Road Accident: చైతన్యపురిలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు నండిపింది ఎమ్మార్వో కొడుకే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accident: చైతన్యపురిలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్థరాత్రి దాటిన తరువాత 1.30 గంటలకు ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా, కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కారు చౌటుప్పల్ ఎమ్మార్వో హరికృష్ణకు చెందినదిగా గుర్తించారు. కారును ఎమ్మార్వో కుమారుడు సాయి కార్తీక్ నడుపుతున్నట్లు దర్యాప్తులో వివరించారు. ప్రమాదంలో గాయపడిన ఏడుగురిలో నలుగురు యువకులను గాంధీ ఆస్పత్రి కి తరలించి,సాయి కార్తీక్ తో పాటు మరో ఇద్దరు యువకులని కొత్త పేట ఓమ్ని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం తీవ్ర స్థాయిలో జరగడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. యువకులకు తీవ్ర గాయాలు కావడంతో అందరూ అపస్మారక స్థితిలో ఉన్నారని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. చైతన్య పురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read also: Dawood Ibrahim : వాంతులు – 102 డిగ్రీల జ్వరం… దావూద్ ఇబ్రహీం పరిస్థితి ఎలా ఉందంటే ?
Also Read
- AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సస్పెండ్ చేసిన హైకోర్టు..
- Minister Ponnam: గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష..
- Telangana Rainfall Deficit: తెలంగాణలో వానల కోసం ఎదురుచూపులు.. సెప్టెంబర్పైనే ఆశలు!
- High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!
చైతన్యపురి రోడ్డు ప్రమాదంలో చనిపోయిన యువకుడి పేరు విశాల్ గా గుర్తించారు. రాజీవ్ గాంధీ నగర్ కమాన్ దగ్గర ఉన్న ఓ పార్టీకి చెందిన దిమ్మెపై విశాల్ కూర్చున్నాడని.. అయితే.. కారు ఒక్కసారిగా దిమ్మెదగ్గరకు వచ్చి ఢీ కొట్టడంతో తప్పించుకునే ప్రయత్నం చేసిన కారు వేగానికి విశాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. విశాల్ తండ్రి గతంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దీంతో విశాల్ కుటుంబంలో విషాదం అలుముకుంది. కుటుంబానికి ఆసరాగా వుంటారనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని కుటుంబ సభ్యులు వాపోయారు. కుటుంబానికి దిక్కెవరు అంటూ కన్నీరుమున్నీరయ్యారు. మరోవైపు రోడ్డు ప్రమాదంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ళల్లో తాగాలి అంతే గాని తాగి ఇలా రోడ్ల పైకి వచ్చి ప్రమాదాలు చేస్తే ఎవరిది బాధ్యత అంటూ మండిపడ్డారు. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని రోడ్ల పై వాహనాలను నడపాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.
Bigg Boss 7 Telugu: బంఫర్ ఆఫర్ కొట్టేసిన గౌతమ్.. మూడు సినిమాల్లో హీరోగా ఛాన్స్..
తాజావార్తలు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్బై
-
SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
-
Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
-
Andhra Pradesh Tax Revenue: ఏపీ ఖజానాకు ఊహించని ఊపు.. ఆగస్టులో భారీగా పెరిగిన పన్నుల ఆదాయం
-
SCO Summit: పాక్ ప్రధాని ముందే ఉగ్రవాదంపై మోడీ స్ట్రాంగ్ మెసేజ్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!