కుటుంబసభ్యులు, పిల్లలతో సరదాగా గడుపడానికి వెళుతున్నవారికి అక్కడికి వచ్చిన జంటల చేస్తున్న చేష్టలు ఇబ్బందిగా మారింది. ఎవరు చూస్తున్నా, ఏం చేస్తున్నా కూడా.. యువ జంటలు పార్కుల్లో వెకిరి చేష్టలతో తెగ ఇబ్బందికి గురవుతున్నారు. పొదల దగ్గర బహిరంగంగా.. బెంచీల మీద కూర్చుని ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం చాలా ఇబ్బంది కరంగా మారుతుంది. ముఖ్యంగా ఇందిరాపార్క్, కృష్ణకాంత్ పార్క్, నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లో ఇలాంటి దృశ్యాలు తరచూ కనిపిస్తున్నాయి. ఆ ప్రేమలో మునిగి తేలుతున్న జంటలకు ఇవి మామూలు విషయాలుగానే అనిపించినా వారిని చూస్తున్న వారికి మాత్రం చాలా కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా చిన్నారులకు కనిపిస్తే వారికి ఊహించని ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. కాలేజ్ పూర్తి చేసి రిలాక్స్ అయ్యేందుకు వచ్చే యువత కూడా దీని వల్ల దారి తప్పే ప్రమాదం ఉంది. ఆఫీసులో పని ముగించుకుని నడుచుకుంటూ వచ్చే పెద్దలకు ఇది కాస్త ఇబ్బంది.
Read also: Chandrababu: రాజకీయ జీవితంలో ఎన్నడూ చేయనంత కసరత్తు చేశాం..
Also Read
- Housing Scheme: సొంతిళ్లు లేని వారికి శుభవార్త.. రేపటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..
- Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
- KTR: 'రైతులకు యూరియా లేదు.. ఢిల్లీకి మాత్రం సంచులు ఉన్నాయి'..
- Uday Krishna Reddy: లైంగిక వేధింపుల కేసులో ట్విస్ట్.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డి ఆత్మహత్య యత్నం..!
అయితే గతంలో ఇందిరాపార్క్ యాజమాన్యం దీన్ని చక్కదిద్దేందుకు కొన్ని ప్రయత్నాలు చేసినా వివాదంగా మారింది. పార్క్లోని ప్రశాంత వాతావరణానికి భంగం కలగకుండా, 2021 ఆగస్టులో, పార్క్ వెలుపల ‘పెళ్లి కాని జంటలకు అనుమతి లేదు’ అని యాజమాన్యం బోర్డు పెట్టింది. ఇది వివాదాస్పదంగా మారడంతో వెనక్కి తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయా పార్కుల్లో యువ జంటలు ప్రేమాయణం సాగిస్తున్నారు. దీంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని గ్రహించిన షీ టీమ్స్ శుక్రవారం రంగంలోకి దిగింది. పార్కులు మరియు ఇతర బహిరంగ ప్రదేశాల్లో అనుచితంగా ప్రవర్తించినందుకు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్, నెక్లెస్ రోడ్, కృష్ణకాంత్ పార్క్ మరియు అనేక బహిరంగ ప్రదేశాల్లో జంటలను షీ టీమ్ పట్టుకుంది. ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని కౌన్సెలింగ్ ఇచ్చి జరిమానా విధించి అక్కడి నుంచి పంపించేశారు. బహిరంగ ప్రదేశాల్లో సామాన్యులకు ఇబ్బంది కలిగించే పనులు చేయరాదని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని షీ టీమ్స్ హెచ్చరించింది. ఇక నుంచి బహిరంగ ప్రదేశాల్లో నిఘా ఉంటుందని షీ టీం అధికారులు వెల్లడించారు.
Pawan Kalyan: సీట్ల ప్రకటన తర్వాత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Nagarjuna : టాలీవుడ్’కు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్.. లాస్ట్ మినిట్ టెన్షన్లపై ఓపెన్ కామెంట్స్!
-
Mohammad Kaif: ‘రిటైర్మెంట్ ముచ్చట ముగిసింది.. విమర్శకుల ముక్కు కట్ అయింది’: మహ్మద్ కైఫ్
-
Nagarjuna: “ఈ అరుపుల కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురుచూశాడు”.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో నాగార్జున ఎమోషనల్!
-
Housing Scheme: సొంతిళ్లు లేని వారికి శుభవార్త.. రేపటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..
-
Nag Chaitanya: ‘ఆ రోజు నుంచే అఖిల్ నా హీరో’.. తమ్ముడిపై నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!