Rohit Chaudhary: పాల్వాయి స్రవంతి గెలుపు ఖాయం.. సెకండ్ ప్లేస్ కోసమే ఆ పార్టీలు పోటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Chaudhary Sudheer Reddy Predicts Palvai Sravanthi Win In Munugode Elections: నేను 20 రోజులుగా మునుగోడు నియోజకవర్గంలో తిరుగుతున్నానని.. ఈ ఉప ఎన్నికల్లో పాల్వాయి స్రవంతి గెలుపు ఖాయమని ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి నమ్మకం వెలిబుచ్చారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెండో స్థానం కోసం పోటీ పడుతున్నాయని పేర్కొన్నారు. ఒకరు రూ. 150 కోట్లు పెడితే.. మరొకరు రూ. 200 కోట్లు ఖర్చు చేస్తోందని.. ఖర్చు విషయంలో ఆ రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోందన్నారు. గ్రౌండ్లో ఆ రెండు పార్టీలపై నమ్మకం పోయిందని.. రాజగోపాల్ రెడ్డి రూ. 18 వేల కోట్లకు అమ్ముడుపోయారని పబ్లిక్ అనుకుంటున్నారని చెప్పారు. మూడేళ్ళుగా రాజగోపాల్ మునుగోడు ప్రజలకు ఏం చేయలేదని విమర్శించారు. మునుగోడును కేటీఆర్ దత్తత తీసుకుంటానని చెప్తున్నారని.. తెలంగాణ ప్రజలే కేసీఆర్ కుటుంబాన్ని దత్తత తీసుకొని పదవులు ఇచ్చారని సెటైర్లు వేశారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారుతుందంటే.. తెలంగాణ అంశమే లేకుండా పోతుందని హెచ్చరించారు.
ఇదే సమయంలో.. అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, మునుగోడులో కాంగ్రెస్ ప్రచారం బాగుందన్నారు. అందరికంటే ముందుగా తామే ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశామన్నారు. స్రవంతి గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు. కొందరు నేతలు భారత్ జోడో యాత్ర ప్రిపరేషన్లో బిజీగా ఉన్నారన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు భారీగా ఖర్చు చేస్తున్నాయని ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘం ఎక్కడుంది? కళ్లు మూసుకుని ఉందా? అని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం కళ్లు తెరవకపోతే.. పెను ప్రమాదం తప్పదని హెచ్చరించారు. వివక్షాలు కామెంట్స్ చేస్తున్నట్టు.. కాంగ్రెస్ పార్టీ వెనుక పడలేదని, ప్రజల మనసులోనే ఉందని అన్నారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో బీజేపీ గానీ, టీఆర్ఎస్ గానీ ఏం చేశాయని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం వచ్చినప్పుడు.. పాదాభివందనం చేయడంలో తప్పు లేదని వెల్లడించారు.
Also Read
- Telangana 22A Land Issues: 22ఏ భూ సమస్యల పరిష్కారానికి హైలెవల్ కమిటీ.. రేపటి నుంచే దరఖాస్తులు
- KTR: "రూ.1000 కోట్లు ఇస్తే మా ఆస్తులన్నీ ఇచ్చేస్తా".. సీఎం రేవంత్రెడ్డికి కేటీఆర్ ఆఫర్.. ..
- Ponguleti Srinivasa Reddy: అసైన్డ్ భూములు లాక్కోం.. పట్టాదారులకు ఇబ్బంది ఉండదని మంత్రి స్పష్టం
- Haribabu Murder: ‘ఎస్.. నేనే చంపేశా’.. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో బిగ్ ట్విస్ట్..
తాజావార్తలు
-
iPhone 18 Pro అడిగిన భార్య.. బంగారం అమ్మి మరీ కొనిచ్చిన భర్త..
-
Gautam Gambhir: హార్దిక్ వస్తే నితీశ్ రెడ్డి పరిస్థితి ఏంటి?.. గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు!
-
Mirzapur The Movie: 14వ రోజూ దుమ్మురేపిన ‘మీర్జాపూర్: ది మూవీ’.. రూ.300 కోట్ల క్లబ్కు అడుగు దూరంలో!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
FSSAI Action on Nestle: నెస్లే ఇండియాకు ఎఫ్ఎస్ఎస్ఏఐ బిగ్ షాక్.. పసిపిల్లల ఆహార ఉత్పత్తులపై లీగల్ నోటీసులు
ట్రెండింగ్
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!