Road Accident: చైతన్యపురిలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు నండిపింది ఎమ్మార్వో కొడుకే..!
Road Accident: చైతన్యపురిలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్థరాత్రి దాటిన తరువాత 1.30 గంటలకు ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా, కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కారు చౌటుప్పల్ ఎమ్మార్వో హరికృష్ణకు చెందినదిగా గుర్తించారు. కారును ఎమ్మార్వో కుమారుడు సాయి కార్తీక్ నడుపుతున్నట్లు దర్యాప్తులో వివరించారు. ప్రమాదంలో గాయపడిన ఏడుగురిలో నలుగురు యువకులను గాంధీ ఆస్పత్రి కి తరలించి,సాయి కార్తీక్ తో పాటు మరో ఇద్దరు యువకులని కొత్త పేట ఓమ్ని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం తీవ్ర స్థాయిలో జరగడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. యువకులకు తీవ్ర గాయాలు కావడంతో అందరూ అపస్మారక స్థితిలో ఉన్నారని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. చైతన్య పురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read also: Dawood Ibrahim : వాంతులు – 102 డిగ్రీల జ్వరం… దావూద్ ఇబ్రహీం పరిస్థితి ఎలా ఉందంటే ?
Also Read
- Explore to Expand: తెలంగాణ టూ గ్లోబల్.. 'ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్' వేదికను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు
- Revanth Reddy: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి 'బంపర్ గిఫ్ట్'.. 100 రోజుల్లో రూ. 6 వేల కోట్లు క్లియర్!
- Abhishek Sharma: హనుమాన్ ఆలయంలో కాటేరమ్మ కొడుకు.. రేపు దబిడిదిబిడే..
- Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
చైతన్యపురి రోడ్డు ప్రమాదంలో చనిపోయిన యువకుడి పేరు విశాల్ గా గుర్తించారు. రాజీవ్ గాంధీ నగర్ కమాన్ దగ్గర ఉన్న ఓ పార్టీకి చెందిన దిమ్మెపై విశాల్ కూర్చున్నాడని.. అయితే.. కారు ఒక్కసారిగా దిమ్మెదగ్గరకు వచ్చి ఢీ కొట్టడంతో తప్పించుకునే ప్రయత్నం చేసిన కారు వేగానికి విశాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. విశాల్ తండ్రి గతంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దీంతో విశాల్ కుటుంబంలో విషాదం అలుముకుంది. కుటుంబానికి ఆసరాగా వుంటారనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని కుటుంబ సభ్యులు వాపోయారు. కుటుంబానికి దిక్కెవరు అంటూ కన్నీరుమున్నీరయ్యారు. మరోవైపు రోడ్డు ప్రమాదంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ళల్లో తాగాలి అంతే గాని తాగి ఇలా రోడ్ల పైకి వచ్చి ప్రమాదాలు చేస్తే ఎవరిది బాధ్యత అంటూ మండిపడ్డారు. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని రోడ్ల పై వాహనాలను నడపాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.
Bigg Boss 7 Telugu: బంఫర్ ఆఫర్ కొట్టేసిన గౌతమ్.. మూడు సినిమాల్లో హీరోగా ఛాన్స్..
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!