Road Accident: చైతన్యపురిలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు నండిపింది ఎమ్మార్వో కొడుకే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accident: చైతన్యపురిలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్థరాత్రి దాటిన తరువాత 1.30 గంటలకు ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా, కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కారు చౌటుప్పల్ ఎమ్మార్వో హరికృష్ణకు చెందినదిగా గుర్తించారు. కారును ఎమ్మార్వో కుమారుడు సాయి కార్తీక్ నడుపుతున్నట్లు దర్యాప్తులో వివరించారు. ప్రమాదంలో గాయపడిన ఏడుగురిలో నలుగురు యువకులను గాంధీ ఆస్పత్రి కి తరలించి,సాయి కార్తీక్ తో పాటు మరో ఇద్దరు యువకులని కొత్త పేట ఓమ్ని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం తీవ్ర స్థాయిలో జరగడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. యువకులకు తీవ్ర గాయాలు కావడంతో అందరూ అపస్మారక స్థితిలో ఉన్నారని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. చైతన్య పురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read also: Dawood Ibrahim : వాంతులు – 102 డిగ్రీల జ్వరం… దావూద్ ఇబ్రహీం పరిస్థితి ఎలా ఉందంటే ?
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
- Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
- ACB Raids : ట్రాన్స్కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
చైతన్యపురి రోడ్డు ప్రమాదంలో చనిపోయిన యువకుడి పేరు విశాల్ గా గుర్తించారు. రాజీవ్ గాంధీ నగర్ కమాన్ దగ్గర ఉన్న ఓ పార్టీకి చెందిన దిమ్మెపై విశాల్ కూర్చున్నాడని.. అయితే.. కారు ఒక్కసారిగా దిమ్మెదగ్గరకు వచ్చి ఢీ కొట్టడంతో తప్పించుకునే ప్రయత్నం చేసిన కారు వేగానికి విశాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. విశాల్ తండ్రి గతంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దీంతో విశాల్ కుటుంబంలో విషాదం అలుముకుంది. కుటుంబానికి ఆసరాగా వుంటారనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని కుటుంబ సభ్యులు వాపోయారు. కుటుంబానికి దిక్కెవరు అంటూ కన్నీరుమున్నీరయ్యారు. మరోవైపు రోడ్డు ప్రమాదంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ళల్లో తాగాలి అంతే గాని తాగి ఇలా రోడ్ల పైకి వచ్చి ప్రమాదాలు చేస్తే ఎవరిది బాధ్యత అంటూ మండిపడ్డారు. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని రోడ్ల పై వాహనాలను నడపాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.
Bigg Boss 7 Telugu: బంఫర్ ఆఫర్ కొట్టేసిన గౌతమ్.. మూడు సినిమాల్లో హీరోగా ఛాన్స్..
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!