Rajendranagar Crime: లారీని ఢీ కొట్టిన కారు.. ఇరుక్కున్న మృతదేహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajendranagar Crime: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డు పై రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీస్ అకాడమీ సమీపంలో ఎమర్జెన్సీ లేన్ లో ఆగి ఉన్న లారీని వేగంగా ఢీ కొట్టింది కారు. స్పీడ్ గా లారీని ఢీ కొట్టడంతో కారు సగం వరకు దూకుకొని వెళ్లింది. దీంతో కారు నడుపుతున్న డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో డ్రైవర్ మృతదేహం ఇరుక్కుని పోయింది. స్థానికులు పోలీసులకు సమచారం అందించడంతో.. హుటా హుటిన చేరుకుని క్రేన్ సహాయంతో కారును బయటకు లాగీ అతి కష్టం మీద మృతదేహాన్ని ట్రాఫిక్, ఓఆర్ఆర్ సిబ్బంది బయటకు తీసారు. గచ్చిబౌలి నుండి శంషాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని కాప్స్ అంటున్నారు. మృతుడు కర్ణాటకకు చెందిన రేవన్ సిద్ధాగా గుర్తించారు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Reada also: Astrology : మార్చి 29, బుధవారం దినఫలాలు
Also Read
- CM Revanth Reddy : ఖేలో ఇండియా గేమ్స్కు తెలంగాణ రెడీ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
- Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- OTR : ఆదాయం రూ.14 కోట్లు.. అప్పు రూ.300 కోట్లు..! కొత్తగూడెంలో ఇదేం లెక్క..?
నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు భీంగల్ వద్ద రాగానే రోడ్డు పక్కనే ఓ జేసీబీ దానిపై పడిపోయింది. కారులో వున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కానీ కారులోనే ఇద్దరు ఇరుక్కుపోయారు. స్థానికంగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కారులో చిక్కుకున్న ఇద్దరిని బయటకుతీసి ఆసుపత్రికి తరలించారు. బాధితులను మోర్తాడ్కు చెందినవారిగా గుర్తించారు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read also: Cruel Daughter: ఒళ్లు గగుర్పొడిచేలా తల్లిదండ్రులను గొడ్డలితో నరికేసింది.. డ్రగ్స్ ఇచ్చి మరీ..
సూర్యాపేటలో ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగి మంటలు చెలరేగాయి. ఖమ్మం డిపోకు చెందిన రాజధాని AC బస్ TS – 04Z – 0198 లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ ఇంజిన్ నుంచి మంటలు రావడాన్ని గమనించి బస్సును నిలిపివేశాడు. ప్రయాణికులందరిని కిందికి దిగిపోవడంతో తృటిలో ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపంతోనే బస్సులో మంటలు చెలరేగినట్లు గుర్తించారు. ఎటువంటి ప్రమాదం జరగక పోవడంతో ప్రయాణికులందరు ఊపిరి పీల్చుకున్నారు.
Sperm Donor: ఈ వైద్యుడికి 550 మంది సంతానం..! కోర్టుకెక్కిన మహిళ
తాజావార్తలు
-
Toxic – Ramayana : సినిమా ఎలా ఉన్నా హైప్ మాత్రం భారీగా ఉండాలి.. ఇప్పుడిదే ట్రెండ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
Shubman Gill: భారత క్రికెట్ చరిత్రను మార్చనున్న కెప్టెన్ గిల్.. విరాట్, రోహిత్కి కూడా సాధ్యం కాలేదు..
-
Rocky Flintoff: తండ్రిని మించిన కొడుకు.. 18 ఏళ్ల రాకీ ఫ్లింటాఫ్ విధ్వంసం.. తండ్రి రికార్డులే టార్గెట్!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
ట్రెండింగ్
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!